hyderabadupdates.com Gallery భార‌త్ పాక్ మ్యాచ్ పై పునరాలోచించాలి

భార‌త్ పాక్ మ్యాచ్ పై పునరాలోచించాలి

భార‌త్ పాక్ మ్యాచ్ పై పునరాలోచించాలి post thumbnail image

శ్రీ‌లంక : భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ను నిర్వ‌హిస్తోంది. ఇప్ప‌టికే భార‌త దేశంలో భ‌ద్రతా కార‌ణాలు సాకుగా చూపిస్తూ బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు ఇండియాతో ఆడ‌లేమంటూ పేర్కొన్నాయి. ఈ మేర‌కు అనుమతి ఇచ్చేది లేదంటూ ఆయా దేశాల అధ్య‌క్షుడు యూనుస్, షెహ‌బాజ్ ష‌రీలు ప్ర‌క‌టించారు. దీంతో ఐసీసీ సీరియ‌స్ అయ్యింది. చివ‌ర‌కు ఆ రెండు టీమ్ ల‌ను నిషేధించే ఆలోచ‌న‌లో ఉంది. ఈ త‌రుణంలో శ్రీ‌లంక క్రికెట్ బోర్డు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. టీమిండియాతో ఆడే విష‌యంలో పాకిస్తాన్ పున‌రాలోచించాల‌ని ఈ సంద‌ర్బంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ను కోరింది. పునః ప‌రిశీలించాల‌ని సూచించింది.
శ్రీలంక క్రికెట్ జట్టు ఈ టోర్నమెంట్‌ను నిర్వహించడానికి ఆసక్తిగా ఉందని స్ప‌ష్టం చేసింది. శ్రీలంకలో జరగనున్న మ్యాచ్‌లకు సంబంధించిన అన్ని వాణిజ్య, కార్యాచరణ, లాజిస్టికల్ , భద్రతా సన్నాహాలు ఇప్పటికే పూర్తయ్యాయని, ఆతిథ్య ఏర్పాట్లు, టిక్కెట్ల అమ్మకాలు కూడా పూర్తయ్యాయని ధృవీకరించింది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరగనున్న భారత్ vs పాకిస్తాన్ గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. మ్యాచ్ ను బ‌హిష్క‌రించాల‌ని పీసీబీ నిర్ణ‌యం తీసుకోవ‌డం ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేసింది శ్రీ‌లంక క్రికెట్ బోర్డు. ఈ చ‌ర్య వ‌ల్ల భారీ ఎత్తున వాణిజ్య‌, వ్యాపార ప‌రంగా భారీ న‌ష్టం వ‌స్తుంద‌ని పేర్కొంది. ఏ ఒక్క‌రికి ఇబ్బంది లేకుండా తాము ఏర్పాట్లు చేశామ‌ని తెలిపింది.
The post భార‌త్ పాక్ మ్యాచ్ పై పునరాలోచించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

టీటీడీలో పాలసీ ఆధారిత పాలన : అడిష‌న‌ల్ ఈవోటీటీడీలో పాలసీ ఆధారిత పాలన : అడిష‌న‌ల్ ఈవో

తిరుమ‌ల : టీటీడీలో పాల‌సీ ఆధారిత పాల‌న సాగిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు టీటీడీ అడిష‌న‌ల్ ఈవో వెంక‌య్య చౌద‌రి. సోమ‌వారం 77వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌సంగించారు. టీటీడీ కూడా ఒక పురాతన, మహత్తర

వ్య‌వ‌సాయ రంగానికి ఊతం ఇచ్చేలా రాష్ట్ర బ‌డ్జెట్వ్య‌వ‌సాయ రంగానికి ఊతం ఇచ్చేలా రాష్ట్ర బ‌డ్జెట్

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ అద్భుతంగా ఉంద‌న్నారు. ప్రత్యేకించి వ్య‌వ‌సాయ రంగానికి మ‌రింత ఊతం ఇచ్చేలా ఉండ‌డం ప‌ట్ల

Amaravati: అమరావతి, గన్నవరంలో మెగా రైల్‌ టెర్మినళ్లుAmaravati: అమరావతి, గన్నవరంలో మెగా రైల్‌ టెర్మినళ్లు

Amaravati : అమరావతి, గన్నవరంలలో మెగా టెర్మినళ్లు నిర్మించేందుకు రైల్వేశాఖ ప్రణాళిక సిద్ధంచేసింది. అమరావతి (Amaravati) మీదుగా భవిష్యత్‌లో పెద్దఎత్తున రైళ్ల రాకపోకలు సాగనుండటంతో… వాటికి అనువుగా 8 ప్లాట్‌ఫాంలతో టెర్మినల్‌ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ రైళ్ల నిర్వహణ పనులు