hyderabadupdates.com Gallery ఏపీలో మ‌రో 15 ఏళ్ల పాటు కూట‌మి స‌ర్కార్ కొన‌సాగాలి

ఏపీలో మ‌రో 15 ఏళ్ల పాటు కూట‌మి స‌ర్కార్ కొన‌సాగాలి

ఏపీలో మ‌రో 15 ఏళ్ల పాటు కూట‌మి స‌ర్కార్ కొన‌సాగాలి post thumbnail image

అమరావతి : రాష్ట్రంలో మరో 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యత ఇలాగే కొనసాగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఈ 20 నెలల్లో కూటమి నాయకత్వంలో ఎక్కడా విభేదాలు ఏర్పడలేదని, ఇది శుభ పరిణామమని అన్నారు. ఇదే ఐక్యత ఇకపైనా కొనసాగాలని, అప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని స్ప‌ష్టం చేశారు. ఇందుకు తగ్గట్టుగా మంచి పనులు చేసి ఎమ్మెల్యేలు పేరు తెచ్చుకోవాలన్నారు. మొన్నటి ఎన్నికల కంటే నేడు కూటమి బలం, ప్రజల మద్దతు మరింత పెరిగిందన్నారు. ఎన్నికల ముందు ఏ స్ఫూర్తితో పనిచేశామో, అదే స్ఫూర్తితో మున్ముందు పని చేయాలన్నారు. మూడు పార్టీలు ఐక్యంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి ఉండాలన్నారు. అసెంబ్లీ కమిటీ హాలులో ఎన్డీఏ శాసనసభా పక్ష ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
గుజరాత్‌లో వరుసగా ఐదుసార్లు బీజేపీ గెలిచి అధికారంలో ఉందని, ఇదే స్ఫూర్తితో ఇక్కడా విజయాలు సొంతం చేసుకోవాలన్నారు. శాశ్వతంగా రాజకీయాల్లో నిలబడేలా అందరూ మంచి పేరు తెచ్చుకోవాలని సీఎం సూచించారు. ఈ 20 నెలల్లో చాలా కష్టపడి, ఐక్యంగా పని చేశామని సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ ఐదేళ్ల ఏళ్ల విధ్వంసాన్ని అధిగమించి… ప్రగతి వైపు రాష్ట్రాన్ని తీసుకు వెళుతున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం 15 ఏళ్లు కూటమి కలిసి ఉంటుందని, ఐక్యంగా ముందుకు వెళతుందని డిప్యూటీ సీఎం చెప్పారు. ఎన్నికల్లో ఏ స్ఫూర్తితో పనిచేశామో… భవిష్యత్‌లో అలాగే పని చేయాల్సి ఉంటుందన్నారు. పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటే అంతర్గతంగా కూర్చుని వాటిని పరిష్కరించుకోవాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. కూటమి ధర్మాన్నికి ప్రతి ఒక్కరం కట్టుబడి బడి పని చేయాలని సూచించారు.
The post ఏపీలో మ‌రో 15 ఏళ్ల పాటు కూట‌మి స‌ర్కార్ కొన‌సాగాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

కేసీఆర్ తో పెట్టుకోవ‌డం అంటే పులిని గోక్క‌వ‌డ‌మేకేసీఆర్ తో పెట్టుకోవ‌డం అంటే పులిని గోక్క‌వ‌డ‌మే

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్ బాస్, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి, త‌న తండ్రి కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి స‌ర్కార్ ఏర్పాటు చేసిన సిట్ విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ నోటీసులు

రెండు వేర్వేరు కేసుల‌పై పై సిట్ ఏర్పాటురెండు వేర్వేరు కేసుల‌పై పై సిట్ ఏర్పాటు

హైద‌రాబాద్ : తెలంగాణ డీజీపీ శివ ధ‌ర్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రెండు వేర్వేరు కేసుల‌కు సంబంధించి సిట్ ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. దీనికి సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ ప‌ర్య‌వేక్షిస్తార‌ని తెలిపారు. మంగ‌ళ‌వారం డీజీపీ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్

KTR: దానంనాగేందర్ పై కేటీఆర్ సెటైర్లుKTR: దానంనాగేందర్ పై కేటీఆర్ సెటైర్లు

  ఏ పార్టీలో ఉన్నాడో చెప్పలేని దానం నాగేందర్‌ను స్టార్‌ క్యాంపెయినర్‌గా పెట్టుకోవడం కాంగ్రెస్‌ దిక్కుమాలిన రాజకీయాలకు నిదర్శనమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను స్టార్‌ క్యాంపెయినర్‌గా ఎలా నియమిస్తారని కాంగ్రెస్ ను నిలదీశారు.