hyderabadupdates.com Gallery ఆదిత్య ధ‌ర్ రియ‌ల్ రాక్ స్టార్ : అనుప‌మ్ ఖేర్

ఆదిత్య ధ‌ర్ రియ‌ల్ రాక్ స్టార్ : అనుప‌మ్ ఖేర్

ఆదిత్య ధ‌ర్ రియ‌ల్ రాక్ స్టార్ : అనుప‌మ్ ఖేర్ post thumbnail image

ముంబై : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన దురంధ‌ర్ -2 దుమ్ము రేపుతోంది. కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. మార్చి 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆశించిన దానికంటే అద్భుతంగా ఉందంటూ పెద్ద ఎత్తున ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఈ త‌రుణంలో స్పందించాడు న‌టుడు అనుప‌మ్ ఖేర్. ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నాడు. ఈ సినిమాను తాను చూశాన‌ని, సంబ్ర‌మాశ్చ‌ర్యాల‌కు లోన‌య్యాన‌ని తెలిపాడు. ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నాడు అనుప‌మ్ ఖేర్.
దురంధ‌ర్ -2 లో ప‌చ్చి నిజాలు చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడ‌ని తెలిపాడు. కొన్నిసార్లు మాటలు కూడా సరిపోవు అన్నాడు. మీరు సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు, మీ అంతరంగంలో ఒక నిశ్శబ్దం ఆవహిస్తుందన్నాడు. ఇది కేవలం ఒక సినిమా కాదని, ఇది ఒక అనుభవం. ఒక భావోద్వేగం. నిశ్శబ్దంగా మీ హృదయంలోకి ప్రవేశించి, ఆపై అక్కడి నుండి బయటకు వెళ్లడానికి నిరాకరించే ఒక ప్రయాణం ఇది అని స్ప‌ష్టం చేశాడు. నాకు కలిగిన భావనలను బంధించడానికి నేను ప్రయత్నించాన‌ని తెలిపాడు అనుప‌మ్ ఖేర్. నేను ఇంకా ఎంతసేపైనా మాట్లాడుతూనే ఉండగలిగేవాడిని. ఎందుకంటే కొన్ని కథలు కేవలం వర్ణించడానికి ఉద్దేశించినవి కావు అని అన్నాడు. ఇదిలా ఉండ‌గా ఆదిత్య ధ‌ర్ తీసిన దురంధ‌ర్ -1కి దురంధ‌ర్ -2 సీక్వెల్. ఈ మూవీ భారీ క‌లెక్ష‌న్ల‌తో దూసుకు పోతోంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది.
The post ఆదిత్య ధ‌ర్ రియ‌ల్ రాక్ స్టార్ : అనుప‌మ్ ఖేర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

హైద‌రాబాద్ లో ఘ‌నంగా కైట్, స్వీట్ ఫెస్టివ‌ల్హైద‌రాబాద్ లో ఘ‌నంగా కైట్, స్వీట్ ఫెస్టివ‌ల్

హైద‌రాబాద్ : సంక్రాంతి ప‌ర్వ‌దినం పుర‌స్క‌రించుకుని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లోని ప‌రేడ్ గ్రౌండ్స్ లో నిర్వ‌హంచిన అంతర్జాతీయ కైట్ , స్వీట్ ఫెస్టివల్ ఘనంగా జ‌రిగింది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ నిర్వహించిన ఈ మూడు రోజుల ఉత్సవం

YS Jagan: వైఎస్‌ జగన్‌ నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలుYS Jagan: వైఎస్‌ జగన్‌ నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు

  వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. దీపావళి వేడుకల్లో వైఎస్‌ జగన్‌ దంపతులు పాల్గొన్నారు. వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణి వైఎస్‌ భారతి బాణాసంచా కాల్చారు. దీపావళి వేడుకలు సందర్భంగా వైఎస్‌ జగన్‌

Matsya-6000: సముద్ర అన్వేషణకు దేశీయ సముద్రయాన వాహనం మత్స్య–6000Matsya-6000: సముద్ర అన్వేషణకు దేశీయ సముద్రయాన వాహనం మత్స్య–6000

  సముద్ర అంతర్భాగంలోని రహస్యాలను ఛేదించడానికి భారత ఆక్వానాట్స్‌ రమేశ్‌ రాజు, జతీందర్‌పాల్‌ సింగ్‌ సిద్ధమవుతున్నారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ‘మత్స్య–6000’సముద్రయాన వాహనంలో వచ్చే ఏడాది ఆరంభంలో సాగర మథనం చేయబోతున్నారు. 28 టన్నుల బరువైన ఈ వాహనం సముద్రంలో