hyderabadupdates.com movies కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు… ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు సాగుతున్న తీరుతో పిఠాపురం జనం ఆనందోత్సహాలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పవన్ చేస్తున్న ప్రతి ప్రతిపాదన కార్యరూపం దాలుస్తున్న తీరు కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ అడిగిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే ఓకే అంటున్నా.,.. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు కూడా పవన్ అడిగినంతనే పిఠాపురం అభివృద్దికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. దీనికి కేంద్రంలో పవన్ కు మంచి పట్టే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం పవన్ కల్యాణ్ ఇటీవలే కేంద్రం వద్ద ఓ ప్రతిపాదన పెట్టిన సంగతి తెలిసిందే. జనవరిలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో పవన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధిని ఈ సందర్భంగా ప్రస్తావించిన పవన్… అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద పిఠాపురం రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలని రైల్వే మంత్రిని కోరారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్…బీజేపీకి ఎంత బాసటగా నిలుస్తున్నారో తెలిసిన కేంద్రం… ఆయన ప్రతిపాదనకు తక్షణమే ఆమోద ముద్ర వేసింది.

పిఠాపురం రైల్వే స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఎంపిక చేసినట్టు తాజాగా రైల్వే శాఖ ప్రకటించింది. ఈ పథకం కింద పిఠాపురం రైల్వే స్టేషన్ కు కొత్త రూపురేఖలు రానున్నాయి. ఇందుకోసం రైల్వే శాఖ ఏకంగా రూ.37.25 కోట్లను వెచ్చిందనుంది. త్వరలోనే స్టేషన్ అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. పనులన్నీ పూర్తి అయితే పిఠాపురం రైల్వే స్టేషన్ సికింద్రాబాద్, విజయవాడ రైల్వే స్టేషన్ల మాదిరిగా సరికొత్త రూపులో దర్శనమివ్వనుంది. అక్కడి ప్రయాణికులకు మరింత మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

Related Post

WTC: భారత్ ఫైనల్ కి వెళ్లాలంటే..WTC: భారత్ ఫైనల్ కి వెళ్లాలంటే..

సౌతాఫ్రికా చేతిలో వైట్‌వాష్ (0-2) అవ్వడం టీమిండియాకు పెద్ద దెబ్బే కాదు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) ఆశలకు గండి కొట్టినట్టే. 25 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై సిరీస్ పోయింది. ఇప్పుడు WTC పాయింట్ల పట్టికలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్

అసభ్యకరమైన వీడియో… చిక్కుల్లో జనసేన ఎమ్మెల్యే?అసభ్యకరమైన వీడియో… చిక్కుల్లో జనసేన ఎమ్మెల్యే?

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన అరవ శ్రీధర్ పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. అరవ శ్రీధర్ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్ చేశారంటూ ఆరోపణలు వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.