hyderabadupdates.com Gallery క్రీడ‌లు, రాజ‌కీయాలు భిన్నంగా ఉంటాయి : గంగూలీ

క్రీడ‌లు, రాజ‌కీయాలు భిన్నంగా ఉంటాయి : గంగూలీ

క్రీడ‌లు, రాజ‌కీయాలు భిన్నంగా ఉంటాయి : గంగూలీ post thumbnail image

కోల్ క‌తా : బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌర‌వ్ గంగూలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆయ‌న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనుస‌రించిన తీరు పై స్పందించాడు. ప్ర‌స్తుతం భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను నిర్వ‌హిస్తున్నాయి. లా అండ్ ఆర్డ‌ర్ బాగోలేద‌నే సాకుతో పీసీబీ నాట‌కాలు ఆడ‌టంపై మండిప‌డ్డారు. ఇది ఎంత మాత్రం మంచిది కాద‌న్నాడు. ఈ సంద‌ర్బంగా గంగూలీ మీడియాతో మాట్లాడారు . క్రీడ‌లు, రాజ‌కీయాలు భిన్నంగా ఉంటాయ‌ని పేర్కొన్నాడు. చివ‌ర‌కు గ‌త్యంత‌రం లేక దిగి వ‌చ్చింది. ఈ మేర‌కు పాకిస్తాన్ దేశ అధ్య‌క్షుడు సైతం జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది. మరో వైపు బంగ్లాదేశ్ జ‌ట్టు సైతం బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. చివ‌ర‌కు ఐసీసీ దెబ్బ‌కు దిగి రాక త‌ప్ప‌లేదు. శ్రీ‌లంక వేదిక‌గా తమ‌కు పూర్తి భ‌ద్ర‌త క‌ల్పిస్తే ఆడుతామ‌ని ప్ర‌క‌టించారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మ‌న్ మోహిసిన్ న‌ఖ్వీ.
దీనిపై సీరియ‌స్ కామెంట్స్ చేశాడు గంగూలీ. భారతదేశం-పాకిస్తాన్ మ్యాచ్‌లు బాగానే ఉన్నాయని, కానీ గత కొన్ని సంవత్సరాలుగా పెద్దగా పోటీ లేదని గంగూలీ పేర్కొన్నారు. ప్రభుత్వ స్థాయిలో చర్చల గురించి నాకు తెలియదు, కానీ వారు ఆడటం మంచిది. క్రీడలు వేరు, పాలిటిక్స్ వేరు అని అన్నాడు గంగూలీ. పాకిస్తాన్ జ‌ట్టు బ‌లంగా ఉండ‌వ‌చ్చు కాద‌న‌లేను. కానీ టోర్న‌మెంట్ లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ గా భార‌త జ‌ట్టు అన్ని జ‌ట్ల‌కంటే ముందంజ‌లో , టాప్ లో కొన‌సాగుతుంద‌ని ఆశా భావం వ్య‌క్తం చేశాడు సౌర‌వ్ గంగూలీ.
The post క్రీడ‌లు, రాజ‌కీయాలు భిన్నంగా ఉంటాయి : గంగూలీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సంజూ శాంస‌న్ స్వ‌యంకృతాప‌రాధంసంజూ శాంస‌న్ స్వ‌యంకృతాప‌రాధం

హైద‌రాబాద్ : అద్భుత‌మైన క్రికెట‌ర్ గా గుర్తింపు పొందాడు కేర‌ళ‌కు చెందిన సంజూ శాంస‌న్. దేశీవాళి క్రికెట్ లో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. కానీ అస‌లైన మ్యాచ్ ల‌లో ఆడ‌కుండానే చేతులెత్తేశాడు. లేక లేక అద్భుత‌మైన అవ‌కాశం వ‌చ్చింది. త‌ను భార‌త

స్పీక‌ర్ ఎందుకింత తాత్సారం సుప్రీంకోర్టు ఆగ్ర‌హంస్పీక‌ర్ ఎందుకింత తాత్సారం సుప్రీంకోర్టు ఆగ్ర‌హం

న్యూఢిల్లీ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు శుక్ర‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. తెలంగాణ‌కు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసుపై స్పందించింది. ఈ మేర‌కు ఇప్ప‌టికే జారీ చేసిన ఆదేశాల‌కు గాను తెలంగాణ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్

Japan Ambassador: సీఐఐ సమ్మిట్ లో జ‌పాన్ రాయ‌బారి తెలుగు ప్ర‌సంగంJapan Ambassador: సీఐఐ సమ్మిట్ లో జ‌పాన్ రాయ‌బారి తెలుగు ప్ర‌సంగం

      విశాఖ‌ప‌ట్నంలో జ‌రుగుతున్న పెట్టుబ‌డుల స‌ద‌స్సు వివిధ దేశాల్లోని పెట్టుబ‌డిదారుల‌ను ఆకట్టుకోవ‌డ‌మే కాదు. మ‌న తెలుగు భాష కూడా వారిని ఆక‌ట్టుకుంటోంది. ప‌రాయి దేశ‌స్తులైనా క‌ష్ట‌మైన కొంత‌మంది తెలుగు భాష మాధుర్యాన్ని చ‌విచూస్తూ సంబ‌ర‌ప‌డిపోతున్నారు. త‌మ‌కు క‌ష్ట‌మైనా త‌మ