hyderabadupdates.com movies పాడిన పాటే పాడుతోన్న అంబటి

పాడిన పాటే పాడుతోన్న అంబటి

సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించిన కేసులో మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు కేసుల్లో పీటీ వారెంట్ పై రాజమండ్రి జైల్లో 18 రోజులు ఉన్న అంబటి…కోర్టుకు హాజరయ్యే సమయంలో తగ్గేదేలే అంటూ పుష్ప మాదిరి మేనరిజంతో చెప్పడం చర్చనీయాంశమైంది.

జైలుకు వెళ్లినా భయపడేదే లేదని అంబటి ఆ తర్వాత ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. ఇప్పుడు మరోసారి అదే పాట పాడుతూ జైలుకు వెళ్లేందుకు భయపడితే రాజకీయాలు చేయలేమంటూ అంబటి చేసిన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి.

రాజమండ్రి జైలు నుంచి వచ్చేటప్పుడే వెళ్లొస్తానని అక్కడి సిబ్బందితో చెప్పానని అంబటి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తనను జైల్లో మినిమం నెల…మ్యాగ్జిమమ్ 3 నెలలు ఉంచుతారని ఫిక్సయ్యానని అంబటి అన్నారు.

అయితే, జైలుకు వెళ్లి వచ్చినా అంబటి పొగరు తగ్గలేదని లోకేశ్ అనుకుంటున్నారని, ఏదో ఒక కేసులో ఇరికించాలని చూస్తున్నారని అన్నారు. అందుకే, జైలు సిబ్బందికి మళ్లీ వస్తానని, లోకేశ్ తనను మళ్లీ జైలుకు పంపుతారని చెప్పే వచ్చానని తెలిపారు.

అయితే, జైలు నుండి విడుదలై 20 రోజులైనా ఆ టాపిక్ ను మాత్రం అంబటి, వైసీపీ నేతలు వదలడం లేదు. ఎవరో ఒక వైసీపీ నేత అంబటిని 2-3 రోజులకోసారి పరామర్శించడం, ప్రెస్మీట్ పెట్టి ఆ అరెస్టు గురించి మాట్లాడి ఆ టాపిక్ సద్దుమణగకుండా చూడడం పరిపాటిగా మారింది.

ఓ పక్క అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గాలికొదిలేసిన వైసీపీ ఎమ్మెల్యేలు…అంబటికి సంఘీభావంగా తరలిరావడంపై విమర్శలు వస్తున్నాయి. అంబటి అరెస్టుపై చూపుతున్న శ్రద్ధ ప్రజా సమస్యలపై పెడితే బాగుంటుందని, అలా కాకుండా పదే పదే పాత పాట పాడితే ఏం లాభం అని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. అరెస్టుపై అంబటి డైలీ సీరియల్ కు ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో అని సెటైర్లు వేస్తున్నారు.

Related Post

విచారణ వేళ విజయసాయి ట్వీట్‌… బీజేపీపై ప్రశంసలు!విచారణ వేళ విజయసాయి ట్వీట్‌… బీజేపీపై ప్రశంసలు!

ఏపీ లిక్కర్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కోనున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తన ట్వీట్లతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశారు. ఇటీవల ‘కోటరీలు’, ‘వెనిజులా అధ్యక్షుడు’ అంటూ చేసిన ట్వీట్‌ ద్వారా వైఎస్ జగన్‌ను ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు

డిజిట‌ల్ బుక్ పెట్టాం.. ఎవ‌రూ రావొద్దంటే ఎలాడిజిట‌ల్ బుక్ పెట్టాం.. ఎవ‌రూ రావొద్దంటే ఎలా

వైసిపి అధినేత జగన్ ఇటీవల డిజిటల్ బుక్ పేరుతో ఒక యాప్‌ను తీసుకువచ్చారు. వైసీపీ సమస్యలు, నాయకుల పై నమోదవుతున్న కేసులు, వారి విషయంలో ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అంశాలను కూడా ఈ యాప్‌లో నమోదు చేయాలని ఆయన పార్టీ