hyderabadupdates.com Gallery మార‌న్ కామెంట్స్ రామ్మోహ‌న్ నాయుడు ఫైర్

మార‌న్ కామెంట్స్ రామ్మోహ‌న్ నాయుడు ఫైర్

మార‌న్ కామెంట్స్ రామ్మోహ‌న్ నాయుడు ఫైర్ post thumbnail image

న్యూఢిల్లీ : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు నిప్పులు చెరిగారు. త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఈ ఏడాది జ‌రిగే శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకే, బీజేపీ, ఇత‌ర పార్టీల‌తో కూడిన ఎన్డీయే కూట‌మి విజ‌యం సాధించ‌క త‌ప్ప‌ద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. గురువారం రామ్మోహ‌న్ నాయుడు మీడియాతో మాట్లాడారు. తాజాగా డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వ్యాఖ్యలపై సీరియ‌స్ అయ్యారు. బాధ్య‌త క‌లిగిన ఎంపీ ఇలా చ‌వ‌క‌బారు కామెంట్స్ చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు. ఇవన్నీ రాజకీయ ప్రకటనలు. వాస్తవానికి వస్తే, మంచి పనులన్నీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయ‌ని చెప్పారు.
భారతదేశం ప్రపంచ స్థాయిలో నెలకొల్పుతున్న పురోగతి, అభివృద్ధి, ప్రమాణాలన్నీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్నప్పుడే సాధ్యమవుతున్నాయని చెప్పారు కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్న ఇతర రాష్ట్రాలను మీరు చూస్తే, అక్కడ గొప్ప అభివృద్ధి జరుగుతోంద‌ని అన్నారు కేంద్ర మంత్రి. తమిళనాడు అనేది బీజేపీ చాలా కాలంగా సముచితంగా గౌరవిస్తున్న రాష్ట్రం అని అన్నారు. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, భాష, సమాజం, అన్నింటినీ గౌరవిస్తున్నారని పేర్కొన్నారు రామ్మోహ‌న్ నాయుడు. ఉత్తర, దక్షిణ, పశ్చిమ, తూర్పు, ఈశాన్య, అన్ని ప్రాంతాలు ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో సముచితంగా గౌరవించ బడుతున్నాయని చెప్పారు. ఆ ఫలితాన్ని మీరు తమిళనాడులో జరగబోయే ఎన్నికలలో చూస్తార‌ని అన్నారు.
The post మార‌న్ కామెంట్స్ రామ్మోహ‌న్ నాయుడు ఫైర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

జ‌ర్న‌లిస్టుల అరెస్ట్ అక్ర‌మం : హ‌రీశ్ రావుజ‌ర్న‌లిస్టుల అరెస్ట్ అక్ర‌మం : హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ : సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎన్టీవీతో పాటు ఇత‌ర ఛాన‌ల్స్ లో వ‌చ్చిన క‌థ‌నాల‌పై స్పందించిన స‌ర్కార్ సిట్ ను ఏర్పాటు చేయ‌డాన్ని త‌ప్పు

Prashant Kishor: ప్రశాంత్‌ కిశోర్‌కు ఎన్నికల సంఘం నోటీసులుPrashant Kishor: ప్రశాంత్‌ కిశోర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

Prashant Kishor : బీహార్ ఎన్నికల వేళ ఈసీ నకిలీ ఓటర్లపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌కు (Prashant Kishor) ఎన్నికల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, బిహార్‌ రాష్ట్రాల్లో

2.65 ల‌క్ష‌ల ఎక‌రాల‌లో ప‌శుగ్రాసాల అభివృద్ది2.65 ల‌క్ష‌ల ఎక‌రాల‌లో ప‌శుగ్రాసాల అభివృద్ది

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలిపింది. తాజా బ‌డ్జెట్ లో ప‌శు పోష‌ణ‌కు ప్రోత్సాహం క‌ల్పిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. షెడ్యూల్డు కులాలు /