hyderabadupdates.com Gallery అభివృద్దికి న‌మూనా ప్ర‌జా పాల‌న : సీఎం

అభివృద్దికి న‌మూనా ప్ర‌జా పాల‌న : సీఎం

అభివృద్దికి న‌మూనా  ప్ర‌జా పాల‌న : సీఎం post thumbnail image

ఖ‌మ్మం జిల్లా : వైరా ప‌ట్ట‌ణం అభివృద్ది కోసం రూ. 200 కోట్లు మంజూరు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైరా పట్టణంలో భారీ ర్యాలీ మరియు కార్నర్ మీటింగ్‌ నిర్వహించడం జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రుల‌తో పాటు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ , డీసీసీ నూతి సత్యనారాయణ గౌడ్ , ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ ఎన్నికలు కేవలం ఓటింగ్ కార్యక్రమం కాద‌ని, వైరా భవిష్యత్తును నిర్ణయించే తీర్పు అని పేర్కొన్నారు. అభివృద్ధి దిశగా ముందుకు సాగాలా, లేక గత నిర్లక్ష్య పాలనను కొనసాగించాలా అన్నది ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ హయాంలోనే వైరాలో అభివృద్ధి జరిగింద‌ని చెప్పారు అనుముల రేవంత్ రెడ్డి. రూ.200 కోట్లతో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, 100 పడకల ఆసుపత్రి, జూనియర్ కాలేజీ, ఐటీఐను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్‌గా అభివృద్ధి చేయడం, పాలిటెక్నిక్ మంజూరు వంటి కార్యక్రమాలు వైరా భవిష్యత్తుకు బలమైన పునాదిగా మార‌నుంద‌ని చెప్పారు. చిన్న వ్యాపారుల కోసం షాపింగ్ కాంప్లెక్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కాలువల లైనింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. వైరాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకు ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతాం అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులందరినీ గెలిపించాలని ప్ర‌జ‌లను కోరారు రేవంత్ రెడ్డి.
The post అభివృద్దికి న‌మూనా ప్ర‌జా పాల‌న : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

పోరాడ‌ట‌మే త‌ప్పా పొత్తులంటూ ఉండ‌వుపోరాడ‌ట‌మే త‌ప్పా పొత్తులంటూ ఉండ‌వు

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంలో రాజకీయాలు మ‌రింత ఆస‌క్తిని రేపుతున్నాయి. టీవీకే పార్టీ ద‌ళ‌ప‌తి విజ‌య్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ పార్టీ ఒంట‌రిగానే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఏ పార్టీతో తాము పొత్తు పెట్టుకునే ప్ర‌స‌క్తి

Minister Laxman Kumar: హరీశ్‌ కు మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ ఓపెన్ ఛాలెంజ్Minister Laxman Kumar: హరీశ్‌ కు మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ ఓపెన్ ఛాలెంజ్

    మంత్రివర్గ సమావేశంలో ఏం జరిగిందనే అంశంపై మాజీ మంత్రి హరీశ్‌రావు చర్చకు రావాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ సవాల్‌ విసిరారు. ఆదివారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్ర

DK Shivakumar: కిరణ్‌ మజుందార్‌ షా పై డీకే వ్యంగ్యాస్త్రాలుDK Shivakumar: కిరణ్‌ మజుందార్‌ షా పై డీకే వ్యంగ్యాస్త్రాలు

    బెంగళూరు రోడ్ల పరిస్థితిపై ఇటీవల తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ విషయంపై బయోకాన్ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్ షా విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ విషయంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ వ్యంగ్యంగా బదులిచ్చారు.