hyderabadupdates.com movies లేటు వయసులో నయన్ ‘తెలుగు’ ప్రేమ

లేటు వయసులో నయన్ ‘తెలుగు’ ప్రేమ

నయనతార కథానాయికగా పరిచయం అయి రెండు దశాబ్దాలు దాటిపోయింది. ఇన్నేళ్ల తర్వాత కూడా తమిళ, తెలుగు భాషల్లో అగ్ర కథానాయికగా కొనసాగడం.. అవకాశాలకు లోటు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే మధ్యలో కొన్నేళ్లు ఆమె కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తూ వచ్చింది. స్టార్ల సరసన సినిమాలు తగ్గిపోయాయి. ముఖ్యంగా తెలుగులో ఆమె కెరీర్ దాదాపుగా ఆగిపోయినట్లే కనిపించింది.

కానీ ఈ మధ్య మళ్లీ ఆమె తెలుగు చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తోంది. టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లకు హీరోయిన్లను సెట్ చేయడం కష్టమవుతున్న పరిస్థితుల్లో నయన్, త్రిష లాంటి వాళ్ల వైపే చూస్తున్నారు వారితో సినిమాలు తీసే దర్శక నిర్మాతలు. ఇటీవలే సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ అయిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఇందులో చిరుకు జోడీగా నటించి మెప్పించింది నయన్.

40 ప్లస్ వయసులోనూ అందం, గ్రేస్‌తో ఆకట్టుకున్న నయన్.. పెర్ఫామెన్స్ కూడా అదరగొట్టింది. ఈ సినిమాకు ఆమె ప్రమోషన్లలో కూడా సహకరించడం విశేషం. ‘మన శంకర వరప్రసాద్ గారు’ అంత పెద్ద సక్సెస్ కావడంతో టాలీవుడ్లో నయన్ క్రేజ్ పెరిగింది. అలాగే నయన్‌కు కూడా తెలుగు సినిమాలపై ప్రేమ పెరిగినట్లుంది. వెంటనే ఆమె ఇక్కడ ఇంకో సినిమా అంగీకరించారు. నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయబోయే కొత్త సినిమాలోనూ నయనే కథానాయికగా ఖరారైనట్లు సమాచారం.

బాలయ్య, నయన్‌లది ప్రత్యేకమైన కాంబినేషన్. వీరి కలయికలో సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా సినిమాలు వచ్చాయి. మూడూ విజయవంతం అయ్యాయి. ‘జైసింహా’ వచ్చిన ఏడెనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఈ జోడీని తెరపై చూడబోతున్నాం. ముంబయి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బాలయ్య గ్యాంగ్‌స్టర్ పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. వెంకట సతీష్ కిలారుతో కలిసి బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది. తమన్ సంగీతం అందిస్తాడు. వచ్చే నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది.

Related Post

నా మెడ కోసేశారు: కాంగ్రెస్ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లునా మెడ కోసేశారు: కాంగ్రెస్ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ నా మాట‌కు విలువ లేకుండా పోయింది. నేను ఏమొహం పెట్టుకుని తిర‌గాలి. పార్టీ పెద్ద‌లు.. నా మెడ కోసేశారు“ అని జీవ‌న్

ఆ 40 శాతం కోస‌మైనా చేసిందేముంది.. జ‌గ‌న్ ..!ఆ 40 శాతం కోస‌మైనా చేసిందేముంది.. జ‌గ‌న్ ..!

గ‌త ఎన్నిక‌ల్లో త‌మ‌కు 40 శాతం మేర‌కు ప్ర‌జ‌లు ఓట్లు వేశార‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌ర‌చుగా చెబుతున్నారు. అందుకోస‌మైనా.. వారి త‌ర‌ఫున ప్ర‌శ్నించేందుకైనా.. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాల‌ని ఆయ‌న ఇటీవ‌ల కూడా ప్ర‌భుత్వాన్ని, స్పీక‌ర్‌ను కూడా కోరారు.

క్రేజీ మల్టీస్టారర్: ఏజెంట్ + ఇడియట్ ?క్రేజీ మల్టీస్టారర్: ఏజెంట్ + ఇడియట్ ?

ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగులో మల్టీస్టారర్లు పెరుగుతాయనుకుంటే దానికి భిన్నంగా అంత స్పీడ్ అయితే కనిపించలేదు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను రాజమౌళి అంతటి దిగ్గజం కాకుండా వేరొకరు అయితే బ్యాలన్స్ చేయలేరని భావించేమో ఎవరూ పెద్దగా రిస్క్ చేయలేదు. వాల్తేరు