hyderabadupdates.com Gallery బాబు పాల‌న‌లో ప‌రుగులు తీస్తున్న రాష్ట్రాభివృద్ది

బాబు పాల‌న‌లో ప‌రుగులు తీస్తున్న రాష్ట్రాభివృద్ది

బాబు పాల‌న‌లో ప‌రుగులు తీస్తున్న రాష్ట్రాభివృద్ది post thumbnail image

మంగ‌ళ‌గిరి : గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ‘ఉత్తుత్తి ఆంధ్ర’గా మారి, విధ్వంసానికి గురైన ఉత్తరాంధ్ర ప్రాంతం నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అభివృద్ధి పథంలో దూసుకు పోతోందని ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు పేర్కొన్నారు. కేవలం రెండేళ్లు కూడా పూర్తికాక ముందే ఉత్తరాంధ్రను పారిశ్రామిక హబ్‌గా మార్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్టాడారు. ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేలా దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చి 23న సోమ‌వారం శంకు స్థాప‌న చేయ‌నున్నార‌ని వెల్ల‌డించారు ఎంపీ.
దాదాపు 1.5 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును 2029 కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉందని చెప్పారు. ఈ ఒక్క పరిశ్రమ ద్వారానే దాదాపు లక్ష మందికి పైగా నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఏడాది జూన్ నాటికి ప్రారంభం కాబోతోందని ప్ర‌క‌టించారు అప్ప‌ల నాయుడ. స్టీల్ ప్లాంట్, ఎయిర్‌పోర్ట్.. ఈ రెండు ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర అభివృద్ధికి రెండు కళ్ల వంటివని, ఇవి భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఉత్తరాంధ్ర వనరులను దోచుకున్నారు తప్ప, ఇక్కడి యువతకు ఉపాధి కల్పించాలనే ఆలోచన చేయలేదని ఆరోపించారు.
The post బాబు పాల‌న‌లో ప‌రుగులు తీస్తున్న రాష్ట్రాభివృద్ది appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బ‌దిలీటీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బ‌దిలీ

అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఈవోగా ఉన్న సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు వేసింది. ఉన్న‌ట్టుండి ఆయ‌న‌ను బ‌దిలీ చేయ‌డం రాష్ట్ర వ్యాప్తంగా

ప్ర‌జా పాల‌న ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక కార్యాచ‌ర‌ణప్ర‌జా పాల‌న ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక కార్యాచ‌ర‌ణ

హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రజా సేవకు, అభివృద్ధి ప్రణాళికల అమలుకు సరికొత్త కార్యక్రమాన్ని ప్రజా ప్రభుత్వం రూపొందించబోతోంది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యచరణకు సిద్ధమవుతోంది.. ఈ కార్యచరణపై దిశానిర్దేశం చేసేందుకు

చెరువుల‌ను ఆక్ర‌మించాల‌ని చూస్తే తాట తీస్తాంచెరువుల‌ను ఆక్ర‌మించాల‌ని చూస్తే తాట తీస్తాం

హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఆక్ర‌మ‌ణ‌దారుల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవ‌రు ఎంత‌టి స్థానంలో ఉన్నా చెరువుల‌ను ఆక్ర‌మించు కోవాల‌ని చూస్తే తాట తీస్తామ‌న్నారు. రామ‌చంద్రాపురం చెరువును ఆయ‌న ప‌రిశీలించారు. అనంత‌రం మీడియాతో