hyderabadupdates.com Gallery టీటీడీ నిత్య అన్న‌దానం ప‌థ‌కానికి 40 ఏళ్లు

టీటీడీ నిత్య అన్న‌దానం ప‌థ‌కానికి 40 ఏళ్లు

టీటీడీ నిత్య అన్న‌దానం ప‌థ‌కానికి 40 ఏళ్లు post thumbnail image

హైద‌రాబాద్ : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విల‌సిల్లుతోంది తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం. ప్ర‌తి నిత్యం 70 వేల మందికి పైగా భ‌క్తులు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకుంటారు. నిత్యం సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చే భ‌క్త బాంధ‌వుల కోసం ప్ర‌త్యేకంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం నిత్య అన్న‌దానం ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో వెంగ‌మాంబ అన్న‌దానం స‌త్రం ద్వారా ఆక‌లిని తీరుస్తోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో 1985 ఏప్రిల్ 6న ఆనాటి ముఖ్యమంత్రి , దివంగ‌త నందమూరి తారక రామారావు ప్రవేశ పెట్టిన నిత్యాన్నదాన పథకం అన్నదాన సేవలో నేటితో మరో ఏడాది పూర్తి చేసుకుంది. 4 దశాబ్దాల క్రితం కేవలం 2 వేల మందికి అన్న వితరణతో ప్రారంభమైన ఈ గొప్ప కార్యక్రమం నేడు రోజుకు 2.80 లక్షల మంది భక్తలకు అన్నప్రసాదం అందించే స్థాయికి చేరింది.
భక్తుల భాగస్వామ్యం, సహకారంతో శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ మూల నిధి ప్రస్తుతం రూ 2,500 కోట్లు దాటింది. అన్నదాన పథకం నుంచి స్ఫూర్తి పొంది ప్రాణదానం ట్రస్ట్, విద్యాదానం ట్రస్ట్ లు ఏర్పాటు చేసి టీటీడీ ద్వారా వైద్య, విద్యా సేవలను అందిస్తోంది. టీటీడీ పరిధిలోని మరో 60 దేవాలయాలతో పాటు అన్ని ప్రముఖ ఆలయాల్లో నిత్యాన్నదానం పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇంత గొప్ప కార్యక్రమానికి ముందుకు వచ్చి స‌హ‌కారం అందిస్తున్నారు దాత‌లు, మాన‌వ‌తావాదులు. ఇదిలా ఉండ‌గా ప్ర‌తి రోజు లక్ష మందికి పైగా భ‌క్తులు భోజ‌నం చేస్తున్నారు. ఒక రోజుకు దాదాపు రూ. 30 ల‌క్ష‌ల దాకా ఖ‌ర్చు అవుతోంది. ఈ నిత్య అన్న‌దానం ప‌థ‌కానికి దాత‌లు, భ‌క్తులు రూ. 1000 నుంచి రూ. కోటి దాకా ఇవ్వ‌వ‌చ్చు.
The post టీటీడీ నిత్య అన్న‌దానం ప‌థ‌కానికి 40 ఏళ్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

క‌ళ‌లు, సంస్కృతికి పూర్వ వైభ‌వం తీసుకు వ‌స్తాంక‌ళ‌లు, సంస్కృతికి పూర్వ వైభ‌వం తీసుకు వ‌స్తాం

విజ‌య‌వాడ : క‌ళ‌లు, సంస్కృతికి పూర్వ వైభ‌వాన్ని తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు రాష్ట్ర ప‌ర్యాట‌క , సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్ర స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా విజ‌య‌వాడ వేదిక‌గా పెద్ద ఎత్తున అమ‌రావ‌తి ఆవ‌కాయ్ ఫెస్టివ‌ల్

Ex Minister Perni Nani: మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదుEx Minister Perni Nani: మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు

Perni Nani : మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నానిపై (Perni Nani) చిలకలపూడి పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. మచిలీపట్నం ఆర్‌ఆర్‌ పేట పీఎస్‌లో సీఐ ఏసుబాబుపై దౌర్జన్యం చేసాన్న అభియోగంపై పేర్ని నానితో సహా 29

KCR: కాంగ్రెస్‌ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం – కేసీఆర్KCR: కాంగ్రెస్‌ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం – కేసీఆర్

KCR : కాంగ్రెస్‌ ప్రభుత్వ మోసాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కూడా గడవకుండానే… ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. పల్లెల్లోని రైతులే