hyderabadupdates.com Gallery మ‌హిళా సాధికార‌త‌తోనే స‌మాజం పురోగ‌తి

మ‌హిళా సాధికార‌త‌తోనే స‌మాజం పురోగ‌తి

మ‌హిళా సాధికార‌త‌తోనే స‌మాజం పురోగ‌తి post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌ధానంగా బాలిక‌లు, యువ‌తులు, మ‌హిళ‌ల గురించి ప్ర‌స్తావించారు. వారు లేక‌పోతే ఈ స‌మాజం మ‌నుగ‌డ సాధించ‌ద‌ని పేర్కొన్నారు. వారు బాగుంటేనే అభివృద్ది సాధ్యం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. శ‌నివారం సీఎం మీడియాతో మాట్లాడారు. బాలికలకు సాధికారత కల్పించి, రక్షించినప్పుడే సమాజం పురోగతి సాధిస్తుందన్నారు. ఇవాళ జాతీయ బాలికా దినోత్సవం దేశ వ్యాప్తంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా బాలికలకు సాధికారత కల్పించే లక్ష్యానికి తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు.
ప్రజలు తమను తాము పున‌రంకితం చేసుకోవడానికి ఈ రోజు ఒక అవకాశం అని ముఖ్యమంత్రి అన్నారు. కుమార్తెలకు సాధికారత కల్పించి, రక్షించి, విజయం సాధించడానికి సమాన అవకాశాలు కల్పించినప్పుడే ఒక సమాజం నిజమైన పురోగతిని సాధిస్తుందని ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. అందరికీ జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కుమార్తెలకు సాధికారత కల్పించి, రక్షించి, విజయం సాధించడానికి సమాన అవకాశాలు కల్పించినప్పుడే ఒక సమాజం ముందుకు సాగుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. బాలికలకు సమాన అవకాశాలు కల్పించి, దేశ నిర్మాణంలో చురుకైన భాగస్వామ్యం వహించేలా వారిని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండ‌గా మ‌హిళ‌ల‌కు సంబంధించి కీల‌క సూచ‌న‌లు చేశారు. త‌మ స‌ర్కార్ ఏపీలో కొలువు తీరిన త‌ర్వాత దేశంలో ఎక్క‌డా లేని రీతిలో బాలిక‌లు, యువ‌తులు, మ‌హిళ‌ల సంక్షేమం , సాధికార‌త దిశ‌గా అడుగులు వేసేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు.
The post మ‌హిళా సాధికార‌త‌తోనే స‌మాజం పురోగ‌తి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

HAL: 113 తేజస్‌ జెట్‌ ఇంజిన్ల కొనుగోలుకు హాల్‌ ఒప్పందంHAL: 113 తేజస్‌ జెట్‌ ఇంజిన్ల కొనుగోలుకు హాల్‌ ఒప్పందం

    కేంద్ర ప్రభుత్వ హిందుస్తాన్‌ ఏరో నాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) అమెరికా రక్షణ రంగ సంస్థ జనరల్‌ ఎలక్ట్రిక్‌(జీఈ) ఏరోస్పేస్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా, ఎంకే1ఏ కార్యక్రమం కింద తేజస్‌ విమా నాలకు అవసరమైన 113 జెట్‌ ఇంజిన్లను

Minister Nara Lokesh: ప్రధాని పర్యటనపై మంత్రి లోకేశ్ సమీక్షా సమావేశంMinister Nara Lokesh: ప్రధాని పర్యటనపై మంత్రి లోకేశ్ సమీక్షా సమావేశం

    ఈనెల 16వతేదీన కర్నూలులో ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే సూపర్ జిఎస్ టి – సూపర్ సేవింగ్స్ సభను విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ కోరారు.

Sathya Sai Gramam: వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కల్చరల్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఫిజీ అధ్యక్షుడుSathya Sai Gramam: వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కల్చరల్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఫిజీ అధ్యక్షుడు

    సత్యసాయి గ్రామంలో జరుగుతున్న వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ ఫెస్టివల్ కార్యక్రమానికి ఫిజీ అధ్యక్షుడు హాజరయ్యారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని 100 దేశాలు ఒక్కతాటిపైకి రావడంపై ఆయన ప్రశంసలు కురిపించారు. సేవ, మానవత్వం, ఐక్యతకు ఇది