hyderabadupdates.com movies జగన్ పాదయాత్రపై షర్మిల సంచలన వ్యాఖలు

జగన్ పాదయాత్రపై షర్మిల సంచలన వ్యాఖలు

ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంపై నిరసనగా పాదయాత్ర చేపడుతున్నట్టు ప్రకటించిన షర్మిల తన సోదరుడు, మాజీ సీఎం జగన్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏడాదిన్నర తరువాత మరోసారి పాదయాత్ర చేయనున్నట్టు జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తన స్పందన ఏమిటని విలేకరులు ప్రశ్నించగా షర్మిల నిప్పులు చెరిగారు.

మరోసారి పాదయాత్ర అధికారం కోసమే కదా.. ఒకసారి అధికారం ఇచ్చినందుకు ఏం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాజా శేఖర్ రెడ్డి గారు మొదలు పెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేస్తానని చెప్పి అసలు పట్టించుకున్నారా? మధ్యపాన నిషేధం చేస్తానని చెప్పి కల్తీ మద్యంతో మాఫియా నడపాలేదా? అసలు గెలిచాక ప్రజల్లోకి వచ్చారా? అంటూ నిప్పులు చెరిగారు.

‘పవర్’ జగన్ రెడ్డి గారికి సూట్ అవ్వలేదని, ఆయన పద్ధతి మార్చుకొని స్వార్ధం తగ్గించుకుంటేనే మళ్ళీ దేవుడు, ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎప్పుడో 2027 లో చేయబోయే పాదయాత్రకు ఇప్పుడు ప్రకటన ఎందుకని, తాము ఇప్పుడు ప్రకటన చేసి, ఉపాధి హామికోసం ఇప్పుడే పాదయాత్ర మొదలుపెడుతున్నామని చెప్పిన షర్మిల.. మీరు చేసే పాదయాత్ర దేనికోసమని ప్రశ్నించారు.

షర్మిల వ్యాఖలు విన్న రాజకీయ విశ్లేషకులు జగన్ మోహన్ రెడ్డికి అతిపెద్ద రాజకీయ ప్రత్యర్థి షర్మిల అనడంలో ఎటువంటి సందేహం లేదంటూ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. మరి ఈ కామెంట్లకు జగన్ స్పందిస్తారా లేక ఏం వినిపించనట్టు వదిలేస్తారా అనేది వేచి చూడాలి.

Related Post

Raju Gari Pelli Ro from Anaganaga Oka Raju: It’s a Full Blown celebration anthemRaju Gari Pelli Ro from Anaganaga Oka Raju: It’s a Full Blown celebration anthem

Star Entertainer Naveen Polishetty is ready to surprise and entertain with perfect festival film Anaganaga Oka Raju. After chartbuster love for the first single Bhimavaram Balma, the second single “Raju

‘నేను తెలంగాణ ప్రజల బాణాన్ని..’‘నేను తెలంగాణ ప్రజల బాణాన్ని..’

తెలంగాణలో రాజకీయ శపథకాలు పెరుగుతున్నాయి. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ను మరోసారి అధికారంలోకి రానివ్వబోనంటూ సీఎం రేవంత్ రెడ్డి శపథం చేశారు. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమికొడతామంటూ కేసీఆర్ శపథం చేశారు. తాజాగా కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

మన దేశం పౌరసత్వం కోసం అతను చేసింది త్యాగమేమన దేశం పౌరసత్వం కోసం అతను చేసింది త్యాగమే

విదేశాలకు వెళ్లిన చాలామంది అక్కడి సిటిజన్‌షిప్ కోసం ఆరాటపడుతుంటారు. గ్రీన్ కార్డు కోసమో, పాస్‌పోర్ట్ కోసమో ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు. కానీ జర్మనీలో తొమ్మిదేళ్లుగా ఉంటున్న మయూఖ్ పాంజా అనే యువకుడు మాత్రం ఇందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నాడు. తనకు జర్మన్