కేరళ : తన జర్నీ పూల పాన్పులా సాగలేదని అన్నాడు కేరళ క్రికెటర్ , ఐసీసీ టి20 వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్. తను మీడియాతో మాట్లాడాడు. తన ప్రయాణం సాఫీగా ఏమాత్రం సాగలేదన్నాడు. ప్రతి రోజూ నేను ఇవాళే ఆఖరి రోజు అనే రీతిలో ఆడడం జరిగిందని చెప్పాడు. ఒక రకంగా చెప్పాలంటే విజయాల కంటే ఎదురు దెబ్బలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాడు. నాకు క్రికెట్ లోకి వచ్చాక . ఇండియాకు ప్రాతినిధ్యం వహించాలి. ఇదే క్రమంలో వరల్డ్ కప్ లో ఆడాలని ఉండేదన్నాడు. కప్ ను తీసుకు వస్తే ఎలా ఉంటుందో కలలో ఊహించుకున్నానని తెలిపాడు. ఇలాంటిది ఏదైనా మనస్ఫూర్తిగా చేయాలని నేను కోరుకున్నాను. నేను దానిని నా మనసులో ఊహించుకుంటూ, దాని గురించి ధ్యానం చేసేవాడిని. ఏదో ఒక రోజు నేను భారత్కు ప్రపంచ కప్ గెలిపించాలి అని అనుకునేవాడిని అని చెప్పాడు శాంసన్.
2019లో, నేను 5 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినప్పుడు అప్పటి కెప్టెన్ రోహిత్ భాయ్. ఆ రోజు నన్ను అడిగారు. భారత జట్టులో నువ్వేం చేయాలని అనుకుంటున్నావు అని. నువ్వు తిరిగి వచ్చావు కదా. అని. నేను రోహిత్ భాయ్తో చెప్పాను. నేను ప్రపంచ కప్ గెలవాలనుకుంటున్నానని తిరుగు సమాధానం ఇచ్చా. ఆనాటి నుండి నేటి దాకా ఇదే చేస్తూ వస్తున్నానని తెలిపాడు శాంసన్. 2019 నుండి నేటి 2026 వరకు. నేను ఎన్నిసార్లు వెనకబడ్డానో, ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నానో నాకంటే మీకే బాగా తెలుసు అని పేర్కొన్నాడు. నా పద్ధతి చాలా సరళమైనది. నేను చిన్నప్పటి నుండి చాలాసార్లు కిందపడ్డాను. విజయం కంటే వైఫల్యాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. నేను న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కిందపడ్డాను. కోలుకోవడానికి నాకు 4-5 రోజులు పట్టింది. మళ్ళీ ఎలా లేవాలో నాకు తెలుసు. నేను ఎగిరి పోయాను. నేను చేయాల్సింది చేశాను. నా చివరి శ్వాస వరకు, ఇదే నా అతిపెద్ద విజయంగా నిలిచి పోతుంది నా కెరీర్ లో స్పష్టం చేశాడు.
The post జర్నీలో విజయాల కంటే ఎదురు దెబ్బలే ఎక్కువ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
జర్నీలో విజయాల కంటే ఎదురు దెబ్బలే ఎక్కువ
Categories: