hyderabadupdates.com movies కాంతార.. ఇక్కడ రికార్డ్.. అక్కడ లాస్

కాంతార.. ఇక్కడ రికార్డ్.. అక్కడ లాస్

మొత్తానికి ‘కాంతార: చాప్టర్-1’ సాధించింది. ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్‌గా ఈ కన్నడ సినిమా నిలుస్తుందా లేదా అనే సస్పెన్సుకు తెరపడింది. ఎట్టకేలకు ‘కాంతార: చాప్టర్-1’ ఆ రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన బాలీవుడ్ మూవీ ‘ఛావా’ రూ.807 కోట్లతో రికార్డు నెలకొల్పగా.. తర్వాత ఏ చిత్రమూ దాన్ని దాటలేకపోయింది. ‘సైయారా’ రూ.600 కోట్ల వరకు వచ్చి ఆగిపోయింది. ‘కూలీ’ రికార్డు సాధిస్తుందనుకుంటే దానికీ అది సాధ్యం కాలేదు. 

ఐతే భారీ అంచనాల మధ్య వచ్చిన ‘కాంతార: చాప్టర్-1’.. ఆ అంచనాలకు తగ్గట్లే బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టి రికార్డును సొంతం చేసుకుంది. విడుదలైన 22వ రోజుకు కాంతార వసూళ్లు రూ.818 కోట్లకు చేరుకున్నాయి. ఇది వరల్డ్ వైడ్ కలెక్షన్. ఐతే ఇంతకు మించి ‘కాంతార: చాప్టర్-1’ వసూళ్లు పెద్దగా పెరిగే అవకాం కనిపించడం లేదు. ఈ సినిమా వెయ్యి కోట్ల మార్కును కూడా అందుకోవచ్చనే అంచనాలు కలిగాయి కానీ.. అది సాధ్యం కాలేదు. ఈ చిత్రం మరి కొన్ని రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

‘కాంతార: చాప్టర్-1’ ఓవరాల్‌గా 2025 ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది కానీ.. ఓవర్సీస్‌లో మాత్రం ఇది లాస్ వెంచరే అయింది. ఈ సినిమా నార్త అమెరికాలో 7 మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ అయ్యేది. కానీ ఈ సినిమా అక్కడ 5 మిలియన్ల దగ్గర ఆగిపోయింది. ప్రిమియర్స్‌‌కు ఆశించిన స్పందన లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది. తొలి వీకెండ్లో కూడా ఓ మోస్తరు వసూళ్లే వచ్చాయి. సినిమాకు లాంగ్ రన్ ఉన్నప్పటికీ.. ఓపెనింగ్స్ తగ్గడం మైనస్ అయి సినిమా అక్కడ లాస్ వెంచర్‌గా మిగిలింది.

Related Post

భార్యతో వలపు వల… 100 వీడియోలు తీసిన భర్తభార్యతో వలపు వల… 100 వీడియోలు తీసిన భర్త

ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న క్రైం కథనాలు చూస్తే షాక్ కు గురి కావాల్సిందే. ఇలా కూడా చేస్తారా? అన్న ప్రశ్న వేసుకునే వేళ.. మారిన కాలంలో విలువలు పాతాళానికి చేరిన వేళ.. ఇలానే కాదు ఏమైనా చేసే కొందరు దుర్మార్గులు

అమరావతికి 100 కోట్ల విరాళం.. ఎందుకంటే!అమరావతికి 100 కోట్ల విరాళం.. ఎందుకంటే!

న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తికి భారీ విరాళం ల‌భించింది. 100 కోట్ల రూపాయ‌ల విరాళం ఇవ్వ‌నున్న‌ట్టు దుబాయ్ కు చెందిన శోభా గ్రూప్ సంస్థ‌ చైర్మన్ పీఎన్సీ మీనన్ తెలిపారు. ఈ నిధుల‌తో ప్ర‌పంచ స్థాయి గ్రంథాల‌యాన్ని నిర్మించాల‌ని మీన‌న్ సూచించారు. ప్ర‌స్తుతం