hyderabadupdates.com Gallery ప్ర‌వాస భార‌తీయుల‌కు కేంద్రం భ‌రోసా : కిష‌న్ రెడ్డి

ప్ర‌వాస భార‌తీయుల‌కు కేంద్రం భ‌రోసా : కిష‌న్ రెడ్డి

ప్ర‌వాస భార‌తీయుల‌కు కేంద్రం భ‌రోసా : కిష‌న్ రెడ్డి post thumbnail image

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం యుద్దం జ‌రుగుతున్న క్ర‌మంలో ప్ర‌వాస భార‌తీయుల ర‌క్ష‌ణ‌కు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని పేర్కొన్నారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని చెప్పారు. దేశ ప్రయోజనాలను కాపాడుతూ విదేశాల్లో ఉన్న ప్రతి భారతీయుడి భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని స్ప‌ష్టం చేశారు.
గత 12 ఏళ్లలో భారత్ తన ఇంధన భద్రతను మరింత బలపరుచుకుందని తెలిపారు కిష‌న్ రెడ్డి. ఒకప్పుడు 27 దేశాల నుంచి మాత్రమే ముడి చమురు దిగుమతి చేసుకునే భారత్, నేడు 40 దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటూ సరఫరాను విస్తరించిందని వెల్ల‌డించారు . వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు, దేశీయంగా పెరిగిన LPG ఉత్పత్తి వంటి చర్యలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోందని స్ప‌ష్టం చేశారు. ఇలాంటి సమయంలో ప్రజల్లో భయాలు, అపోహలు సృష్టిస్తూ రాజకీయ లాభం పొందాలని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నించడం దురదృష్టకరం అని అన్నారు. రాజకీయాలకంటే దేశ ప్రయోజనాలే ముందు అన్న భావన ముఖ్యం అని పేర్కొన్నారు కిష‌న్ రెడ్డి.
మోదీ ప్రభుత్వం 140 కోట్ల భారతీయుల సంక్షేమం, దేశ ఇంధన భద్రత, అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్టను కాపాడేందుకు నిరంతరం కట్టుబడి ఉందని స్ప‌ష్టం చేశారు. భారతీయులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని భ‌రోసా ఇచ్చారు. ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా స‌రే కేంద్ర స‌ర్కార్ తీవ్రంగా కృషి చేస్తోంద‌న్నారు.
The post ప్ర‌వాస భార‌తీయుల‌కు కేంద్రం భ‌రోసా : కిష‌న్ రెడ్డి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

పేద బ్రాహ్మ‌ణుల కోసం ‘గరుడ’ ప‌థ‌కంపేద బ్రాహ్మ‌ణుల కోసం ‘గరుడ’ ప‌థ‌కం

అమ‌రావ‌తి : సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా ఖుష్ క‌బ‌ర్ చెప్పింది ఏపీ స‌ర్కార్. పేద బ్రాహ్మణ కుటుంబాల కోసం త్వరలో గరుడ పథకాన్ని ప్రారంభించనున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం చంద్రబాబు నాయుడు. మరణించిన పేద బ్రాహ్మణ కుటుంబాలకు తక్షణమే రూ. 10,000 సహాయం

Gujarat ATS: హైదరాబాద్ ఉగ్రవాది ఇంట్లో గుజరాత్‌ ఏటీఎస్‌ సోదాలుGujarat ATS: హైదరాబాద్ ఉగ్రవాది ఇంట్లో గుజరాత్‌ ఏటీఎస్‌ సోదాలు

    ఉగ్రవాద ఆరోపణలతో అరెస్టయిన డాక్టర్‌ సయ్యద్‌ అహ్మద్‌ మొహియుద్దిన్‌ నివాసంలో గుజరాత్‌ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌ (ఏటీ ఎస్‌)పోలీసులు బుధవారం సోదాలు నిర్వహించారు. రాజేంద్రనగర్‌లోని అతడి నివాసంలో 3 గంటలపాటు సోదాలు నిర్వహించి పలు పత్రాలు, రసాయనాలు, కంప్యూటర్‌

భూ మాత‌ను ర‌క్షించాలి రైతుల ఆదాయం పెంచాలిభూ మాత‌ను ర‌క్షించాలి రైతుల ఆదాయం పెంచాలి

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భూ మాతను రక్షించ‌డంపై దృష్టి సారించాల‌ని , రైతుల ఆదాయం పెంచే విధంగా ప్రణాళికలకు రూపకల్పన చేయాలని స్ప‌ష్టం చేశారు. పండ్ల తోటల్లో విభిన్న జాతుల మొక్కలు