hyderabadupdates.com Gallery ‘భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి’ స్ట్రీమింగ్ పై ఉత్కంఠ‌

‘భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి’ స్ట్రీమింగ్ పై ఉత్కంఠ‌

‘భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి’ స్ట్రీమింగ్ పై ఉత్కంఠ‌ post thumbnail image

హైద‌రాబాద్ : మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, ఆషికా రంగ‌నాథ్, డింపుల్ హ‌యాతి కీ రోల్స్ పోషించిన చిత్రం భ‌ర్త మ‌హాశ‌యులుకు విజ్ఞ‌ప్తి. సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ఈ మూవీతో పాటు మ‌రికొన్ని సినిమాలు విడుద‌ల‌య్యాయి. కానీ అన్ని సినిమాల‌ను తోసి రాజ‌ని మెగాస్టార్ చిరంజీవి , న‌య‌న‌తార‌, విక్ట‌రీ వెంక‌టేశ్ క‌లిసి న‌టించిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు మూవీ టాప్ లో నిలిచింది. ఇదే క్ర‌మంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ది రాజా సాబ్ బోల్తా ప‌డింది. అయితే రాంబాయి మూవీ ఊహించ‌ని రీతిలో పాజిటివ్ టాక్ తో స‌క్సెస్ అయ్యింది. భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి చిత్రం మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకుంది.
మెగా మూవీకి సంగీతం అందించిన భీమ్స్ సిసిరిలియోనే ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు. మ్యాజిక్ చేశాడు. పాట‌లు దుమ్ము రేపాయి. అయితే ఓటీటీలోకి ఫిబ్ర‌వ‌రి 13న వ‌స్తుంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది టాలీవుడ్ లో. కానీ సినిమా మేక‌ర్స్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారికంగా ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. దీనిని పూర్తిగా రొమాంటిక్ కామెడీగా తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం పెద్దగా ప్రీ-రిలీజ్ బజ్ లేకుండా ప్రారంభమైంది, ముఖ్యంగా నటుడి ఇటీవలి ప్రాజెక్ట్‌ల పేలవమైన ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే. నిరాడంబరమైన అంచనాలు ఉన్నప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి రన్‌ను నమోదు చేయగలిగింది. తాజాగా ఫిబ్రవ‌రి 20న జీ5 లో భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి స్ట్రీమింగ్ అవుతుంద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇప్ప‌టికే మెగాస్టార్ మూవీ ఇందులోనే భారీ ధ‌ర‌కు స్ట్రీమింగ్ అయిన విష‌యం ప్రేక్ష‌కుల‌కు తెలిసిందే.
The post ‘భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి’ స్ట్రీమింగ్ పై ఉత్కంఠ‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Vangalapudi Anitha: క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది – హోం మంత్రి అనితVangalapudi Anitha: క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది – హోం మంత్రి అనిత

    అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో అండర్–19 రాష్ట్ర స్థాయి బాలబాలికల హాకీ చాంపియన్‌షిప్ పోటీలను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి విద్యార్థులు హాజరయ్యారు. మూడు రోజులపాటు బాల, బాలికల

మెరిసిన విరాట్ కోహ్లీ తొలి వ‌న్డేలో ఇండియా విక్ట‌రీమెరిసిన విరాట్ కోహ్లీ తొలి వ‌న్డేలో ఇండియా విక్ట‌రీ

వ‌డోద‌ర : కీవీస్ తో జ‌రిగిన తొలి వ‌న్డేలో భార‌త జ‌ట్టు విజ‌యాన్ని న‌మోదు చేసింది. మ‌రోసారి స‌త్తా చాటాడు ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ. 37 ఏళ్ల వ‌య‌సులో 91 బంతుల్లో 93 ర‌న్స్ చేశాడు. మ్యాచ్ విజ‌యంలో కీల‌క

Minister Rajnath Singh: పాకిస్తాన్ కు రాజ్‌నాథ్‌ సింగ్‌ స్ట్రాంగ్ వార్నింగ్‌Minister Rajnath Singh: పాకిస్తాన్ కు రాజ్‌నాథ్‌ సింగ్‌ స్ట్రాంగ్ వార్నింగ్‌

    భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దాయాది దేశం పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ ట్రైలర్‌ మాత్రమేనన్న ఆయన… పాక్‌ భూభాగంలోని ప్రతీ అంగుళం ఇప్పుడు మన బ్రహ్మోస్‌ క్షిపణి పరిధిలో ఉందని… స్పష్టం