hyderabadupdates.com Gallery బీఎంసీ ఎన్నిక‌ల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీ

బీఎంసీ ఎన్నిక‌ల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీ

బీఎంసీ ఎన్నిక‌ల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీ post thumbnail image

ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తాజాగా మ‌హారాష్ట్ర‌లో జ‌రిగిన బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) ఎన్నిక‌ల్లో ఓటు చోరీ జ‌రిగింద‌ని ఆయ‌న ఆరోపించారు. శుక్ర‌వారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈసీపై సీరియ‌స్ అయ్యారు. మ‌రోసారి చోరీ జ‌రిగింద‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఈ దేశంలో గ‌త కొన్నేళ్ల నుంచి య‌ధేశ్చ‌గా ఓట్ చోరీ కొన‌సాగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌ప్పెట్ లాగా మారింద‌న్నారు. ప్ర‌జాస్వామ్యంపై పూర్తిగా న‌మ్మకం కోల్పోయేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డం దారుణ‌మ‌న్నారు. మహారాష్ట్ర పౌర ఎన్నికలలో మార్కర్ పెన్నుల్లో ఉపయోగించిన చెరగని సిరాకు సంబంధించి వివాదం చోటు చేసుకుంది.
ఓటు చోరీ అనేది దేశ వ్య‌తిరేక చ‌ర్య అని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం పౌరులను గ్యాస్‌లైట్ చేస్తోందని ఆరోపించారు. ఇదిలా ఉండ‌గా పెద్ద ఎత్తున ప్ర‌తిపక్షాలు ఆరోప‌ణ‌లు చేయ‌డంతో ఎట్ట‌కేల‌కు మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ దిగివ‌చ్చింది. ఈ మేర‌కు విచార‌ణ చేప‌డ‌తామ‌ని ప్ర‌క‌టించింది. సిరా నాణ్య‌త‌పై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేప‌డ‌తామంటూ ప్ర‌క‌టించింది. ప్రతిపక్ష నాయకులు ఓటరు వేలుపై ఉన్న గుర్తును సులభంగా తొలగించ వచ్చని, నకిలీ ఓటింగ్‌కు వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. అంతే కాకుండా వాస్త‌వంగా ఎలా తొల‌గించ వచ్చో కూడా లైవ్ లో చేసి చూపించారు. దీనిపై తీవ్రంగా స్పందించారు రాహుల్ గాంధీ. ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి ప్ర‌స్తుతం.
The post బీఎంసీ ఎన్నిక‌ల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

PM Narendra Modi: ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధనకు ఆంధ్రప్రదేశ్ కీలకం – ప్రధాని మోదీPM Narendra Modi: ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధనకు ఆంధ్రప్రదేశ్ కీలకం – ప్రధాని మోదీ

Narendra Modi : ఆత్మగౌరవం, సంస్కృతికి నిలయంగా ఆంధ్రప్రదేశ్‌ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కర్నూలు శివారులోని నన్నూరు వద్ద ‘సూపర్‌ జీఎస్టీ- సూపర్‌ సేవింగ్స్‌’ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగసభకు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు

20 ఏళ్ల త‌ర్వాత ఇండియాకు రానున్న ష‌కీరా20 ఏళ్ల త‌ర్వాత ఇండియాకు రానున్న ష‌కీరా

అమెరికా : ప్ర‌ముఖ ప్రపంచ గాయ‌ని ష‌కీరా ఇండియాకు రానున్నారు. ఆమె గ‌తంలో 20 ఏళ్ల కింద‌ట ఇండియాలో ప‌ర్య‌టించింది. ఇన్నేళ్ల గ్యాప్ త‌ర్వాత ఈ ఏడాది కాలు మోప‌నున్న‌ట్లు స‌మాచారం. ఇందులో భాగంగా వ‌చ్చ ఏప్రిల్ 10, 15వ తేదీల‌లో

IPS Suicide: ఐపీఎస్‌ పూరన్‌ కుమార్ భార్యకు సీఎం పరామర్శIPS Suicide: ఐపీఎస్‌ పూరన్‌ కుమార్ భార్యకు సీఎం పరామర్శ

IPS Suicide : హరియాణాకు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పూరన్‌ కుమార్‌ ఆత్మహత్య (IPS Suicide) ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన బలవన్మరణానికి ఉన్నతాధికారుల వేధింపులే కారణమని… వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన భార్య, ఐఏఎస్‌ అధికారిణి అమ్నీత్‌