hyderabadupdates.com Gallery పారిశ్రామిక కేంద్రంగా జ‌గ్గ‌య్య‌పేట : కేశినేని నాని

పారిశ్రామిక కేంద్రంగా జ‌గ్గ‌య్య‌పేట : కేశినేని నాని

పారిశ్రామిక కేంద్రంగా జ‌గ్గ‌య్య‌పేట : కేశినేని నాని post thumbnail image

విజ‌య‌వాడ : జ‌గ్గ‌య్య‌పేట రాబోయే రోజుల్లో ఏపీకి రోల్ మోడ‌ల్ కానుంద‌ని అన్నారు విజ‌య‌వాడ ఎంపీ , ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు కేశినేని చిన్ని. అంతే కాకుండా పారిశ్రామిక కేంద్రంగా మార‌నుంద‌ని చెప్పారు. ఈ రోజు జగ్గయ్యపేట రోడ్డులో విజయ డిజిటల్ సమీపంలో మున్సిపాలిటీ డీఎంఎఫ్‌టి నిధులు రూ.7.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు తదితర అభివృద్ధి పనులకు సంబంధించిన డీఎంఎఫ్‌టి గ్రాంట్ పైలాన్ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య ), కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ నెట్టెం రఘురామ్ , మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర , ఇతర నాయకులు పాల్గొన్నారు.
జగ్గయ్యపేట రాజధాని అమరావతి ప్రాంతంలో ముఖ్య భాగంగా ఉందన్నారు ఈ సంద‌ర్బంగా ఎంపీ కేశినేని చిన్ని.. రానున్న కాలంలో జగ్గయ్యపేట రూపురేఖలు మారి పోవడంతో పాటు పారిశ్రామిక కేంద్రంగా ఎదగ బోతోంద‌ని అన్నారు. రాష్ట్ర‌ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతోందని చెప్పారు.జగ్గయ్యపేట అభివృద్ధికి 1400 ఎకరాల పారిశ్రామిక స్థలం అవసరం ఉందన్నారు ఎంపీ. ఇందులో డిఫెన్స్ పరిశ్రమల కోసం 1000 ఎకరాలు, జేఆర్డీ టాటా వాటర్ ప్రాజెక్ట్ కోసం 500 ఎకరాలు అవసరమని తెలిపారు. ఇందు కోసం ప్రతిపాదనలు కూడా త‌యారు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. దీనిపై ఇండస్ట్రియల్ సెక్రటరీతో చర్చలు జరుపుతున్నాం అని తెలిపారు ఎంపీ.
ఇప్పటికే 40 సంవత్సరాల నాటి డంప్ యార్డ్ సమస్యను పరిష్కరించాం అని తెలిపారు. త్వరలోనే మంచినీటి సమస్య పరిష్కారానికి కూడా చర్యలు ప్రారంభిస్తాం అని ప్ర‌క‌టించారు. జగ్గయ్యపేట పరిధిలో నేషనల్ హైవే, సెకండ్ లైన్ రైల్వే పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు ఎంపీ. జగ్గయ్యపేట రైల్వే స్టేషన్‌కు ప్యాసింజర్ రైళ్లు వ‌చ్చేలా ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. జగ్గయ్యపేట ‘స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ’గా అప్‌గ్రేడ్ కావడం ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద అడుగు అని పేర్కొన్నారు. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ అమృత్ నిధులు, 16వ ఆర్థిక సంఘం ఫండ్స్‌ను పొందే అవకాశం లభించింద‌న్నారు.
The post పారిశ్రామిక కేంద్రంగా జ‌గ్గ‌య్య‌పేట : కేశినేని నాని appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అభిషేక్ శ‌ర్మ‌పై గ‌వాస్క‌ర్ షాకింగ్ కామెంట్స్అభిషేక్ శ‌ర్మ‌పై గ‌వాస్క‌ర్ షాకింగ్ కామెంట్స్

ముంబై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్ భార‌త్ అమెరికాతో ఆడింది. ముందుగా ఆడిన టీమిండియా 9

Amaravati: అమరావతి, గన్నవరంలో మెగా రైల్‌ టెర్మినళ్లుAmaravati: అమరావతి, గన్నవరంలో మెగా రైల్‌ టెర్మినళ్లు

Amaravati : అమరావతి, గన్నవరంలలో మెగా టెర్మినళ్లు నిర్మించేందుకు రైల్వేశాఖ ప్రణాళిక సిద్ధంచేసింది. అమరావతి (Amaravati) మీదుగా భవిష్యత్‌లో పెద్దఎత్తున రైళ్ల రాకపోకలు సాగనుండటంతో… వాటికి అనువుగా 8 ప్లాట్‌ఫాంలతో టెర్మినల్‌ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ రైళ్ల నిర్వహణ పనులు

Vruksha Maate: 114 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన వృక్షమాత తిమ్మక్కVruksha Maate: 114 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన వృక్షమాత తిమ్మక్క

    వృక్షమాతగా గుర్తింపు పొందిన ‘సాలుమరద’ తిమ్మక్క (114) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె… బెంగళూరు జయనగరలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని ఆమె దత్తపుత్రుడు ఉమేశ్‌ వెల్లడించారు. వివాహమైన తర్వాత పాతికేళ్లయినా సంతానం