hyderabadupdates.com movies గబ్బర్ గర్వం… ఉస్తాద్ వల్ల మాయం

గబ్బర్ గర్వం… ఉస్తాద్ వల్ల మాయం

ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఇంత వేగంగా ఫేడవుట్ అవ్వడం ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలోనే జరిగిందని చెప్పాలి. గతంలో అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్లు పవన్ చూసినప్పటికీ కనీసం దాని పేరు మీద కొన్ని ఓపెనింగ్ రికార్డులు ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని సెంటర్లలో వాటి గురించి చెప్పుకుంటారు. కానీ ఉస్తాద్ అందులో సగం కూడా చూపించలేకపోయింది. వంద కోట్ల గ్రాస్ అందుకోలేక త్వరగా సెలవు తీసుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఫైనల్ రన్ వారం క్రితమే ముగిసింది.

గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కాంబోగా దర్శకుడు హరీష్ శంకర్ – హీరో పవన్ కళ్యాణ్ మీద అప్పటిదాకా ఉన్న స్పెషల్ ఇంప్రెషన్, గర్వం మొత్తం ఉస్తాద్ భగత్ సింగ్ తో పోయింది. ముందు నుంచి ఈ ప్రాజెక్టు మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చిన కొందరు అభిమానుల భయాలకు తగ్గట్టే ఫలితం రావడం ట్రాజెడీ. మెయిన్ సెంటర్స్ లో ఇంకా థియేటర్ రన్ కొనసాగుతోంది కానీ నామ మాత్రపు వసూళ్లతో ఏదో మొక్కుబడిగా లాగిస్తున్నారు అంతే.

దురంధర్ ది రివెంజ్ ప్రభావం వల్లే ఇలా జరిగిందని ఎవరైనా సమర్ధించుకునే ప్రయత్నం చేస్తే అంతకన్నా అమాయకత్వం మరొకటి ఉండదు. ఉగాది అడ్వాంటేజ్ వల్ల ఉస్తాద్ కు ఆ మాత్రం కలెక్షన్లు వచ్చాయి కానీ ఇంకో టైంలో వచ్చి ఉంటే నెగటివిటీ, ట్రోలింగ్ ఇంకా ఎక్కువ ఉండేదేమో. హరీష్ శంకర్ విపరీతమైన ప్రమోషన్లు చేసినప్పటికీ అవేవి పని చేయలేదు. ఒక దశ దాటాక ఇక ఆపేయండి సార్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చెప్పాల్సి వచ్చింది.

ఒక్కటి మాత్రం పవన్ కళ్యాణ్ కు స్పష్టంగా అర్ధమయ్యి ఉంటుంది. కేవలం తాను ఉన్నంత మాత్రాన సినిమా చూసేందుకు జనాలు ఎగబడిపోరు. ఏపీ డిప్యూటీ సిఎంగా పాలనలో తన ముద్ర ఎంత గొప్పగా చూపించినా సినిమాల విషయంలో ప్రేక్షకుల తీర్పు ఎప్పుడు వివక్షలకు అతీతంగా ఉంటుంది. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ కు పరాజయం తప్పలేదు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోయే సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనేది ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది.

Related Post

Is Tovino Thomas opting out of NTRNeel? Pallichattambi actor reveals the reasonIs Tovino Thomas opting out of NTRNeel? Pallichattambi actor reveals the reason

Jr NTR and director Prashanth Neel are currently working on their first collaboration, tentatively titled NTRNeel (Dragon). Initially, it was speculated that Minnal Murali fame Tovino Thomas would appear as

ఏఐ లోకి జియో… మరో మ్యాజిక్ చేస్తుందా?ఏఐ లోకి జియో… మరో మ్యాజిక్ చేస్తుందా?

భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా విప్లవాన్ని తెచ్చేందుకు ముకేశ్ అంబానీ సిద్ధమయ్యారు. ఢిల్లీలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో ఆయన ఒక భారీ ప్రకటన