బెంగళూరు : ఐపీఎల్ టికెట్ల వ్యవహారం తీవ్ర దుమారానికి తెర తీయడం చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో దానిని సరిదిద్దే ప్రయత్నం చేశారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) మ్యాచ్ ల కు గాను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 3 టికెట్లు , అంతర్జాతీయ మ్యాచ్ లకకు 2 టికెట్లు కేటాయించేందుకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్ ప్రసాద్ ఒప్పుకున్నారని తెలిపారు. బెంగళూరులోకేఎస్సీఏ, ఆర్సీబీ యాజమాన్య ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు డీకే. చిన్న స్వామి స్టేడియంలో మ్యాచ్ లను వీక్షించేందుకు ఈ మేరకు ఒప్పందం కుదిరిందని వెల్లడించారు.
ఇదిలా ఉండగా టికెట్ల వ్యవహారంపై పెద్ద ఎత్తున శాసన సభ వేదికగా నిలదీశారు అధికార, ప్రతిపక్ష సభ్యులు. దీనిపై సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని కోరారు. దీంతో రంగంలోకి దిగారు ఉప ముఖ్యమంత్రి. ఎమ్మెల్యేలకు ఉచితంగా టికెట్లు కేటాయించక పోతే ఎలా అని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక్ నిప్పులు చెరిగారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే విజయానంద్ కాశప్పనవర్ కూడా దీనిని ప్రస్తావించారు. ప్రజా ప్రతినిధులకు ఉచితంగా టికెట్లు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారు డీకే శివకుమార్. రాజస్థాన్, ముంబై, ఢిల్లీ, కోల్కతా , గుజరాత్ వంటి రాష్ట్రాల్లో టికెట్ల పంపిణీలో బ్యూరోక్రాట్లు ముఖ్య భూమిక పోషిస్తారని అన్నారు .
వారితో పోలిస్తే కర్ణాటకలో ఈ విషయంలో ప్రభుత్వ జోక్యం చాలా తక్కువగా ఉందన్నారు డిప్యూటీ సీఎం.
అయితే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కు సంబంధించిన అన్ని వ్యవహారాల్లోనూ ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.
The post ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మూడు ఐపీఎల్ టికెట్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మూడు ఐపీఎల్ టికెట్లు
Categories: