hyderabadupdates.com Gallery బీఎంసీ ఎన్నిక‌ల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీ

బీఎంసీ ఎన్నిక‌ల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీ

బీఎంసీ ఎన్నిక‌ల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీ post thumbnail image

ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తాజాగా మ‌హారాష్ట్ర‌లో జ‌రిగిన బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) ఎన్నిక‌ల్లో ఓటు చోరీ జ‌రిగింద‌ని ఆయ‌న ఆరోపించారు. శుక్ర‌వారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈసీపై సీరియ‌స్ అయ్యారు. మ‌రోసారి చోరీ జ‌రిగింద‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఈ దేశంలో గ‌త కొన్నేళ్ల నుంచి య‌ధేశ్చ‌గా ఓట్ చోరీ కొన‌సాగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌ప్పెట్ లాగా మారింద‌న్నారు. ప్ర‌జాస్వామ్యంపై పూర్తిగా న‌మ్మకం కోల్పోయేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డం దారుణ‌మ‌న్నారు. మహారాష్ట్ర పౌర ఎన్నికలలో మార్కర్ పెన్నుల్లో ఉపయోగించిన చెరగని సిరాకు సంబంధించి వివాదం చోటు చేసుకుంది.
ఓటు చోరీ అనేది దేశ వ్య‌తిరేక చ‌ర్య అని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం పౌరులను గ్యాస్‌లైట్ చేస్తోందని ఆరోపించారు. ఇదిలా ఉండ‌గా పెద్ద ఎత్తున ప్ర‌తిపక్షాలు ఆరోప‌ణ‌లు చేయ‌డంతో ఎట్ట‌కేల‌కు మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ దిగివ‌చ్చింది. ఈ మేర‌కు విచార‌ణ చేప‌డ‌తామ‌ని ప్ర‌క‌టించింది. సిరా నాణ్య‌త‌పై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేప‌డ‌తామంటూ ప్ర‌క‌టించింది. ప్రతిపక్ష నాయకులు ఓటరు వేలుపై ఉన్న గుర్తును సులభంగా తొలగించ వచ్చని, నకిలీ ఓటింగ్‌కు వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. అంతే కాకుండా వాస్త‌వంగా ఎలా తొల‌గించ వచ్చో కూడా లైవ్ లో చేసి చూపించారు. దీనిపై తీవ్రంగా స్పందించారు రాహుల్ గాంధీ. ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి ప్ర‌స్తుతం.
The post బీఎంసీ ఎన్నిక‌ల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Bihar Assembly Elections: సీఎం నితీశ్ నివాసం వద్ద టికెట్ల పంచాయతీBihar Assembly Elections: సీఎం నితీశ్ నివాసం వద్ద టికెట్ల పంచాయతీ

Bihar Assembly Elections : బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) తేదీ దగ్గరపడుతోన్న కొద్దీ అక్కడి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ తరుణంలో అధికార, విపక్ష పార్టీల్లో టికెట్ల పంచాయితీ మొదలైంది. ఎట్టిపరిస్థితుల్లో తమకు టికెట్ దక్కాలని భావిస్తోన్న కొందరు

RJD: బిహార్‌ ఎన్నికలకు 143 మందితో ఆర్జేడీ జాబితా విడుదలRJD: బిహార్‌ ఎన్నికలకు 143 మందితో ఆర్జేడీ జాబితా విడుదల

RJD : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతోంది. కానీ, ఇంతవరకూ విపక్ష ఇండియా కూటమి ‘మహాగఠ్‌బంధన్‌’లో సీట్ల పంపకాలు పూర్తికాలేదు. దీనిపై కాంగ్రెస్‌, ఆర్జేడీ మధ్య మంతనాలు కొనసాగుతోన్న వేళ.. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పార్టీ సోమవారం అభ్యర్థుల జాబితాను

Water Awards: ‘జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీ’లో తెలంగాణ జయకేతనం !Water Awards: ‘జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీ’లో తెలంగాణ జయకేతనం !

    జల సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు–2024లో తెలంగాణ ఏకంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ‘జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీ’విభాగంలో తెలంగాణ టాప్‌లో నిలిచి సత్తా