hyderabadupdates.com Gallery ఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ద‌రించాలి

ఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ద‌రించాలి

ఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ద‌రించాలి post thumbnail image

నెల్లూరు జిల్లా : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కాన్ని తిరిగి పునరుద్ద‌రించాల‌ని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఉపాధి హామీ ప‌థ‌క ప‌రిర‌క్ష‌ణ యాత్ర కొన‌సాగుతోంది. ఈ యాత్ర గురువారం నెల్లూరు జిల్లాకు చేరుకుంది. మునుబోలు మండలం అక్కంపేట గ్రామంలో జ‌రిగిన‌ మన్రేగా పరిరక్షణ సభలో పాల్గొని ప్ర‌సంగించారు. ఆనాడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్న స‌మ‌యంలోనే ఏపీ ఉమ్మ‌డి రాష్ట్రం లో అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేశార‌ని గుర్తు చేశారు. పేద‌ల‌కు ఎంతో మేలు జరిగేలా చేశార‌న్నారు. ఉచిత క‌రెంట్ తో వ్య‌వ‌సాయాన్ని పండుగ‌గా మార్చేసిన ఘ‌న‌త వైఎస్సార్ దేన‌ని అన్నారు ష‌ర్మిలా రెడ్డి. ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కంతో పేద‌ల‌కు ఎంతో మేలు చేకూరింద‌న్నారు. కోట్లాది మందికి ఆరోగ్య ప‌రంగా సేవ‌లు అందాయ‌ని , ఇంకా అందుతూనే ఉన్నాయ‌న్నారు.
ఒక ర‌కంగా చెప్పాలంటే ఆరోగ్య శ్రీ ప‌థ‌కం పేద‌ల‌కు సంజీవినిగా మారింన్నారు ష‌ర్మిలా రెడ్డి. ఫీజు రీయంబర్స్ మెంట్ పథకంతో కోట్ల మంది ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. ఒకటి కాదు రెండు కాదు YSR తెచ్చిన ప్రతి పథకం అద్భుతం అన్నారు. త‌న తండ్రి ఆశ‌యాల నుంచే క‌ర‌వు ప‌ని పుట్టింద‌ని చెప్పారు. 2006లో రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్న స‌మ‌యంలోనే అనంత‌పురం జిల్లాలో ఉపాధి హామీ ప‌థ‌కం ప్రారంభ‌మైంద‌న్నారు ఏపీపీసీసీ చీఫ్‌. మన్మోహన్ సింగ్ , సోనియా గాంధీ ఈ పథకాన్ని బండ్లపల్లి నుంచి ప్రారంభించార‌ని చెప్పారు. రాష్ట్ర గ్రామీణ అభివృద్దికి మ‌న్రేగా ప‌థ‌కం ఎంతో దోహ‌ద ప‌డేలా చేసింద‌న్నారు ష‌ర్మిలా రెడ్డి.
The post ఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ద‌రించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

75 దేశాల పౌరుల‌కు వీసా సేవ‌లు నిలిపివేత‌75 దేశాల పౌరుల‌కు వీసా సేవ‌లు నిలిపివేత‌

అమెరికా : యావ‌త్ ప్ర‌పంచానికి కోలుకోలేని షాక్ ఇచ్చారు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి. ఇప్ప‌టికే వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు తీసుకుంటూ బెంబేలెత్తిస్తున్న ట్రంప్ ఉన్న‌ట్టుండి మ‌రో బాంబు పేల్చారు. గురువారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

ఆదిలాబాద్ జిల్లాకు ముఖ్య‌మంత్రి వ‌రాల వెల్లువఆదిలాబాద్ జిల్లాకు ముఖ్య‌మంత్రి వ‌రాల వెల్లువ

ఆదిలాబాద్ జిల్లా : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు వ‌రాల జ‌ల్లులు కురిపించారు. తెలంగాణలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికను ప్రకటించారు. బాసర ఐఐఐటీలో విశ్వ విద్యాలయం, నిర్మల్‌లో

IPS officer: హరియాణా ఐపీఎస్‌ ఆత్మహత్య కేసులో ఎస్పీపై వేటుIPS officer: హరియాణా ఐపీఎస్‌ ఆత్మహత్య కేసులో ఎస్పీపై వేటు

IPS officer : హరియాణాలోని సీనియర్‌ ఐపీఎస్ అధికారి పూరన్‌ కుమార్‌ (Pooran Kumar) ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.