hyderabadupdates.com movies పవన్, ఫాన్స్ ఉన్నారు… హైప్ వస్తుందిలే

పవన్, ఫాన్స్ ఉన్నారు… హైప్ వస్తుందిలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల గ్యాప్ లో హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలతో పలకరించిన పవన్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఉగాది కానుకగా వచ్చే గురువారం ఈ సినిమా విడుదల కానుంది.

ఐతే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రానికి అనుకున్నంత హైప్ కనిపించడం లేదు. తక్కువ గ్యాప్ లో పవన్ నుంచి మూడో సినిమా వస్తుండడం.. దర్శకుడు హరీష్ శంకర్ ఫాంలో లేకపోవడం.. ప్రోమోలు అంత గొప్పగా లేకపోవడం.. ఇలా సినిమాపై అంతగా అంచనాలు ఏర్పడకపోవడానికి కొన్ని కారణాలు. దీంతో పాటుగా రిలీజ్ అవుతున్న దురంధర్-2 చిత్రానికి తెలుగులో కూడా మంచి హైపే ఉంది. ఒక డబ్బింగ్ సినిమా నుంచి పవన్ మూవీకి ముప్పు ఉంటుందని ఎవరు ఊహించి ఉండరు. కానీ పరిస్థితి చూస్తే అదే జరుగుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

పవన్ చివరి సినిమా ఓజీ మంచి ఫలితాన్నే అందుకున్నప్పటికీ ‘ఉస్తాద్’కు అనుకున్నంత హైప్ లేకపోవడం గురించి కొందరు వెటకారంగా కామెంట్లు చేస్తున్నారు. కానీ పవన్ సినిమాకు రిలీజ్ కు కొన్ని రోజుల ముందు వరకు పరిస్థితి ఎలా ఉన్నా.. విడుదలప్పుడు అంతా మారిపోతుంది.

మేకింగ్ టైంలో ఫాన్స్ కూడా లైట్ అనుకున్న కాటమరాయుడు చిత్రానికి సైతం మంచి ఓపెనింగ్స్ రావడం.. రిలీజ్ రోజు ప్యాక్డ్ హౌస్ లతో షోలు నడవడం గుర్తుండే ఉంటుంది. విపరీతమైన నెగెటివిటీ ఎదుర్కొన్న హరిహర వీరమల్లుకు సైతం ఇదే జరిగింది. కాబట్టి ఉస్తాద్ విషయంలో భయపడాల్సిన పనిలేదు.

తమ ఆకాంక్షలకు తగ్గట్లు సినిమాలు చెయ్యడని, తన పొటెన్షియాలిటీని సరిగా వాడుకోడని పవన్ ను ఓవైపు విమర్శిస్తూనే ఆయన సినిమా రిలీజ్ అయినపుడు డ్యూటీ ఎక్కేయడం, థియేటర్లను నింపేయడం అభిమానులకు అలవాటే. ఉస్తాద్ విషయంలోనూ అదే జరుగుతుందనడంలో సందేహం లేదు. కావాల్సిందల్లా సినిమాకు పాజిటివ్ టాక్ మాత్రమే. అది వస్తే మిగతాది తర్వాత ఫాన్స్ చూసుకుంటారు.

Related Post

రెండో పెళ్లి మీద హీరోయిన్ ఆసక్తిరెండో పెళ్లి మీద హీరోయిన్ ఆసక్తి

‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర చేయడమే కాక.. ‘ఓలమ్మీ తిక్కరేగిందా’ పాట కూడా పాడి మెప్పించింది మమత. దాంతో పాటు ‘రాఖీ రాఖీ’, ‘ఆకలేస్తే అన్నం

ఇంచ్ కూడా తగ్గొద్దు: చంద్రబాబు కీలక నిర్ణయంఇంచ్ కూడా తగ్గొద్దు: చంద్రబాబు కీలక నిర్ణయం

ఏపీ ప్రతిపక్షం (ప్రధాన కాదు) వైసీపీ విషయంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెడికల్ కాలేజీల పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) విధానంపై ఆ పార్టీ చేస్తున్న నిరసనలు, ధర్నాలు, కోటి సంతకాల

Rākāsā Telugu States Rights Bagged by Sri Lakshmi Narasimha Movie Makers in a Big-Ticket DealRākāsā Telugu States Rights Bagged by Sri Lakshmi Narasimha Movie Makers in a Big-Ticket Deal

The upcoming fantasy-comedy entertainer Rākāsā has registered a major business milestone ahead of its theatrical release. The Telugu States theatrical rights of the film have been bagged by Sri Lakshmi