hyderabadupdates.com Gallery క‌త్తి -2 మూవీపై లోకేష్ క‌న‌గ‌రాజ్ షాకింగ్ కామెంట్స్

క‌త్తి -2 మూవీపై లోకేష్ క‌న‌గ‌రాజ్ షాకింగ్ కామెంట్స్

క‌త్తి -2 మూవీపై లోకేష్ క‌న‌గ‌రాజ్ షాకింగ్ కామెంట్స్ post thumbnail image

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స్పెష‌ల్ ఇమేజ్ క‌లిగిన ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్. త‌న స్టైల్ ఆఫ్ మేకింగ్ డిఫ‌రెంట్ గా ఉంటుంది. అందుకే త‌న‌తో ప‌ని చేయాల‌ని ప్ర‌తి న‌టి, న‌టుడు , టెక్నీషియ‌న్స్ ఆశిస్తారు. కోరుకుంటారు కూడా. తాజాగా తాను క‌త్తి మూవీ గురించి స్పందించాడు. తాను ఆ మూవీ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌ర‌గ‌డం పై మండిప‌డ్డాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా ప్ర‌చారం చేస్తారంటూ వాపోయాడు. దీంతో తానే స్వ‌యంగా వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు లోకేష్ క‌న‌గ‌రాజ్. ఇదిలా ఉండ‌గా గ‌తంలోనే క‌త్తి మూవీ రిలీజ్ అయ్యింది. బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. దీంతో ప్ర‌స్తుతం బిగ్ స‌క్సెస్ అయిన మూవీస్ కు కొన‌సాగింపుగా సీక్వెల్స్ తీసే ప‌నిలో ప‌డ్డారు ద‌ర్శ‌కులు.
ఆ కోవ‌లోకి వ‌చ్చేశాడు కోలీవుడ్ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్. అయితే న‌టుడు సూర్య నటించనున్న ప్రత్యేక రోలెక్స్ చిత్రం కూడా ఇంకా నిర్మాణ దశలో ఉందని లోకేష్ ధృవీకరించారు. ఇక క‌త్తి -2 సీక్వెల్ ఆగి పోయిందంటూ దుష్ప్ర‌చారం జ‌ర‌గ‌డం ప‌ట్ల ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఈ సీక్వెల్ ప‌నులు ముమ్మురంగా కొన‌సాగుతున్నాయ‌ని చెప్పాడు. అయితే పాన్ ఇండియా యంగ్ హీరో అల్లు అర్జున్ తో త‌న మూవీ పూర్తి చేశాక నెక్ట్స్ ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంద‌న్నాడు లోకేష్ క‌న‌గ‌రాజ్. కాగా ఇత‌ర సినిమాల‌తో తాను ఒప్పందం చేసుకోవ‌డం, వాటిని పూర్తి చేయ‌డంపై ఫుల్ ఫోక‌స్ పెట్టాన‌ని , అందుకే ఈ సీక్వెల్ పై ఇంకా ముందుకు సాగ‌డం లేద‌న్నాడు కోలీవుడ్ డైరెక్ట‌ర్.
The post క‌త్తి -2 మూవీపై లోకేష్ క‌న‌గ‌రాజ్ షాకింగ్ కామెంట్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

చేనేత‌న్న‌ల‌కు ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్చేనేత‌న్న‌ల‌కు ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

అమరావతి : నేతన్నలకు రాష్ట్ర స‌ర్కార్ తీపి కబురు చెప్పంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత త్రిఫ్గ్ ఫండ్ నిధులను జారీచేసినట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ప్ర‌క‌టించారు. చేనేత సహకార సంఘాల బ్యాంకు

Maharashtra: అవినీతిలో అగ్రస్థానంలో మహారాష్ట్ర !Maharashtra: అవినీతిలో అగ్రస్థానంలో మహారాష్ట్ర !

    దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే అవినీతిలో మహారాష్ట్ర అగ్రస్ధానంలో ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,875 అవినీతి కేసులు నమోదు కాగా ఒక్క మహారాష్ట్రలోనే ఏకంగా 795 కేసులు నమోదయ్యాయి.

Mamata Banerjee: ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన మమతా బెనర్జీMamata Banerjee: ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన మమతా బెనర్జీ

    బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారంనాడు విరుచుకుపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) బెంగాలీ మాట్లాడే పౌరులను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ‘నిశ్శబ్ద రిగ్గింగ్’ అని ఆరోపించారు.