hyderabadupdates.com Gallery భార‌త్ పాక్ మ్యాచ్ పై పునరాలోచించాలి

భార‌త్ పాక్ మ్యాచ్ పై పునరాలోచించాలి

భార‌త్ పాక్ మ్యాచ్ పై పునరాలోచించాలి post thumbnail image

శ్రీ‌లంక : భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ను నిర్వ‌హిస్తోంది. ఇప్ప‌టికే భార‌త దేశంలో భ‌ద్రతా కార‌ణాలు సాకుగా చూపిస్తూ బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు ఇండియాతో ఆడ‌లేమంటూ పేర్కొన్నాయి. ఈ మేర‌కు అనుమతి ఇచ్చేది లేదంటూ ఆయా దేశాల అధ్య‌క్షుడు యూనుస్, షెహ‌బాజ్ ష‌రీలు ప్ర‌క‌టించారు. దీంతో ఐసీసీ సీరియ‌స్ అయ్యింది. చివ‌ర‌కు ఆ రెండు టీమ్ ల‌ను నిషేధించే ఆలోచ‌న‌లో ఉంది. ఈ త‌రుణంలో శ్రీ‌లంక క్రికెట్ బోర్డు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. టీమిండియాతో ఆడే విష‌యంలో పాకిస్తాన్ పున‌రాలోచించాల‌ని ఈ సంద‌ర్బంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ను కోరింది. పునః ప‌రిశీలించాల‌ని సూచించింది.
శ్రీలంక క్రికెట్ జట్టు ఈ టోర్నమెంట్‌ను నిర్వహించడానికి ఆసక్తిగా ఉందని స్ప‌ష్టం చేసింది. శ్రీలంకలో జరగనున్న మ్యాచ్‌లకు సంబంధించిన అన్ని వాణిజ్య, కార్యాచరణ, లాజిస్టికల్ , భద్రతా సన్నాహాలు ఇప్పటికే పూర్తయ్యాయని, ఆతిథ్య ఏర్పాట్లు, టిక్కెట్ల అమ్మకాలు కూడా పూర్తయ్యాయని ధృవీకరించింది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరగనున్న భారత్ vs పాకిస్తాన్ గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. మ్యాచ్ ను బ‌హిష్క‌రించాల‌ని పీసీబీ నిర్ణ‌యం తీసుకోవ‌డం ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేసింది శ్రీ‌లంక క్రికెట్ బోర్డు. ఈ చ‌ర్య వ‌ల్ల భారీ ఎత్తున వాణిజ్య‌, వ్యాపార ప‌రంగా భారీ న‌ష్టం వ‌స్తుంద‌ని పేర్కొంది. ఏ ఒక్క‌రికి ఇబ్బంది లేకుండా తాము ఏర్పాట్లు చేశామ‌ని తెలిపింది.
The post భార‌త్ పాక్ మ్యాచ్ పై పునరాలోచించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Jubilee Hills By Elections: నేటితో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారానికి తెరJubilee Hills By Elections: నేటితో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారానికి తెర

    రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ప్రచారం పతాక స్థాయికి చేరింది. గెలుపుకోసం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అహర్నిసలు శ్రమిస్తున్నాయి. ఆదివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ నెల 11న పోలింగ్‌ జరగనుండగా

Harish Rao: పత్తికి మద్దతు ధర ఇవ్వకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం – హరీష్ రావుHarish Rao: పత్తికి మద్దతు ధర ఇవ్వకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం – హరీష్ రావు

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు. పత్తి రైతుకు మద్దతు ధర ఇవ్వకపోతే తెల్ల బంగారాన్ని రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలస్ ముందు పోసి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మంగళవారం ఏనుమాముల వ్యవసాయ

లాభాల బాట పట్టిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ : చంద్ర‌బాబు నాయుడులాభాల బాట పట్టిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ : చంద్ర‌బాబు నాయుడు

అమరావతి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విశాఖ ఉక్కు మళ్లీ లాభాల బాట పట్టింది. ఏడాదిన్నరలో అనూహ్య ప్రగతి సాధించిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ 2026 జనవరిలో రూ.54 కోట్ల లాభాన్ని ఆర్జించింది. సచివాలయంలో విశాఖ ఉక్కు పురోగతిపై