hyderabadupdates.com Gallery జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌కు స‌హ‌క‌రించాలి

జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌కు స‌హ‌క‌రించాలి

జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌కు స‌హ‌క‌రించాలి post thumbnail image

న్యూఢిల్లీ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌కు కేంద్రం త‌క్ష‌ణ‌మే నిధులు మంజూరు చేయాల‌ని కోరారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న కేంద్ర రోడ్లు, రవాణా , హైవే శాఖ సెక్రటరీతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించి ప‌లు ప్ర‌తిపాద‌న‌లు అంద‌జేశారు. జాతీయ ర‌హ‌దారుల‌ ప్రాజెక్టుల అభివృద్ధి, విస్తరణ, పెండింగ్ సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చ‌ర్చించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్యమైన ప్రాజెక్టుల మంజూరు, అమలును వేగవంతం చేయాలని కోరారు. ఈ సంద‌ర్బంగా మంత్రి చేసిన‌ ప్రతిపాదనలకు అనుమతులు, పెండింగ్ సమస్యలపై సానుకూలంగా స్పందించారు సెక్ర‌ట‌రీ.
ఇదిలా ఉండ‌గా కార్య‌ద‌ర్శిని క‌లిసిన అనంత‌రం మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోని చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సమన్వయంతో ఏపీలో జాతీయ ర‌హ‌దారుల‌ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు.. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుల మంజూరు, విస్తరణ పనుల అమలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కేంద్ర రోడ్లు, రవాణా , హైవే శాఖ సెక్రెటరీ ఉమాశంకర్ ను కలిసి కోరడం జరిగిందన్నారు. అనంతరం ఆయనకు తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేసి రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశామ‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎం చంద్రబాబు నాయక‌త్వంలో రాష్ట్రం అభివృద్దిలో ప‌రుగులు తీస్తోంద‌న్నారు.
The post జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌కు స‌హ‌క‌రించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అభిషేక్ శ‌ర్మ‌కు అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ‌అభిషేక్ శ‌ర్మ‌కు అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ‌

కేర‌ళ : యంగ్ క్రికెట‌ర్ అభిషేక్ శ‌ర్మ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు కేర‌ళ స్టార్ ప్లేయ‌ర్ సంజు శాంస‌న్. ప్ర‌ముఖ మీడియా సంస్థ ఇండియా టుడే నిర్వ‌హించిన కాన్ క్లేవ్ లో అభిషేక్ శ‌ర్మ‌తో పాటు సంజు శాంస‌న్ పాల్గొన్నాడు.

KTR: కేసీఆర్‌ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా – కేటీఆర్‌ సవాల్KTR: కేసీఆర్‌ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా – కేటీఆర్‌ సవాల్

    హైదరాబాద్ అభివృద్ధిపై తనతో చర్చకు రావాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సవాల్ విసిరారు. అసెంబ్లీ, సచివాలయం, గాంధీ భవన్ ఎక్కడైనా సరే.. రేవంత్‌తో చర్చకు రెడీ అన్నారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి

భ‌యాందోళ‌న‌లు సృష్టిస్తున్న కాంగ్రెస్ : మోదీభ‌యాందోళ‌న‌లు సృష్టిస్తున్న కాంగ్రెస్ : మోదీ

అస్సాం : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కాంగ్రెస్ పార్టీపై. శ‌నివారం ఆయ‌న అస్సాం రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో నిప్పులు చెరిగారు. దేశం ప్ర‌స్తుతం క్లిష్ట ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటోంద‌ని అన్నారు.