hyderabadupdates.com Gallery పాకిస్తాన్ బ‌హిష్క‌ర‌ణ‌పై ఐసీసీకి పూర్తి మ‌ద్ద‌తు

పాకిస్తాన్ బ‌హిష్క‌ర‌ణ‌పై ఐసీసీకి పూర్తి మ‌ద్ద‌తు

పాకిస్తాన్ బ‌హిష్క‌ర‌ణ‌పై ఐసీసీకి పూర్తి మ‌ద్ద‌తు post thumbnail image

న్యూఢిల్లీ : బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా పార్ల‌మెంట్ లో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంతో తాము ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడేది లేదంటూ పాకిస్తాన్ ప్ర‌క‌టించ‌డంపై స్పందించారు. దీంతో ఐసీసీ వేటు వేసేందుకు సిద్ద‌మైంది. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ సంద‌ర్బంగా ఐసీసీ తీసుకున్న ఏ నిర్ణ‌యానికైనా బీసీసీఐ బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని స‌భ సాక్షిగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఫిబ్ర‌వ‌రి 7 నుంచి ఐసీసీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్నాయి. భ‌ద్ర‌తా కార‌ణాల సాకుతో తాము ఆడ‌బోమంటూ ప్ర‌క‌టించాయి బంగ్లాదేశ్, పాకిస్తాన్ లు. అయితే త‌మ‌కు న‌ష్ట ప‌రిహారం చెల్లంచాలంటూ స్పాన్స‌ర్ షిప్ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇదిలా ఉండ‌గా పాకిస్థాన్ తమ టీ20 ప్రపంచ కప్ 2026 గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌ను బహిష్కరించడంపై క్రీడాస్ఫూర్తికి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తీసుకున్న వైఖరితో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ఏకీభవిస్తుందని, ఐసీసీతో సంప్రదించిన తర్వాతే దీనిపై వ్యాఖ్యానిస్తుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అన్నారు. ఐసీసీ క్రీడా స్పూర్తిని దృష్టిలో పెట్టుకుని నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు. దానికి బీసీసీఐ క‌ట్టుబ‌డి ఉంటుంద‌న్నారు. ఇండియాలో లా అండ్ ఆర్డ‌ర్ అద్భుతంఆ ఉంద‌న్నారు. అదే క్ర‌మంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల‌లో తీవ్ర‌మైన అనిశ్చితి నెల‌కొంద‌ని ఆరోపించారు. చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌ని రెండు దేశాల క్రికెట్ బోర్డుల‌కు సూచించారు రాజీవ్ శుక్లా.
The post పాకిస్తాన్ బ‌హిష్క‌ర‌ణ‌పై ఐసీసీకి పూర్తి మ‌ద్ద‌తు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

TG Local Bodies Elections: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం !TG Local Bodies Elections: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం !

    స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధమవుతోంది. నవంబర్ 26 లేదా 27వ తేదీన పంచాయతీ ఎన్నికల నగారా మోగనుందని తెలుస్తోంది. మొత్తం మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు

ఓరుగ‌ల్లు కోట భూముల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించండిఓరుగ‌ల్లు కోట భూముల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించండి

ఢిల్లీ :కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి సుదీర్ఘ లేఖ రాశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డికి. కోట భూముల నుండి ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించాల‌ని కోరారు. వాటిని తిరిగి ఏఎస్ఐకి అప్ప‌గించాల‌ని సూచించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కాగా స్వాధీనం

బీఆర్ఎస్ దిమ్మెల‌ను కూల్చే ద‌మ్ముందా..?బీఆర్ఎస్ దిమ్మెల‌ను కూల్చే ద‌మ్ముందా..?

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు , తెలంగాణ జ‌ర్న‌లిస్టుల ఫోరం అధ్య‌క్షుడు ప‌ల్లె ర‌వికుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డిపై. సోయి త‌ప్పిన మాట‌లు, సొల్లు క‌బుర్లు చెబుతూ తెలంగాణ‌పై నిత్యం విషం చిమ్మే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని