hyderabadupdates.com Gallery ప్ర‌జ‌ల్లో అపోహ‌లు సృష్టించే ప్ర‌య‌త్నాలు మానుకోవాలి

ప్ర‌జ‌ల్లో అపోహ‌లు సృష్టించే ప్ర‌య‌త్నాలు మానుకోవాలి

ప్ర‌జ‌ల్లో అపోహ‌లు సృష్టించే ప్ర‌య‌త్నాలు మానుకోవాలి post thumbnail image

హైద‌రాబాద్ సీఎం రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం శాస‌న మండ‌లిలో ఆయ‌న కీల‌క అంశాల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. దేశంలో ఎన్నో నగరాలున్నా ప్రధానంగా ఐదు నగరాల గురించి మాత్రమే చర్చించుకుంటాం అన్నారు. పొలిటికల్ రాజధానిగా ఢిల్లీ, ఫైనాన్షియల్ కేపిటల్ ముంబై, బెంగుళూరు, చెన్నై తో పాటు ఐటీకి కేరాఫ్ గా హైద‌రాబాద్ గుర్త‌కు వ‌స్తుంద‌న్నారు. పొలిటికల్ కేపిటల్ గా ఉన్న ఢిల్లీలో కాలుష్యం కారణంగా పాఠశాలలకు, ఆఫీసులకి సెలవులు ఇస్తున్నారని చెప్పారు. ముంబై లో వర్షాలు వస్తే బ‌తికే ప‌రిస్థితి లేకుండా పోయింద‌న‌న్నారు. ఫైనాన్షియల్ కేపిటల్ గా ఉన్న ముంబైలో నివసించలేని పరిస్థితి నెల‌కొంద‌న్నారు సీఎం. బెంగుళూరులో విపరీతమైన ట్రాఫికక్, చెన్నైలో వరదలతో ఇబ్బందులు పడే దుస్థితి నెల‌కొంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
హైదరాబాద్ రాక్స్ అండ్ లేక్స్ సిటీ అని గుర్తు చేశారు. అది ఓల్డ్ సైట్ అని మనం చెప్పుకుంటున్నప్ప‌టికీ అది ఒరిజినల్ సిటీ అని కుండ బ‌ద్ద‌లు కొట్ఆరు. చార్మినార్, గుల్జార్ హౌస్, మనం ఉన్న శాసన మండలి ఎన్నో చారిత్రక కట్టడాలు నగరంలో ఉన్నాయన్నారు. ఇలాంటి ఘన చరిత్ర ఉన్న నగరంలో మానవ తప్పిదాలతో సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రధానంగా వాహనాల సంఖ్య పెరిగింద‌న్నారు. వీటికి పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంద‌న్నారు సీఎం. రవాణాలో రోడ్లు, రైల్వే, ఎయిర్ పోర్టు, పోర్టు కీలకం కానున్నాయ‌ని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చర్లపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి చేసుకున్నాం , మెట్రోను నిర్మించుకున్నాం.. దేశంలో వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం అని చెప్పారు రేవంత్ రెడ్డి.
The post ప్ర‌జ‌ల్లో అపోహ‌లు సృష్టించే ప్ర‌య‌త్నాలు మానుకోవాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

India: 270 మంది మయన్మార్‌ స్కామ్‌ సెంటర్‌ బాధితులకు విముక్తిIndia: 270 మంది మయన్మార్‌ స్కామ్‌ సెంటర్‌ బాధితులకు విముక్తి

    మయన్మార్‌లో స్కామ్‌ సెంటర్‌ నుంచి పరారై సరిహద్దుల్లోని థాయ్‌ల్యాండ్‌ పట్టణం మే సొట్‌లో తలదాచుకున్న 270 మంది భారతీయులు గురువారం సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు మిలటరీ రవాణా విమానాల్లో వారిని తీసుకువచ్చింది. మయన్మార్‌లోని

Digital Arrest: టీడీపీ ఎమ్మెల్యే ‘డిజిటల్‌ అరెస్టు’ కేసులో ఎనిమిది మంది అరెస్టుDigital Arrest: టీడీపీ ఎమ్మెల్యే ‘డిజిటల్‌ అరెస్టు’ కేసులో ఎనిమిది మంది అరెస్టు

    ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ కడప జిల్లా మైదుకూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను సైబర్‌ నేరగాళ్లు ‘డిజిటల్‌ అరెస్టు’చేసి, ఆయన నుంచి రూ.1.07 కోట్లు కాజేసిన కేసు కొలిక్కి వచ్చింది. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మొత్తం

త‌మ‌న్నా ఆజ్ కి రాత్ సాంగ్ బిలియ‌న్ వ్యూస్త‌మ‌న్నా ఆజ్ కి రాత్ సాంగ్ బిలియ‌న్ వ్యూస్

ముంబై : మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా భాటియా కీ రోల్ పోషించిన సాంగ్ ఆజ్ కీ రాత్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో టాప్ లో కొన‌సాగుతోంది. ఏకంగా 100 కోట్ల వ్యూస్ సాధించింది. సినీ రంగాన్ని విస్తు పోయేలా