hyderabadupdates.com Gallery నార్త్ లో డౌన్‌ అయిన కాంతారా వసూళ్లు!

నార్త్ లో డౌన్‌ అయిన కాంతారా వసూళ్లు!

కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంతార సినిమా ఎంత పెద్ద స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. రిషబ్ శెట్టి హీరోగా, అలాగే దర్శకుడిగానూ తెరకెక్కించిన ఆ సినిమా తర్వాత ప్రీక్వెల్ రూపంలో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. డివోషనల్ యాక్షన్ డ్రామా స్టైల్ లో వచ్చిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజే మంచి రెస్పాన్స్ తో పాటు వసూళ్ల పరంగా కూడా బలమైన స్టార్ట్ సాధించింది. ముఖ్యంగా హిందీ వెర్షన్ కి యూనిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది.

రిలీజ్ డేలోనే ఈ సినిమా దాదాపు 18 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ అందుకుంది. అయితే రెండో రోజు మాత్రం ఊహించని విధంగా వసూళ్లు తగ్గిపోయాయి. సాధారణంగా నార్త్ లో వర్కింగ్ డే అయినప్పటికీ, సినిమాకి టాక్ బాగుంటే కలెక్షన్లు మెరుగ్గానే కొనసాగుతాయి. కానీ కాంతార ప్రీక్వెల్ కి మాత్రం మొదటి రోజు తో పోలిస్తే రెండో రోజు దాదాపు 5 కోట్ల వరకూ తగ్గిపోయాయి. దీంతో రెండో రోజు కలెక్షన్లు సుమారు 13.5 కోట్ల వద్ద ఆగిపోయాయి.

ఇక వీకెండ్ లోని శనివారం, ఆదివారం రోజుల్లో మళ్లీ వసూళ్లు పెరిగే అవకాశం ఉంది.
The post నార్త్ లో డౌన్‌ అయిన కాంతారా వసూళ్లు! appeared first on Telugumopo – Movies and Politics.

Related Post

IndiGo Flight: గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్IndiGo Flight: గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

    గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఈ విమానం హుబ్లీ నుంచి తెలంగాణలోని హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే హైదరాబాద్ లో వాతావరణం అనుకూలించకపోవడంతో మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్

Jubilee Hills: జూబ్లీహిల్స్‌ బరిలో 58 మంది అభ్యర్ధులుJubilee Hills: జూబ్లీహిల్స్‌ బరిలో 58 మంది అభ్యర్ధులు

    హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్‌ తెలిపారు. జూబ్లీహిల్స్ లో మొత్తం ఓటర్ల సంఖ్య- 4,01,365 ఉండగా, పురుషులు- 2,08,561,

Minister Nara Lokesh: రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు – మంత్రి నారా లోకేష్Minister Nara Lokesh: రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు – మంత్రి నారా లోకేష్

    విశాఖపట్నంలో ఈ నెల 14,15 తేదీల్లో పార్టనర్ షిప్ సమ్మిట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోన్నామని… ఈ సదస్సులో పెద్దఎత్తున పెట్టుబడి చర్చలు జరుగుతాయని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పారిశ్రామికవేత్తలతో పాటు పాలసీ మేకర్లు హాజరై రాబోయే