hyderabadupdates.com movies మూవీ లవర్స్… ఏడున్నర గంటలు మీవి కావు

మూవీ లవర్స్… ఏడున్నర గంటలు మీవి కావు

బాక్సాఫీస్ వద్ద ఏ సినిమాలు ఆడుతున్నాయి, ఏవి పోతున్నాయనేది కాసేపు పక్కనపెడితే ఇప్పుడు అందరి దృష్టి మార్చి 19 మీద ఉంది. దురంధర్ 2 రివెంజ్, టాక్సిక్ నువ్వా నేనా అనే రీతిలో పోటీకి సిద్ధపడటంతో నెవర్ బిఫోర్ క్లాష్ చూడబోతున్నామని ట్రేడ్ ఎదురు చూస్తోంది. పేరుకు తెలుగు రాష్ట్రాల్లో ఇవి డబ్బింగ్ మూవీస్ అయినప్పటికీ క్రేజ్ పరంగా ఒరిజినల్ లాంగ్వేజ్ కి ఏ మాత్రం తీసిపోని రీతిలో హైప్ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఏపీలో టాక్సిక్ కు టికెట్ రేట్ల పెంపు కోసం అప్లికేషన్ పెట్టుకుంటారనే టాక్ ఆల్రెడీ ఉంది. ఇక అసలు విషయానికి వస్తే సినీ ప్రియులకు పెద్ద ఛాలెంజ్ ఉంది.

విశ్వసనీయ సమాచారం మేరకు దురంధర్ 2 రివెంజ్ నిడివి 3 గంటల 40 నిముషాలు ఉందట. అంటే మొదటి భాగం కన్నా ఎక్కువ. ఇంటర్వెల్ కు ఇంకో పావు గంట కలుపుకుంటే మొత్తం ఫోర్ అవర్స్ ఒకే థియేటర్లో ఉండాలి. టాక్సిక్ ఫైనల్ కట్ 3 గంటల 15 నిమిషాలు వచ్చిందని వినికిడి. ఇది కూడా విశ్రాంతితో కలిపి మూడున్నర గంటల టైం డిమాండ్ చేస్తుంది. అంటే ఇంటి నుంచి బయలుదేరి రాను పోను టైం కూడా లెక్కేసుకుంటే ఎంతవుతుందో చెప్పనక్కర్లేదు. ఈ రెండు క్రేజీ మూవీస్ ఫస్ట్ డే చూడాలని డిసైడ్ అయిన మూవీ లవర్స్ వేలల్లో కాదు లక్షల్లో ఉన్నారు. సో వాళ్లంతా లీవ్ తీసుకోవాల్సిందే.

లెన్త్ విషయంలో ఆయా దర్శకులు రాజీ పడకపోవడంతోనే ఇంత నిడివి లాకైనట్టుగా అర్థమవుతోంది. కంటెంట్ బలంగా ఉంటే దీన్ని ఆడియన్స్ అంగీకరిస్తారని దురంధర్ తో పాటు గతంలో పుష్ప 2, యానిమల్ లాంటివి ఋజువు చేశాయి. సో దురంధర్ 2, టాక్సిక్ మీద ఉన్న బజ్ ప్రకారం చూసుకుంటే ఇది పెద్దగా ఇబ్బంది పెట్టే విషయం కాకపోవచ్చు. రేపటి నుంచి మార్చి నెల ప్రారంభం కానుండటంతో ప్రమోషన్ల పరంగా టీమ్స్ యాక్టివ్ కాబోతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిని టాక్సిక్ టార్గెట్ చేస్తుండగా మన దక్షిణాది మీద దురంధర్ 2 స్పెషల్ ఫోకస్ పెట్టనుంది. రసవత్తరమైన యుద్దానికి కౌంట్ డౌన్ అయితే మొదలయ్యింది. 

Related Post

జగన్ పర్యటనలు: క్యాడర్‌కు జోష్.. జనాలకు ట్రాఫిక్ కష్టాలుజగన్ పర్యటనలు: క్యాడర్‌కు జోష్.. జనాలకు ట్రాఫిక్ కష్టాలు

పదుల సంఖ్యలో కార్లు, వందల సంఖ్యలో బైక్‌లు.. కాన్వాయ్ నడుస్తుండగా చుట్టూ జనాలు.. పార్టీ జెండాలు.. పూల వర్షాలు.. సందర్భం ఏదైనా కావచ్చు.. పరామర్శల పేరుతో వైఎస్ జగన్ చేస్తున్న యాత్రల తీరు ఇదే. గంటలోపు పూర్తయ్యే ప్రయాణం 6 గంటల

`అయోధ్య`లో చంద్ర‌బాబు`అయోధ్య`లో చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. ఈ ఏడాదిలో తొలిసారి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌ఖ్యాత అయోధ్య రామ‌జ‌న్మ‌భూమిని సంద‌ర్శించారు. ఆదివారం మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్ నుంచి ల‌క్నో చేరుకున్న ఆయ‌న‌.. అయోధ్యకు వెళ్లి బాల రామ‌య్య ఆల‌యంలో శ్రీరాముడికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా రామ‌జ‌న్మ‌భూమి