hyderabadupdates.com movies మెగాస్టార్ సినిమా టికెట్ అక్షరాలా రూ.1,11,111

మెగాస్టార్ సినిమా టికెట్ అక్షరాలా రూ.1,11,111

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’ సినిమా ఫీవర్‌ మొదలైంది. ఫస్ట్‌డే–ఫస్ట్‌షో టికెట్ల కోసం మెగా అభిమానులు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో అమలాపురంలో జరిగే ప్రీమియర్‌ షో టికెట్‌ వేలంలో అభిమాని వెంకట సుబ్బారావు రూ.1.11 లక్షలకు టికెట్‌ను దక్కించుకోవడం సంచలనంగా మారింది.

నరసాపురంలోని అన్నపూర్ణ థియేటర్‌లో మరో టికెట్‌ రూ.లక్షా రెండు వేల వరకు పలికింది. అమలాపురంలో తొలి టికెట్‌ను బీజేపీ నాయకుడు వేలంలో సొంతం చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ వేలం ద్వారా సమకూరిన మొత్తాన్ని చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ కు విరాళంగా అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. హీరోలపై ఉన్న అభిమానాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించడం పట్ల పలువురు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.

సంక్రాంతి కానుకగా ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’ చిత్రం జనవరి 12, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా, టికెట్ల వేలాలు ఇప్పటికే మెగా ఫీవర్‌కు నిదర్శనంగా మారుతున్నాయి.

Related Post

‘ప‌వ‌న్‌ను రెచ్చ‌గొట్టాల‌ని చూస్తున్నారు’‘ప‌వ‌న్‌ను రెచ్చ‌గొట్టాల‌ని చూస్తున్నారు’

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వన్ క‌ల్యాణ్‌ను రెచ్చ‌గొట్టాల‌ని కొన్ని శ‌క్తులు చూస్తున్నాయ‌ని టీడీపీ సీనియ‌ర్ నేత‌, రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీని వెనుక వైసీపీ హ‌స్తం ఉంద‌న్నారు. సినీరంగానికి

జగన్ vs వైసీపీ: వస్తామంటారు దారే కనిపించడం లేదు?జగన్ vs వైసీపీ: వస్తామంటారు దారే కనిపించడం లేదు?

వచ్చే ఎన్నికల్లో విజయం మనదే. మన ప్రభుత్వమే వస్తుంది. మీరెవరూ అధైర్యపడొద్దు. నేనున్నాను అంటూ వైసీపీ అధినేత మరియు మాజీ సీఎం జగన్ మరోసారి వైసీపీ కార్యకర్తలకు భరోసా కల్పించారు. తాజాగా ఆయన తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. ఈ

కాకినాడ‌కు భారీ ప్రాజెక్టు.. ఎన్ని వేల కోట్లో….కాకినాడ‌కు భారీ ప్రాజెక్టు.. ఎన్ని వేల కోట్లో….

ఏపీ మంత్రి నారా లోకేష్‌.. శుక్ర‌వారం ఉద‌యం ఒక ట్వీట్ చేశారు. “ఈ రోజు సాయంత్రం అదిరిపోయే క‌బురు చెబుతాను రెడీగా ఉండండి“ అని ప్ర‌జ‌ల‌కు సూచించారు. అన్న‌ట్టుగానే ఆయ‌న తాజాగా శుక్ర‌వారం సాయంత్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కాకినాడ‌కు భారీ