hyderabadupdates.com movies భయపెట్టడమే మైనస్ అయ్యిందా

భయపెట్టడమే మైనస్ అయ్యిందా

గుణశేఖర్ యుఫోరియా రెండో వారంలో అడుగు పెట్టకముందే బాగా స్లో అయిపోయింది. ప్రమోషన్ల పరంగా దర్శకుడు తన వంతుగా ఎంత కష్టపడినప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులను రీచ్ కావడంలో కంటెంట్ సక్సెస్ కాలేకపోయింది. ఒక సీరియస్ ఇష్యూని పచ్చిగా, నిజాలు అర్థమయ్యేలా చేసిన ప్రయత్నం కమర్షియల్ గా వర్కౌట్ కావడం లేదు.

కొందరు విమర్శకులకు నచ్చింది. మరికొందరు సోషల్ యాక్టివిస్టులు మెచ్చుకున్నారు. కానీ అవి బాక్సాఫీస్ వసూళ్లకు ఉపయోగపడటం లేదు. పోటీ పెద్దగా లేకపోయినప్పటికీ దాన్ని క్యాష్ చేసుకోవడంలో యుఫోరియా తడబడుతోంది. కంటెంట్ గురించి గుణశేఖర్ తాజాగా స్పందించారు.

భయపెట్టేలా సినిమా తీశారని, కొన్నిచోట్ల ఒక హారర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలిగిందని కొందరు తనకు చెప్పారని గుణశేఖర్ వివరించారు. ఇలాంటి సామజిక సమస్యని ఇంత తీవ్రతతో చెబితే తప్ప కనెక్ట్ కాదని, అందుకే షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఇది గుర్తించినా ఆడియన్స్ కి తాను చెప్పాలనుకున్నది ఈ డెప్త్ తో అయితేనే సాధ్యమవుతుందని భావించి సాహసం చేశానని అన్నారు.

నిజమే. కానీ ఫిలిం మేకర్ గా ఆయన ఏదైతే పాజిటివ్ కోణంలో ఆలోచించారో తెరమీదకు వచ్చాక అదే నెగటివ్ గా మారిపోయిన వైనం స్పష్టం. రేప్ రీ కన్స్ ట్రక్షన్ లాంటివి చూపించిన విధానం జనాలను ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం.

తల్లి మీద కొడుకు జుగుప్సాకర చర్యకు ట్రై చేయడం, జైళ్లలో ఉండే దారుణమైన పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు చూపించడం, భయపెట్టడంతో పాటు వేరొకరికి రికమండ్ చేయడానికి ఆలోచించేలా చేశాయి.

యుఫోరియా లాంటివి వెబ్ సిరీస్, ఓటిటి మూవీస్ గా వస్తే ఈ డిస్కషన్ ఉండదు. ఎందుకంటే ఇవి వాటిలో సర్వసాధారణం కాబట్టి. కానీ టికెట్లు అమ్మడం ద్వారా బిజినెస్ చేసే సినిమాకు ఇవి అంతగా సూట్ కావు. పైగా బాలీవుడ్ కల్చర్ ఇక్కడ లేదు. ఒకవేళ స్ట్రెయిట్ గా హిందీలో తీసి ఓటిటికి ఇచ్చి ఉంటే రిజల్ట్ మారేదేమో. ఏదైతేనేం యూఫోరియా రూపంలో గుణశేఖర్ లోని మేకర్ కనిపించాడు కానీ కమర్షియల్ డైరెక్టర్ ఇంకా బయటికి రాలేదు.

Related Post

‘డెత్ సెల్‌’లో ఇమ్రాన్‌.. పాక్ ర‌ణ‌రంగం!‘డెత్ సెల్‌’లో ఇమ్రాన్‌.. పాక్ ర‌ణ‌రంగం!

పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని, ప్ర‌ముఖ క్రికెట‌ర్ ఇమ్రాన్ ఖాన్ మృతి చెందిన‌ట్టు గ‌ట్టి న‌మ్మ‌కం ఏర్ప‌డుతోంద‌ని ఆయ‌న కుమారులు సులేమాన్‌, ఖాసీంలు పేర్కొన‌డంతో పాకిస్థాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు రోడ్ల మీద‌కు వ‌చ్చారు. ఇమ్రాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ప్ర‌భుత్వం