hyderabadupdates.com Gallery క్రెడిట్ చోరిలో జగన్ ది 5జీ స్పీడ్ : వాసం శెట్టి సుభాష్

క్రెడిట్ చోరిలో జగన్ ది 5జీ స్పీడ్ : వాసం శెట్టి సుభాష్

క్రెడిట్ చోరిలో జగన్ ది 5జీ స్పీడ్ : వాసం శెట్టి సుభాష్ post thumbnail image

అమ‌రావ‌తి : రాష్ట్రంలో “క్రెడిట్ చోరీ” అనే కొత్త రాజకీయ సంస్కృతిని ప్రవేశపెట్టిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, బీమా వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు ముందుగానే ఒక అంశంపై సందేహాలు సృష్టించి, తరువాత అదే విషయాన్ని తమ విజయంగా ప్రకటించడం ఆయనకు అలవాటైందని అన్నారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ మోహన్ రెడ్డికి, అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు మంత్రి. ఎదుటివారి కష్టాన్ని తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డికి ‘క్రెడిట్ చోరీ’ చేయడంలో ఎవరూ సాటిరారని మండిప‌డ్డారు. ఏ పథకమైనా, ప్రాజెక్టైనా అది ఎందుకు అవుతుందో మొదట ప్రజలను తప్పుదోవ పట్టించి, తీరా అది పూర్తయ్యాక మాత్రం “నా వల్లనే అయింది” అని చెప్పుకోవడంలో ఆయన సిద్ధహస్తుడన‌న్నారు.
ఈ ఐదేళ్ల విధ్వంసానికి పూర్తి బాధ్యత ఆయనదేని విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వాసం శెట్టి సుభాష్ మాట్లాడారు. ఐదేళ్ల పాటు ‘మూడు ముక్కలాట’ ఆడి, అమరావతిని భ్రష్టు పట్టించిన ఘనత జగన్ దేన‌ని ఆరోపించారు. దేశ చరిత్రలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను నిలబెట్టిన క్రెడిట్ ఆయనది కాదా? అని ప్ర‌శ్నించారు. ఈరోజు మళ్లీ అమరావతి పేరు వినపడటం ఇష్టం లేక కొత్త రాగాలు అందుకుంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఐదేళ్ల పాటు అమరావతిని గ్రాఫిక్స్ అని, భ్రమ అని అవహేళన చేసిన జగన్ రెడ్డి.. ఇప్పుడు అదే ప్రాంతాన్ని ‘మావిగన్’ (MAVIGAN) అని పిలుస్తూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని మండిప‌డ్డారు వాసంశెట్టి సుభాష్. అమరావతి పేరు పలకడం ఇష్టం లేకనే ఇలా కొత్త పేర్లతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిప‌డ్డారు.
The post క్రెడిట్ చోరిలో జగన్ ది 5జీ స్పీడ్ : వాసం శెట్టి సుభాష్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Anant Singh: జన్ సురాజ్ కార్యకర్త హత్య కేసులో జేడీయూ అభ్యర్థి అరెస్టుAnant Singh: జన్ సురాజ్ కార్యకర్త హత్య కేసులో జేడీయూ అభ్యర్థి అరెస్టు

Anant Singh : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జన్‌సురాజ్‌ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ మద్దతుదారు దులార్‌చంద్‌ యాదవ్‌ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. దులార్‌చంద్‌ హత్య

బీసీసీఐతో గూగుల్ ఏఐ రూ. 270 కోట్ల ఒప్పందంబీసీసీఐతో గూగుల్ ఏఐ రూ. 270 కోట్ల ఒప్పందం

ముంబై : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ( బీసీసీఐ) తో భారీ ఆదాయం స‌మ‌కూరుతోంది. ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జం గూగుల్ బీసీసీఐతో ఒప్పందం చేసుకుంది. రూ. 270 కోట్లు బీసీసీఐకి ఇవ్వ‌నుంది. మూడు సంవ‌త్స‌రాల పాటు ఈ అగ్రిమెంట్ కొన‌సాగ‌నుంది.

Sabarimala Gold Case: శబరిమల బంగారం చోరీ కేసులో ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడు అరెస్ట్Sabarimala Gold Case: శబరిమల బంగారం చోరీ కేసులో ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడు అరెస్ట్

    శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారు తాపడాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడు, సీపీఐ(ఎం)నేత, పద్మకుమార్‌‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం సిట్ విచారణకు హాజరైన