hyderabadupdates.com Gallery ఉపాధి హామీ ప‌థ‌కాన్ని నీరుగార్చిన మోదీ స‌ర్కార్

ఉపాధి హామీ ప‌థ‌కాన్ని నీరుగార్చిన మోదీ స‌ర్కార్

ఉపాధి హామీ ప‌థ‌కాన్ని నీరుగార్చిన మోదీ స‌ర్కార్ post thumbnail image

అమ‌రావ‌తి : మోదీ స‌ర్కార్ నిర్వాకంపై , అనుస‌రిస్తున్న విధానాల‌పై నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట ( MGNREGA) పరిరక్షణ యాత్ర 6 వ రోజు శ‌నివారం తిరుపతి జిల్లాలో సాగింది. సూళ్లూరుపేట నియోజక వర్గం కోటపోలూరు గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు ష‌ర్మిలా రెడ్డి. గ్రామస్థులు మన్రేగా చట్టమే కొనసాగాలని, మోడీ తెచ్చిన అక్రమ చట్టం VB G – RAM G ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చేస్తున్న పరిరక్షణ పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా ష‌ర్మిలా రెడ్డి ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.
దేశంలోనే తొలిసారిగా ఆనాడు యూపీఏ స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో ఏపీలోని అనంత‌పురం జిల్లాలో మొద‌ట‌గా మ‌హాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం ను ప్రారంభించ‌డం జ‌రిగింద‌ని గుర్తు చేశారు. ఆనాటి నుంచి మొన్న‌టి దాకా కోట్లాది మంది కూలీల‌కు ఉపాధి క‌ల్పించింద‌ని అన్నారు. కానీ కావాల‌ని మోదీ స‌ర్కార్ కార్పొరేట్ కంపెనీల‌కు మేలు చేకూర్చేలా, నిధులు ఇవ్వ‌కుండా , రాష్ట్రాల‌పై భారం ప‌డేలా ఉపాధి హామీ ప‌థకం చ‌ట్టాన్ని నీరుగార్చేలా కొత్త చ‌ట్టాన్ని తీసుకు వ‌చ్చార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దీని కార‌ణంగా పేద‌లు, కూలీలు, కార్మికుల‌కు బ‌త‌క‌డం మ‌రింత బ‌రువుగా మారి పోతుంద‌న్నారు ష‌ర్మిలా రెడ్డి. మ‌హాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం పున‌రుద్ద‌రించాల‌ని ఆమె డిమాండ్ చేశారు.
The post ఉపాధి హామీ ప‌థ‌కాన్ని నీరుగార్చిన మోదీ స‌ర్కార్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సికింద్రాబాద్ న‌గ‌రం చ‌రిత్ర ఘ‌నం : ఈట‌ల రాజేంద‌ర్సికింద్రాబాద్ న‌గ‌రం చ‌రిత్ర ఘ‌నం : ఈట‌ల రాజేంద‌ర్

హైద‌రాబాద్ : బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సికింద్రాబాద్ పై. ప్ర‌స్తుతం కాంగ్రెస్ స‌ర్కార్ చ‌రిత్ర‌ను చెరిపి వేస్తోందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మ‌రో వైపు ఈ న‌గ‌రానికి చెందిన ప్ర‌జ‌లు స్వ‌చ్చంధంగా బ‌య‌ట‌కు వ‌చ్చారు. వారంతా ప్ర‌భుత్వానికి

ఏపీ బ‌డ్జెట్ లో బీసీల అభ్యున్న‌తికి ప్ర‌యారిటీఏపీ బ‌డ్జెట్ లో బీసీల అభ్యున్న‌తికి ప్ర‌యారిటీ

అమరావతి : బీసీల అభ్యున్నతి పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది మరోసారి రుజువైందని, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో వెనుకబడిన వర్గాల సంక్షేమానికి చరిత్రలో కనీవినీ ఎరుగని కేటాయింపులు చేశారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్

డ్ర‌గ్ టెస్టుకు నేను సిద్దం మీరు రెడీనా..?డ్ర‌గ్ టెస్టుకు నేను సిద్దం మీరు రెడీనా..?

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. త‌న‌ను ల‌క్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎం రేవంత్ రెడ్డి డ్ర‌గ్స్ తీసుకుంటున్నాన‌ని నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఒక