hyderabadupdates.com Gallery కాంగ్రెస్ నేత‌ల దాడుల‌పై దాసోజు శ్ర‌వ‌ణ్ ఫైర్

కాంగ్రెస్ నేత‌ల దాడుల‌పై దాసోజు శ్ర‌వ‌ణ్ ఫైర్

కాంగ్రెస్ నేత‌ల దాడుల‌పై దాసోజు శ్ర‌వ‌ణ్ ఫైర్ post thumbnail image

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలెక్షన్ జరగాల్సిన రాష్ట్రంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాచ‌రిక పాల‌న కొన‌సాగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే మున్సిప‌ల్ ఎన్నిక‌లు స‌జావుగా నిర్వ‌హిస్తార‌నే న‌మ్మ‌కం లేకుండా పోయింద‌న్నారు. ప్ర‌త్యేకించి ప్ర‌తిపక్ష పార్టీల‌కు చెందిన అభ్య‌ర్థుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నార‌ని ఆరోపించారు. అనుముల రేవంత్ రెడ్డి రాజ్యాంగం కొన‌సాగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే భయంతో రేవంత్ రెడ్డి బూతు పురాణంతో భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. సీఎం అండ చూసుకుని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కనీస రాజకీయ సంస్కారం లేకుండా మాజీ మంత్రి మల్లారెడ్డిపై దాడి చేసేందుకు ప్ర‌య‌త్నం చేశార‌ని ఆరోపించారు. క్యాతనెపల్లి మున్సిపాలిటీలో మాజీ మంత్రి హరీశ్ రావు పైనా దాడి చేసే ప్రయత్నం జరిగిందని అన్నారు.
సాక్షాత్తూ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన స్పీకర్ నియోజకవర్గంలోనే బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఏక‌గ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులను బెదిరించడం, బలవంతంగా బుర్కాలు కప్పించి లోపలికి తీసుకెళ్లి విత్‌డ్రా చేయించడం వంటి దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. కోడంగల్‌లో కూడా ఇదే తరహా రౌడీయిజం కొనసాగిందన్నారు డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్. బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు స్వేచ్ఛగా ప్రచారం చేసుకోకుండా అడ్డుకోవడం ద్వారా ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలెక్షన్ జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసకర వాతావరణాన్ని సృష్టిస్తోందని అన్నారు. పోలీసులను తొత్తులుగా మార్చుకుని తన పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందంటూ మండిప‌డ్డారు. ఇదే దాడికి సంబంధించి బీఆర్ఎస్ నేత‌లు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం అధికారికి ఫిర్యాదు కూడా చేయ‌డం జ‌రిగింద‌న్నారు.
The post కాంగ్రెస్ నేత‌ల దాడుల‌పై దాసోజు శ్ర‌వ‌ణ్ ఫైర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

అమరావతి : ఈ నెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రులు ఎస్.సవిత, గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని పేరెడ్స్ గ్రౌండ్ లో జరగనున్న ఈ వేడుకల సందర్భంగా మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా 36

Nara Lokesh: ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రీవెన్స్ నిర్వహించాలి – మంత్రి లోకేశ్‌Nara Lokesh: ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రీవెన్స్ నిర్వహించాలి – మంత్రి లోకేశ్‌

    పార్టీకి కార్యకర్తే అధినేత అని… ఆ దిశగా ప్రతి కార్యకర్తకు పార్టీలో ప్రాధాన్యం ఉండాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. అధికారం వచ్చిందనే నిర్లక్ష్యం వద్దని హితవు పలికారు. తెదేపా కేంద్ర

CM Nitish Kumar: మొదటి సారి మీడియా మందుకు నితీష్ కుమార్ వారసుడుCM Nitish Kumar: మొదటి సారి మీడియా మందుకు నితీష్ కుమార్ వారసుడు

    బిహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు ఎన్డీయే భాగస్వామి, జనతాదళ్ యునైటెడ్ అధినేత నితీష్ కుమార్‌. అయితే, సాక్షాత్తూ సీఎం తనయుడైనప్పటికీ ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండే నితీష్ కుమార్ ఏకైక కుమారుడు నిషాంత్