hyderabadupdates.com Gallery టెక్స్ టైల్స్ పాలసీతో 2 లక్ష‌ల మందికి ఉపాధి

టెక్స్ టైల్స్ పాలసీతో 2 లక్ష‌ల మందికి ఉపాధి

టెక్స్ టైల్స్ పాలసీతో 2 లక్ష‌ల మందికి ఉపాధి post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శాస‌న మండ‌లిలో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు నూతన టెక్స్ టైల్స్ పాలసీని రూపకల్పన చేశారని మంత్రి చెప్పారు. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు రాబట్టే చర్యలు తీసుకుంటున్నామన్నారు. నూతన పాలసీతో చేనేత రంగంలో రెండు లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నది ప్రధాన ఉద్దేశమన్నారు. చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి చేనేత వస్త్రాల అమ్మకాలను పెంచామన్నారు ఎస్. స‌విత‌. ఈ కామర్స్ లోనూ చేనేత అమ్మకాలు చేస్తున్నామని, ఆన్ లైన్ సేల్స్ ద్వారా అమ్మకాలు మరింత పెరిగాయని తెలిపారు. గత ప్రభుత్వంలో నేతన్న భరోసా పథకం మాత్రమే అమలు చేసి చేతులు దులుపుకుందని ఆరోపించారు.
ఈ పథకం అమలులో అర్హత లేని వైసీపీ కార్యకర్తలకు 40 వేల మందికి లబ్ధి చేకూర్చారని మంత్రి సవిత మండిపడ్డారు. దీనివల్ల ఆప్కోలో అమ్మకాలు గణనీయంగా పెరిగాయన్నారు. చేనేత వస్త్రాల అమ్మకాలు మరింత పెరిగేలా టాటా, తనేరియా, బిర్లా సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామన్నారు ఎస్. స‌విత‌. వస్త్రాల తయారీలో నేతన్నల స్కిల్ పెరిగేలా బాపట్ల, గుంటూరు, తూర్పు గోదావరి, తిరుపతి, సత్యసాయి జిల్లాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గ‌తంలో జ‌గ‌న్ రెడ్డి వైసీపీ పాల‌న‌లో చేనేత రంగాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కానీ తాము వ‌చ్చాక చేనేత రంగానికి పూర్వ వైభ‌వాన్ని తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని చెప్పారు ఎస్. స‌విత‌.
The post టెక్స్ టైల్స్ పాలసీతో 2 లక్ష‌ల మందికి ఉపాధి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Kiran Rijiju: రాహుల్ గాంధీకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్ట్రాంగ్ కౌంటర్Minister Kiran Rijiju: రాహుల్ గాంధీకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్ట్రాంగ్ కౌంటర్

    హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్‌తో కుమ్మక్కయినందు వల్లే బీజేపీ గెలిచిందంటూ కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తిప్పికొట్టారు. రాహుల్ ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు.

Congress: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఘన విజయంCongress: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఘన విజయం

    జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయంసాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ జయకేతనం ఎగురవేశారు. తన సమీప ప్రత్యర్థి, BRS అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్లకుపైగా మెజార్టీతో ఆయన గెలుపొందారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ

75 దేశాల పౌరుల‌కు వీసా సేవ‌లు నిలిపివేత‌75 దేశాల పౌరుల‌కు వీసా సేవ‌లు నిలిపివేత‌

అమెరికా : యావ‌త్ ప్ర‌పంచానికి కోలుకోలేని షాక్ ఇచ్చారు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి. ఇప్ప‌టికే వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు తీసుకుంటూ బెంబేలెత్తిస్తున్న ట్రంప్ ఉన్న‌ట్టుండి మ‌రో బాంబు పేల్చారు. గురువారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.