hyderabadupdates.com Gallery రైతులకు పట్టాదారు పుస్తకాలు పంపిణీ

రైతులకు పట్టాదారు పుస్తకాలు పంపిణీ

రైతులకు పట్టాదారు పుస్తకాలు పంపిణీ post thumbnail image

అమ‌రావ‌తి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో గురువారం ప‌ర్య‌టించారు. ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందించారు. గత ప్రభత్వం నిర్వహించిన రీ సర్వే తప్పుల తడకగా ఉండటంతో కూటమి ప్రభుత్వం ఆ తప్పులను సరి చేస్తోందని తెలిపారు. గత ముఖ్యమంత్రి పొలం హద్దుల కోసం పాతే రాళ్లపైనా, రైతులకు ఇచ్చే పట్టాదారు పుస్తకాలపై తన ఫోటోలను ముద్రించుకున్నారంటూ ఆరోపించారు. వీటన్నింటినీ కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16,816 గ్రామాల్లో రీ సర్వే చేయాల్సి ఉండగా, ఇప్పటికే 6,976 గ్రామాల్లో సర్వే పూర్తైందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి రీ సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని తెలిపారు సీఎం. దీంతో పాటు ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రభుత్వం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను రాజముద్రతో అందిస్తోందని పేర్కొన్నారు.
జనవరి నెలలో 4,783 గ్రామాల్లో 18.77 లక్షల పాస్ పుస్తకాలు, ఫిబ్రవరిలో 279 గ్రామాల్లో 1,16,129 పాస్ పుస్తకాలు, మార్చిలో 299 గ్రామాల్లో 1,29,298 పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం అందించిందని చెప్పారు చంద్ర‌బాబు నాయుడు. జనవరి నుంచి 5,717 గ్రామాల్లో 22.79 లక్షల పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు ప్రభుత్వం అందించిందన్నారు. మార్చి 2027 నాటికి 7,518 సిగ్నల్ గ్రామాల్లో 47,02,000 పాస్ పుస్తకాలు ఇచ్చామ‌న్నారు. ఏప్రిల్ 2027 కల్లా 2,438 నాన్ సిగ్నల్ గ్రామాల్లోని 15,02,000 పాస్ పుస్తకాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. మొత్తంగా 9,956 గ్రామాల్లో 62,04,000 పాస్‌బుక్స్ కొత్తవి ఇవ్వాల్సి ఉందన్నారు. బాపట్ల జిల్లాలోని 8 మండలాల్లో 3,658 పాస్ పుస్తకాలు, అలాగే వేమూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని 1,795 పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.
The post రైతులకు పట్టాదారు పుస్తకాలు పంపిణీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

జ‌న‌సేన ఎమ్మెల్యే వ్య‌వ‌హారంపై సమగ్ర విచార‌ణజ‌న‌సేన ఎమ్మెల్యే వ్య‌వ‌హారంపై సమగ్ర విచార‌ణ

విజ‌య‌వాడ : జ‌న‌సేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అర‌వ శ్రీ‌ధ‌ర్ రాస‌లీల వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది. ఓ ప్ర‌భుత్వ ఉద్యోగిని ప‌ట్ల ఆయ‌న అనుసరించిన తీరుపై ఆగ్రహం వ్య‌క్తం అవుతోంది. ఇదే స‌మ‌యంలో బాధితురాలు ధైర్యంగా

Pawan Kalyan Visits Kakinada, Promises Aid to FisherfolkPawan Kalyan Visits Kakinada, Promises Aid to Fisherfolk

Kakinada: Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan visited the Kakinada Collectorate to engage with fishing community representatives from Uppada and state officials. During the meeting, fishermen highlighted the adverse

Supreme Court: లాయర్ రాకేష్‌ కిషోర్‌ పై సుప్రీం కోర్టులో ఆసక్తికర చర్చSupreme Court: లాయర్ రాకేష్‌ కిషోర్‌ పై సుప్రీం కోర్టులో ఆసక్తికర చర్చ

Supreme Court : తనపై షూ విసిరిన లాయర్‌(సస్పెండెడ్‌) రాకేష్‌ కిషోర్‌ (Rakesh Kishore) ను భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయ్‌ క్షమించినా… న్యాయ వ్యవస్థ మాత్రం వదిలిపెట్టడం లేదు. ఆయనపై కోర్టు ధిక్కరణ కింద క్రిమినల్‌ చర్యలకు ఉపక్రమించాలని