hyderabadupdates.com Gallery నార్త్ లో డౌన్‌ అయిన కాంతారా వసూళ్లు!

నార్త్ లో డౌన్‌ అయిన కాంతారా వసూళ్లు!

కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంతార సినిమా ఎంత పెద్ద స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. రిషబ్ శెట్టి హీరోగా, అలాగే దర్శకుడిగానూ తెరకెక్కించిన ఆ సినిమా తర్వాత ప్రీక్వెల్ రూపంలో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. డివోషనల్ యాక్షన్ డ్రామా స్టైల్ లో వచ్చిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజే మంచి రెస్పాన్స్ తో పాటు వసూళ్ల పరంగా కూడా బలమైన స్టార్ట్ సాధించింది. ముఖ్యంగా హిందీ వెర్షన్ కి యూనిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది.

రిలీజ్ డేలోనే ఈ సినిమా దాదాపు 18 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ అందుకుంది. అయితే రెండో రోజు మాత్రం ఊహించని విధంగా వసూళ్లు తగ్గిపోయాయి. సాధారణంగా నార్త్ లో వర్కింగ్ డే అయినప్పటికీ, సినిమాకి టాక్ బాగుంటే కలెక్షన్లు మెరుగ్గానే కొనసాగుతాయి. కానీ కాంతార ప్రీక్వెల్ కి మాత్రం మొదటి రోజు తో పోలిస్తే రెండో రోజు దాదాపు 5 కోట్ల వరకూ తగ్గిపోయాయి. దీంతో రెండో రోజు కలెక్షన్లు సుమారు 13.5 కోట్ల వద్ద ఆగిపోయాయి.

ఇక వీకెండ్ లోని శనివారం, ఆదివారం రోజుల్లో మళ్లీ వసూళ్లు పెరిగే అవకాశం ఉంది.
The post నార్త్ లో డౌన్‌ అయిన కాంతారా వసూళ్లు! appeared first on Telugumopo – Movies and Politics.

Related Post

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ చొరవతో ‘గూడెం’కు విద్యుత్ వెలుగులుPawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ చొరవతో ‘గూడెం’కు విద్యుత్ వెలుగులు

    అంతరిక్షంలో అడుగుపెట్టిన ఆధునిక యుగంలోనూ… విద్యుత్ సౌకర్యానికి దూరంగా ఉన్న ‘గూడెం’ గ్రామం తొలిసారి విద్యుత్ కాంతులతో మెరిసింది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చొరవతో కేంద్ర ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారుల కృషితో

వివేకానంద మానవ వికాస కేంద్రం ప్రారంభానికి సిద్దంవివేకానంద మానవ వికాస కేంద్రం ప్రారంభానికి సిద్దం

విజ‌య‌వాడ : దేశ వ్యాప్తంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా రామ‌కృష్ణ మిష‌న్ ఎన‌లేని కృషి చేస్తూ వ‌స్తోంది. ఇందులో మ‌రో బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ గాంధీనగర్ లోని శైలజా థియేటర్ ఎదురుగా.. నూతనంగా నిర్మించిన వివేకానంద మానవ వికాస

Bihar Assembly Elections: బిహార్‌లో రికార్డుస్థాయి పోలింగ్‌ ! తొలిదశలో 65% ఓటింగ్ !Bihar Assembly Elections: బిహార్‌లో రికార్డుస్థాయి పోలింగ్‌ ! తొలిదశలో 65% ఓటింగ్ !

    బిహార్‌ శాసనసభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 121 నియోజకవర్గాల్లో గురువారం పండగ వాతావరణంలో జరిగిన ఓటింగులో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 65% మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినోద్‌