hyderabadupdates.com Gallery ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో నారా లోకేష్ భేటీ

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో నారా లోకేష్ భేటీ

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో నారా లోకేష్ భేటీ post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌ను క‌లుసుకున్నారు. అసెంబ్లీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఛాంబ‌ర్ కు స్వ‌యంగా వెళ్లారు. కొంత సేపు ఈ ఇద్ద‌రూ కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. ఇరువురి మ‌ధ్య తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై ప్ర‌స్తావించిన‌ట్లు స‌మాచారం. ఇవాళ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం పూర్త‌యిన వెంట‌నే బీఏసీ, ఆ త‌ర్వాత ఎన్డీఏ శాస‌న స‌భాప‌క్ష స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా బ‌డ్జెట్ సమావేశాల‌లో చ‌ర్చించాల్సిన అంశాల‌పై చ‌ర్చించారు నారా లోకేష్. డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ తో పాటు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా ఉన్నారు.
ఇదిలా ఉండ‌గా సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలో బిజీగా గ‌డిపారు. ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులు, నిలిచి పోయిన నిధుల‌ను మంజూరు చేయాల‌ని కోరారు. ఇదే క్ర‌మంలో చంద్ర‌బాబు నాయుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌ల్ సీతారామ‌న్ , కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ , రైల్వే , ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ , మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ , శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ల‌ను క‌లుసుకున్నారు. చంద్ర‌బాబు వెంట ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు, పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్, ఎంపీలు కూడా ఉన్నారు.
The post ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో నారా లోకేష్ భేటీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా స‌చిన్టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా స‌చిన్

ముంబై : వ‌ర‌ల్డ్ టాప్ క్లాస్ క్రికెట‌ర్, భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్ స‌చిన్ ర‌మేష్ టెండూల్క‌ర్ కు అరుదైన ఛాన్స్ ల‌భించింది. తాజాగా ప్ర‌ముఖ పెయింట్స్ సంస్థ టెక్నో కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త‌న‌ను త‌మ కంపెనీకి బ్రాండ్

తెలంగాణ ముద్దుబిడ్డ సూదిని జైపాల్ రెడ్డితెలంగాణ ముద్దుబిడ్డ సూదిని జైపాల్ రెడ్డి

హైద‌రాబాద్ : భార‌త దేశం గ‌ర్వించ ద‌గిన అరుదైన నాయ‌కుడు మాజీ కేంద్ర మంత్రి, దివంగ‌త సూదిని జైపాల్ రెడ్డి అని అన్నారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. రాజకీయాలకు విలువల విలువ తెలిపి, ప్రజాసేవకు నిస్వార్థమే పరమార్థమని చెప్పిన అరుదైన

RJD: బిహార్‌ ఎన్నికలకు 143 మందితో ఆర్జేడీ జాబితా విడుదలRJD: బిహార్‌ ఎన్నికలకు 143 మందితో ఆర్జేడీ జాబితా విడుదల

RJD : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతోంది. కానీ, ఇంతవరకూ విపక్ష ఇండియా కూటమి ‘మహాగఠ్‌బంధన్‌’లో సీట్ల పంపకాలు పూర్తికాలేదు. దీనిపై కాంగ్రెస్‌, ఆర్జేడీ మధ్య మంతనాలు కొనసాగుతోన్న వేళ.. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పార్టీ సోమవారం అభ్యర్థుల జాబితాను