hyderabadupdates.com Gallery దేశ అవ‌స‌రాల కోసం ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు

దేశ అవ‌స‌రాల కోసం ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు

దేశ అవ‌స‌రాల కోసం ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు post thumbnail image

అన‌కాప‌ల్లి : అన‌కాప‌ల్లి నియోజ‌వ‌ర్గంలోని పాయ‌క‌రావుపేట‌లో భారీ ఉక్కు ప‌రిశ్ర‌మ స్థాప‌న‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్బంగా ఆర్సెలార్ మిట్ట‌ల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ మాట్లాడారు. ఏపీలో ఓ భారీ స్థాయి స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు ఇవాళ అంకురార్పణ చేశాం అన్నారు. ఈ ఏడాది తర్వాత 20 వార్షికోత్సవం నిర్వహించుకుంటున్న ఆర్సెలార్ మిట్టల్ సంస్థకు ఈ ప్లాంట్ ఓ కలికి తురాయి అవుతుందన్నారు. నేను జన్మించిన నా భారత దేశంలో ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తున్నందుకు గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌న్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రూపకల్పన చేసిన ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ కార్యక్రమంలో ఇది ఆరంభం మాత్రమేన‌ని అన్నారు ల‌క్ష్మీ నివాస్ మిట్ట‌ల్.
మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి పరిశ్రమలు, రక్షణ రంగ ఉత్పత్తులు ఇలా వేర్వేరు రంగాలకు అవసరమైన స్టీల్ ఉత్పత్తులు తయారవుతాయని చెప్పారు. ఏడాదికి 8 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో దేశ అవసరాలకు అనుగుణంగా ఈ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నాం అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన విజన్ కు అనుగుణంగా పారిశ్రామిక ప్రగతికి ఈ ప్లాంట్ తోడ్పడుతుందని ఆశిస్తు్న్నానని పేర్కొన్నారు . పారిశ్రామిక వేత్తల్లో విశ్వాసం నింపేలా ఏపీలోని విధానాలు ఉన్నాయని ప్ర‌శంస‌లు కురిపించారు. ఏపీ ప్రగతి సాధించేందుకు తీసుకున్న నిర్ణయాలు దోహ‌ద ప‌డ‌తాయ‌ని చెప్పారు. భ‌విష్య‌త్తులో దేశంలోని ప‌లు ప్రాంతాల‌లో మ‌రికొన్ని కంపెనీల‌ను ఏర్పాటు చేస్తామ‌ని ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు లక్ష్మీ నివాస్ మిట్ట‌ల్.
The post దేశ అవ‌స‌రాల కోసం ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఏపీ బ‌డ్జెట్ లో బీసీల అభ్యున్న‌తికి ప్ర‌యారిటీఏపీ బ‌డ్జెట్ లో బీసీల అభ్యున్న‌తికి ప్ర‌యారిటీ

అమరావతి : బీసీల అభ్యున్నతి పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది మరోసారి రుజువైందని, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో వెనుకబడిన వర్గాల సంక్షేమానికి చరిత్రలో కనీవినీ ఎరుగని కేటాయింపులు చేశారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్

ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్న సీఎం సిద్ద‌రామ‌య్య‌ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్న సీఎం సిద్ద‌రామ‌య్య‌

క‌ర్ణాట‌క : క‌ర్ణాట‌క రాష్ట్రంలో రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. ప్ర‌స్తుతం సీఎం కుర్చీ కోసం నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెల‌కొంది. ఓ వైపు సీఎంగా ఉన్న సిద్ద‌రామ‌య్య మ‌రో వైపు ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న డీకే శివ‌కుమార్ మ‌ధ్య

CM Nitish Kumar: కోటి ఉద్యోగాల కల్పనకు నితీశ్ క్యాబినెట్ నిర్ణయంCM Nitish Kumar: కోటి ఉద్యోగాల కల్పనకు నితీశ్ క్యాబినెట్ నిర్ణయం

    బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం అనంతరం నితీశ్ కుమార్ మంత్రివర్గం మంగళవారంనాడు తొలిసారి సమావేశమైంది. నితీశ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాబోయే ఐదేళ్లలో రాష్ట్ర యువతకు కోటి ఉద్యోగాలు కల్పించాలని, ‘ఈస్ట్రన్ ఇండియా టెక్ హబ్’గా