hyderabadupdates.com Gallery మెగాస్టార్ మూవీ స‌క్సెస్ కోడ‌లు ఉపాస‌న ఖుష్

మెగాస్టార్ మూవీ స‌క్సెస్ కోడ‌లు ఉపాస‌న ఖుష్

మెగాస్టార్ మూవీ స‌క్సెస్ కోడ‌లు ఉపాస‌న ఖుష్ post thumbnail image

హైద‌రాబాద్ : అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేశ్, ల‌వ్లీ బ్యూటీ న‌య‌న‌తార , టీవీకే గ‌ణేష్ కీల‌క పాత్ర‌లు పోషించిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు మూవీ దుమ్ము రేపుతోంది. క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తోంది. పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ఈనెల 11న ప్రిమీయ‌ర్ షో ప్ర‌ద‌ర్శించ‌గా జ‌న‌వ‌రి 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది ఈ మూవీ. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో ముందుకు వెళుతోంది. 70 ఏళ్ల వ‌య‌సులో కూడా మెగాస్టార్ చిరంజీవి యువ హీరోలకు ధీటుగా న‌టించ‌డంతో సినిమా బిగ్ స‌క్సెస్ సాధించింది. అంతే కాదు తొలి రోజు ఏకంగా 84 కోట్లు వ‌సూలు చేసింది. ఇదిలా ఉండ‌గా అనిల్ రావిపూడి కామెడీని పండించాడు. వినోదం ఉండేలా చూశాడు. మ్యూజిక్ ప‌రంగా సినిమాకు బిగ్ అస్సెట్ గా మారింది. రాబోయే రోజుల‌లో ఇంకెన్ని కోట్లు వ‌సూలు చేస్తుందో ఎవ‌రూ చెప్ప‌లేమ‌ని అంటున్నారు సినీ రంగం అనలిస్టులు.
ఇదిలా ఉండ‌గా మంగ‌ళ‌వారం మెగాస్టార్ చిరంజీవి న‌టించిన మూవీ స‌క్సెస్ కావ‌డంతో సంతోషాన్ని త‌ట్టుకోలేక పోయింది త‌న కోడలు, ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న కొణిద‌ల‌. ఉపాసన కొణిదెల సోషల్ మీడియా ద్వారా తన మామకి అభినందనలు తెలిపారు. తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఆమె ఇలా రాశారు ఇది ఒక మెగా సంక్రాంతి అంటూ కితాబు ఇచ్చారు. కాగా సాహు గారపాటి , సుష్మిత కొణిదెల సంయుక్తంగా మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు సినిమాను నిర్మించారు. ఈ సంక్రాంతికి ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్స‌ , రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి ఇతర పెద్ద తెలుగు చిత్రాలతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పోటీకి సిద్ధం కావ‌డం విశేషం.
The post మెగాస్టార్ మూవీ స‌క్సెస్ కోడ‌లు ఉపాస‌న ఖుష్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Pawan Kalyan: మంగళంలోని ఎర్రచందనం గోదాములో డిప్యూటీ సీఎం పవన్‌ తనిఖీPawan Kalyan: మంగళంలోని ఎర్రచందనం గోదాములో డిప్యూటీ సీఎం పవన్‌ తనిఖీ

    తిరుపతి జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనిపించే అరుదైన మొక్కలు పరిశీలించి

CM Chandrababu: రేపు యూఏఈకి సీఎం చంద్రబాబుCM Chandrababu: రేపు యూఏఈకి సీఎం చంద్రబాబు

  విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని ఆహ్వానిస్తోంది. ఈ మేరకు సింగపూర్ దేశంలో గతంలో పర్యటించిన ముఖ్యమంత్రి బృందం… ఇప్పుడు యూఏఈకి వెళ్లనుంది. నవంబరు 14,

Vande Bharat 4.0: త్వరలో వందేభారత్‌ 4.0 – కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌Vande Bharat 4.0: త్వరలో వందేభారత్‌ 4.0 – కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌

Vande Bharat : భారతదేశపు సెమీ-హై-స్పీడ్ రైళ్ల జాబితాలో తర్వాత వర్షన్‌ రానుంది. వందేభారత్‌ 4.0 (Vande Bharat)ను అభివృద్ధి చేయనున్నట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) బుధవారం ప్రకటించారు. ఎగుమతి గిరాకీలకు అనుగుణంగా దాని రూపకల్పన ఉంటుందని వెల్లడించారు.