hyderabadupdates.com Gallery ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ స్వంతం

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ స్వంతం

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ స్వంతం post thumbnail image

హైద‌రాబాద్ : ద‌మ్మున్న డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం ఉస్తాద్ భ‌గత్ సింగ్. ఇప్ప‌టికే 70 శాతానికి పైగా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. అయితే ఈ మూవీ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. కానీ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ రాజ‌కీయాల‌లో భాగంగా ఉండ‌డం వ‌ల్ల ద‌ర్శ‌కుడికి ఎక్కువ స‌మ‌యం కేటాయించ లేక పోయాడు. దీంతో ఈ సినిమా వ‌స్తుందా రాదా అన్న అనుమానం కూడా వ్య‌క్తం అయ్యింది ఒకానొక స‌మ‌యంలో. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్స్, వీడియోలు, మీమ్స్, పోస్ట‌ర్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. తాజాగా దేఖ్ లేంగే సాలా అన్న సాంగ్ సోష‌ల్ మీడియాను షేక్ చేసింది. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు.
ఇదిలా ఉండ‌గా ఈ పాట‌ను దేవిశ్రీ త‌న తండ్రి, దివంగ‌త స‌త్యానంద్ కు అంకితం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవ్ మెంట్స్ కు అనుగుణంగా పాట‌ను చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేశాడు హ‌రీశ్ శంక‌ర్. త‌ను గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. అదే గ‌బ్బ‌ర్ సింగ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఓ రేంజ్ లోకి తీసుకు వెళ్లేలా చేసింది. ఇదిలా ఉండ‌గా తాజాగా ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ కు సంబంధించి కీల‌క‌మైన అప్ డేట్ వ‌చ్చింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను కైవ‌సం చేసుకునేందుకు ఓటీటీ సంస్థ‌లు పెద్ద ఎత్తున పోటీ ప‌డ్డాయి. చివ‌ర‌కు అమెరికాకు చెందిన నెట్ ఫ్లిక్స్ భారీ ధ‌ర‌కు టేకోవ‌ర్ చేసుకున్న‌ట్లు టాక్.
The post ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ స్వంతం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

హిందీలో ‘సినిమా’ చేస్తున్న వేణు ఉడుగుల‌హిందీలో ‘సినిమా’ చేస్తున్న వేణు ఉడుగుల‌

హైద‌రాబాద్ : ద‌ర్శ‌క‌, నిర్మాత వేణు ఉడుగుల బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. త‌ను ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆపై నిర్మాత‌గా స‌క్సెస్ అయ్యాడు. అష్ట క‌ష్టాలు ప‌డి, అప్పులు చేసిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా తీశాడు. తాజాగా

YS Sharmila: దొంగ ఓట్ల లెక్కలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి – వైఎస్ షర్మిలYS Sharmila: దొంగ ఓట్ల లెక్కలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి – వైఎస్ షర్మిల

  బీజేపీ దొంగ ఓట్లకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సంతకాల సేకరణ చేపట్టింది. ప్రజల నుంచి సేకరించిన సంతకాలను హస్తం నేతలు ట్రక్కులో ఢిల్లీకి పంపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్

CM Chandrababu: అమరావతిలో గ్రంథాలయ నిర్మాణానికి శోభా గ్రూప్‌ రూ.100 కోట్ల విరాళంCM Chandrababu: అమరావతిలో గ్రంథాలయ నిర్మాణానికి శోభా గ్రూప్‌ రూ.100 కోట్ల విరాళం

  ఏపీ రాజధాని అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంథాలయ నిర్మాణానికి శోభా గ్రూప్ విరాళం ప్రకటించింది. శోభా గ్రూప్ సంస్థ అమరావతిలో ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మించేందుకు ముందుకు రావటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.