hyderabadupdates.com Gallery మ‌హాత్ముడి జీవితం స్పూర్తి దాయ‌కం : అసుర కుమార

మ‌హాత్ముడి జీవితం స్పూర్తి దాయ‌కం : అసుర కుమార

న్యూఢిల్లీ : మ‌హాత్మా గాంధీ మ‌హాశ‌యుడు ఒక్క ఇండియాకే కాద‌ని ఆయ‌న జీవితం యావ‌త్ ప్ర‌పంచానికి స్పూర్తి దాయ‌క‌మ‌ని పేర్కొన్నారు శ్రీ‌లంక దేశ అధ్య‌క్షుడు అసుర కుమార దిశా నాయ‌క‌. మంగ‌ళ‌వారం దేశ రాజ‌ధాని ఢిల్లీకి విచ్చేశారు. ఇక్క‌డ జ‌రుగుతున్న ప్ర‌తిష్టాత్మ‌క ఏఐ వ‌ర‌ల్డ్ స‌మ్మిట్ 2026లో శ్రీ‌లంక దేశం త‌ర‌పున ఆయ‌న హాజ‌ర‌య్యారు. దేశాధ్య‌క్షుడికి ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ . అనంత‌రం భారీ భ‌ద్ర‌త న‌డుమ మ‌హాత్మా గాంధీ స‌మాధి వ‌ద్ద పుష్ప‌గుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు.
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ఆర్థిక వ్యవస్థలను, సమాజాలను పునర్నిర్మిస్తున్న తరుణంలో, భారతదేశం – శ్రీలంక భాగస్వామ్యం లోతు , ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఆవిష్కరణలు సమ్మిళితంగా, బాధ్యతాయుతంగా ప్రజలపై కేంద్రీకృతమై ఉండేలా చూసుకోవడంలో మా ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబించేలా చేస్తుంద‌న్నారు. శ్రీలంక, భారతదేశం కనెక్టివిటీ, ఆర్థిక నిశ్చితార్థం, డిజిటల్ సహకారం, సామర్థ్య నిర్మాణం , ప్రజల సంబంధాలలో స్థిరమైన ప్ర‌గ‌తిని సాధించాయ‌ని తెలిపారు. దక్షిణాసియా నాయకులలో ఒకరిగా హాజరైన అధ్యక్షుడి భాగస్వామ్యం మా సంబంధం సాన్నిహిత్యాన్ని , భవిష్యత్తును రూపొందించే సమస్యలపై కలిసి పనిచేయడానికి మా నిబద్ధతను నొక్కి చెబుతుందని స్ప‌ష్టం చేశారు.
ఈ సంద‌ర్బంగా శ్రీ‌లంక దేశ అధ్య‌క్షుడు మీడియాతో మాట్లాడారు. ఇండియాతో త‌మ సంబంధాలు మ‌రింత బ‌లోపేతం అవుతాయ‌ని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. భారతదేశం – శ్రీలంక భాగస్వామ్యం ఉద్దేశ్యంతో అభివృద్ధి చెందుతూనే ఉంటుంద‌న్నారు.
The post మ‌హాత్ముడి జీవితం స్పూర్తి దాయ‌కం : అసుర కుమార appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

MLA Harishrao: జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులతో మాట్లాడిన హరీశ్‌రావుMLA Harishrao: జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులతో మాట్లాడిన హరీశ్‌రావు

  ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లి జోర్డాన్‌లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికుల తో ఫోన్‌లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మాట్లాడారు. ఆందోళన పడకండి… బీఆర్ఎస్ అండగా ఉంటుందని కార్మికులకు ఆయన ధైర్యం చెప్పారు. జోర్డాన్‌లో

Digital Arrest: టీడీపీ ఎమ్మెల్యే ‘డిజిటల్‌ అరెస్టు’ కేసులో ఎనిమిది మంది అరెస్టుDigital Arrest: టీడీపీ ఎమ్మెల్యే ‘డిజిటల్‌ అరెస్టు’ కేసులో ఎనిమిది మంది అరెస్టు

    ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ కడప జిల్లా మైదుకూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను సైబర్‌ నేరగాళ్లు ‘డిజిటల్‌ అరెస్టు’చేసి, ఆయన నుంచి రూ.1.07 కోట్లు కాజేసిన కేసు కొలిక్కి వచ్చింది. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మొత్తం

పోలవరం ప్రాజెక్ట్ లో పీపీఏ సిఈఓ పర్యటనపోలవరం ప్రాజెక్ట్ లో పీపీఏ సిఈఓ పర్యటన

పోలవరం : పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) యోగేష్ పైతాన్కర్ శనివారం సమీక్షించారు. ఢిల్లీ నుంచి పోలవరం ప్రాజెక్ట్ పనుల సమీక్ష , పరిశీలనకు వచ్చిన ఆయన తొలుత పీ పీ