hyderabadupdates.com Gallery కాళేశ్వరం బ్యారేజీల ప‌నులు వేగవంతం చేయాలి

కాళేశ్వరం బ్యారేజీల ప‌నులు వేగవంతం చేయాలి

కాళేశ్వరం బ్యారేజీల ప‌నులు వేగవంతం చేయాలి post thumbnail image

హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని మూడు కీలకమైన బ్యారేజీలైన మేడిగడ్డ, అన్నారం, సుండిల్లను వీలైనంత త్వరగా తిరిగి కార్యాచరణలోకి తీసుకు రావడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కాల పరిమితితో కూడిన కార్యక్రమంలో ప్రాజెక్టును పూర్తి స్థాయి కార్యాచరణ స్థితికి తీసుకు రావడానికి పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆయన ఈరోజు తన సచివాలయం ఛాంబర్స్‌లో, సంబంధిత శాఖలోని కీలక అధికారులు, సీడబ్ల్యూ పీఆర్ఎస్ ప్రతినిధులు, పునరుద్ధరణ డిజైన్ల బాధ్యతలు అప్పగించిన ఏజెన్సీలు , ఎల్&టితో సహా అమలు చేసే ఏజెన్సీలతో కలిసి కేఎల్ఐఎస్ బ్యారేజీల పునరుద్ధరణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డిఎస్‌ఎ), విజిలెన్స్ కమిషన్‌తో సహా చట్ట బద్ధమైన ఏజెన్సీలు ఇప్పటికే మూడు బ్యారేజీల పునాదులు, డిజైన్, ప్రణాళిక, అమలులో తీవ్రమైన లోపాలను గుర్తించాయని మంత్రి తెలిపారు. ఈ మూడు నిర్మాణాలలో ప్రాథమిక సమస్యలు ఒకే విధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కేఎల్ఐఎస్ మరమ్మతులను పూర్తి చేసే ప్రక్రియలో రాబోయే రెండు పని సీజన్‌లను (2027 మరియు 2028) కీలకమైనవిగా పరిగణించాలని మంత్రి ఆదేశించారు. అన్నారం, సుందిల్ల‌ బ్యారేజీలను నిర్దేశించిన కాల పరిమితిలోగా పూర్తిగా పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు మంత్రి. అదే సమయంలో మేడిగడ్డను కనీసం పాక్షికంగానైనా కార్యాచరణలోకి తీసుకు రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
The post కాళేశ్వరం బ్యారేజీల ప‌నులు వేగవంతం చేయాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Karur Stampede: సీబీఐ చేతికి కరూర్‌ తొక్కిసలాట కేసుKarur Stampede: సీబీఐ చేతికి కరూర్‌ తొక్కిసలాట కేసు

Karur Stampede : కరూర్‌ తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌కు(CBI) అప్పగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తునకు మద్రాసు హైకోర్టు నిరాకరించడంతో పిటిషనర్లు సుప్రీంను ఆశ్రయించారు.

Sabarimala: ఆదాయం లేని వ్యక్తి శబరిమల బంగారు తాపడం దాత ?Sabarimala: ఆదాయం లేని వ్యక్తి శబరిమల బంగారు తాపడం దాత ?

Sabarimala : శబరిమల ఆలయంలో బంగారు ఫలకాల బరువు తగ్గిపోవడంపై తలెత్తిన వివాదంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గర్భగుడి వెలుపలి బంగారు ఫలకాలకు తాపడం దాత, బెంగళూరు వ్యాపారి ఉన్నికృష్ణన్‌కి (Unnikrishnan) అసలు స్థిరమైన ఆదాయ వనరులే లేవని,

CJI BR Gavai: కేంద్ర ప్రభుత్వంపై సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఆగ్రహంCJI BR Gavai: కేంద్ర ప్రభుత్వంపై సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఆగ్రహం

    కేంద్ర ప్రభుత్వం తన ధర్మాసనం నుంచి తప్పించుకోవాలని చూస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ వ్యాఖ్యానించారు. కేసు తుది వాదనలు వినడానికి సిద్ధమైన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణను కోరుకోవడాన్ని