hyderabadupdates.com Gallery పంట‌లు కోల్పోయిన అన్న‌దాత‌ల‌ను ఆదుకుంటాం

పంట‌లు కోల్పోయిన అన్న‌దాత‌ల‌ను ఆదుకుంటాం

పంట‌లు కోల్పోయిన అన్న‌దాత‌ల‌ను ఆదుకుంటాం post thumbnail image

అమ‌రావ‌తి : అకాల వ‌ర్షాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అత‌లాకుత‌లం చేస్తున్నాయి. ఇంకా మ‌రో రెండు రోజులు వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఏపీ వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. దీంతో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల తాకిడికి ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట‌లు చేతికి రాకుండా పోతున్నాయి. చాలా చోట్ల నేల రాలాయి. దీంతో జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. అకాల వర్షాలతో సంభవించిన పంట నష్టంపై వరుసగా రెండో రోజూ సీఎం సమీక్ష చేప‌ట్టారు. భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో దెబ్బతిన్న పంటల వివరాలపై ఆరా తీశారు. వ‌ర్షాల కార‌ణంగా 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిల్లిందని సీఎంకు వివ‌రించారు ఉన్న‌తాధికారులు.
వీటి విలువ రూ.40 కోట్లుగా ఉంటుంద‌ని తేల్చారు. మ‌రో వైపు 9 జిల్లాల్లో 48 మండలాల్లో 1,301 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మిరప, కూరగాయలు, మామిడి, ఆరెంజ్, నిమ్మ పంటలు దెబ్బతినట్టు వెల్లడించారు. ఉద్యాన పంటల నష్టం విలువ రూ.22.68 కోట్లుగా అంచనా వేశామ‌న్నారు. ఇదిలా ఉండ‌గా ఎల్పీజీ సరఫరా పైనా సీఎం సమీక్షించారు. భవిష్యత్‌లో సమస్య తలెత్తకుండా వ్యవస్థను తీర్చిదిద్దాలని ఆదేశించారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఇండక్షన్ స్టవ్‌లు, పీఎన్జీ, ఈవీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాల‌ని సూచించారు. ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధంతో గ్లోబల్ సప్లయ్ చైన్ దెబ్బతినక ముందే అప్రమత్తం కావాలని అన్నారు. ఫెర్టిలైజర్లు, పెట్రోల్, డీజిల్ లోటు రాకుండా కేంద్రంతో సంప్రదింపులు జ‌ర‌పాల‌ని సూచించారు సీఎం. గ్రామీణ, గిరిజన ప్రాంతాలు, విద్యా సంస్థలు, ఆలయాలకు ఎల్పీజీ సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
The post పంట‌లు కోల్పోయిన అన్న‌దాత‌ల‌ను ఆదుకుంటాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సీఎం చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ భేటీసీఎం చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ భేటీ

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో త‌న నివాసంలో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్, అటవీ శాఖకి సంబంధించిన అంశాలపై చర్చించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి,

Pawan Kalyan: కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్Pawan Kalyan: కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్

    పలమనేరు ముసలిమడుగు వద్ద కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గజరాజుల విన్యాసాలను పవన్ కల్యాణ్, అధికారులు తిలకించారు. ఏనుగులు కృష్ణా, అభిమన్యులకు పవన్ స్వయంగా ఆహారాన్ని అందించారు.

రామ్ చ‌ర‌ణ్ పెద్ది మూవీపై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ‌రామ్ చ‌ర‌ణ్ పెద్ది మూవీపై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ‌

హైద‌రాబాద్ : అంద‌రి దృష్టి మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ , జాహ్న‌వి క‌పూర్ క‌లిసి న‌టించిన చిత్రం పెద్ది. దీనికి ఉప్పెన ఫేమ్ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. భారీ ఖ‌ర్చు పెట్టారు ఈ మూవీ కోసం.