hyderabadupdates.com movies మెగా మాస్ – 300 కోట్లు… 3 మిలియన్ల డాలర్లు

మెగా మాస్ – 300 కోట్లు… 3 మిలియన్ల డాలర్లు

అంచనాలకు మించి ఆడేస్తున్న మన శంకరవరప్రసాద్ గారు కొన్ని ప్యాన్ ఇండియా సినిమాలకు సైతం సాధ్యం కాని రికార్డులను చాలా అలవోకగా దాటేస్తున్నాడు. రెండేళ్లు గ్యాప్ తీసుకున్న చిరంజీవి ఈ స్థాయిలో బౌన్స్ బ్యాక్ అవుతారని ఊహించిన వాళ్ళు తక్కువ.

ఎనిమిదో రోజే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ వసూలు చేయడమే కాక నార్త్ అమెరికాలో 3 మిలియన్ డాలర్ల మైలురాయిని అందుకుని మెగాస్టార్, అనిల్ రావిపూడి కెరీర్ లో మరో కొత్త మైలురాయిని జోడించింది. రెండో వారం పూర్తి కాకుండా ఈ స్థాయిలో అరాచకం చేయడం చూస్ మెగా ఫ్యాన్స్ సంతోష పడుతున్న వైనం గురించి ఎంత చెప్పినా తక్కువే.

వచ్చే రెండు వారాలు చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో మన శంకరవరప్రసాద్ గారు ఇప్పట్లో తగ్గడం కష్టమే అనిపిస్తోంది. రాజా సాబ్ ఫలితం తేలిపోయింది కాబట్టి రెండో వారం నుంచి దాని థియేటర్లలో గణనీయమైన కోత పడుతుంది. అలా దొరికిన స్క్రీన్లు మెగామూవీకి అధికంగా, తర్వాత అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారికి సర్దుతున్నారు.

ఉన్నంతలో భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా బాగానే లాగేందుకు కష్టపడుతోంది. ఇప్పుడు ఫ్యాన్స్ పెట్టుకున్న టార్గెట్ నాలుగు వందల కోట్ల గ్రాస్. ఇది ఈజీ కాదు కానీ అసాధ్యమని చెప్పలేం. ఎందుకంటే ట్రెండ్ గమనిస్తే ఇంకో వారంలోపే ఈ లాంఛనం అయిపోవచ్చు.

దర్శకుడు అనిల్ రావిపూడి ఊరూరా తిరుగుతూ సక్సెస్ సెలబ్రేషన్స్ ని ఫ్యాన్స్ తో పాటు జరుపుకుంటున్నారు. నిర్మాత సాహు గారపాటి వెంటే ఉన్నారు. హీరోయిన్ నయనతార వచ్చే ఛాన్స్ లేకపోవడం, చిరంజీవి ప్రతి చోటికి రాలేని పరిస్థితి ఉండటం వల్ల ఏ ప్రమోషన్ అయినా సరే అనిల్ రావిపూడి ఒక్కడే చేసుకోవాల్సి వస్తోంది.

త్వరలో సక్సెస్ మీట్ జరిపే ఆలోచన జరుగుతోంది కానీ ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. ఇప్పుడు త్రీ హండ్రెడ్ క్రోర్ టార్గెట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడేమైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి. ఫ్యాన్స్ అయితే దాని కోసం ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ఓపెన్ గ్రౌండ్ లో చేయమని కోరుతున్నారు.

Related Post

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే, జంతువుల కొవ్వు కలపలేదని సీబీఐ చెబుతోందని వైసీపీ నేతలు వాదిస్తుండగా…కెమికల్స్ తో పాటు

`ఆప‌రేష‌న్ త‌మిళ‌నాడు`.. మోడీ స్టార్ట్ చేసేశారా?`ఆప‌రేష‌న్ త‌మిళ‌నాడు`.. మోడీ స్టార్ట్ చేసేశారా?

ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల‌పై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స‌హా బీజేపీ నేత‌ల వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. ఎన్నిక‌ల‌కు మూడు నాలుగు మాసాల ముందుకాదు.. ఏకంగా ఆరేడు మాసాల ముందే ప్లాన్ వేసుకుంటారు. ఎన్నిక‌ల కోడ్ రావ‌డానికి ముందే రాజ‌కీయ వ్యూహాల‌ను