hyderabadupdates.com Gallery వ‌ర‌ల్డ్ క‌ప్ ఒకే జ‌ట్టుపై ఆధార‌ప‌డి ఉండ‌దు

వ‌ర‌ల్డ్ క‌ప్ ఒకే జ‌ట్టుపై ఆధార‌ప‌డి ఉండ‌దు

వ‌ర‌ల్డ్ క‌ప్ ఒకే జ‌ట్టుపై ఆధార‌ప‌డి ఉండ‌దు post thumbnail image

న్యూఢిల్లీ : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మ‌న్ జే షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చాలా మంది కొన్ని జ‌ట్లు లేకుండా ఎలా ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వ‌హిస్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌శ్నించార‌ని, ఆపై దుష్ప్ర‌చారం చేసేందుకు య‌త్నించార‌ని అన్నారు. ఓ జాతీయ మీడియా నిర్వ‌హించిన అవార్డుల కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా జే షా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగించారు. బంగ్లాదేశ్‌ను ప్రపంచ కప్ నుంచి బయటకు లాగడంపై స్పందించారు. బంగ్లాదేశ్ ఇతరుల మాట విని ప్రపంచ కప్‌ను బహిష్కరించిందని చెప్పారు. దీని ఫలితంగా వారు గ‌ణ‌నీయంగా తమ ఆదాయాన్ని కోల్పోయారని పేర్కొన్నారు జే షా.
అంతే కాకుండా ఈ జట్టు రాకపోతే, ప్రపంచ కప్ ఎలా విజయవంతం అవుతుంద‌ని ఎద్దేవా చేశార‌ని గుర్తు చేశారు. అయితే ఐసీసీ కానీ, లేదా ఇత‌ర సంస్థ‌లు ఎప్పుడూ ఒకే జ‌ట్టుపై ఆధార‌ప‌డి టోర్న‌మెంట్ లు నిర్వ‌హించ‌డం జ‌ర‌గ‌ద‌న్నారు. ఒక‌రు ఉన్నా లేదా బ‌హిష్క‌రించినా ఐసీసీకి ఒన‌గూరే న‌ష్టం అంటూ ఏమీ ఉండ‌ద‌న్నారు. ఇక‌పోతే బ‌హిష్క‌రించే జ‌ట్ల‌కే అన్యాయం జ‌రుగుతుంద‌న్నారు. అన్ని జట్లు సమానంగా పాల్గొంటాయ‌ని తెలిపారు. విచిత్రం ఏమింటే ఐసీసీ ఏ ఒక్క జ‌ట్టుపై ఆధార ప‌డ‌డం కానీ, లేదా ఇంకో జ‌ట్టును ప్రోత్స‌హించ‌డం చేయ‌ద‌న్నారు. ఐసీసీ ప్రపంచ కప్ 7.2 మిలియన్ల ఏకకాల వీక్షణలను అందుకుందని వెల్ల‌డించారు జే షా. ఇది ఇప్పటివరకు అత్యధికం అని, గ‌తంలో ఉన్న అన్ని రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింద‌న్నారు.
ఈ ప్రపంచ కప్‌లో తామ‌ము చాలా ఎదురు దెబ‌బ్బ‌లుతో పాటు షాకింగ్ కు గురైన‌ట్లు తెలిపారు. అమెరికా భారతదేశాన్ని ఆశ్చర్య పరిచిందని, నెదర్లాండ్స్ పాకిస్తాన్‌ను షాక్‌కు గురి చేసిందన్నారు. ఇక జింబాబ్వే ఆస్ట్రేలియాను కూడా ఓడించడంతో టోర్నీ నుంచి నిష్క‌మించింద‌న్నారు. ఈ ప్రపంచ కప్‌ను చిరస్మరణీయంగా మార్చడంలో గణనీయమైన కృషి చేసిన అన్ని అసోసియేట్ జట్లకు కూడా నేను ప్రత్యేక ప్రశంసలు తెలియ జేయాలనుకుంటున్నానని పేర్కొన్నారు జే షా.
The post వ‌ర‌ల్డ్ క‌ప్ ఒకే జ‌ట్టుపై ఆధార‌ప‌డి ఉండ‌దు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Bomb Blasts: బాంబులతో దద్దరిల్లిన ఢాకాBomb Blasts: బాంబులతో దద్దరిల్లిన ఢాకా

    2024 మారణహోమం కేసుకు సంబంధించి ఇంటర్ నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా కేసులో తుది తీర్పును ఈ రోజు (సోమవారం) వెలువరించనుంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనితో

Minister Konda Surekha : బీఆర్ఎస్‌ సోషల్ మీడియాపై మంత్రి కొండా సురేఖ ఫైర్Minister Konda Surekha : బీఆర్ఎస్‌ సోషల్ మీడియాపై మంత్రి కొండా సురేఖ ఫైర్

Konda Surekha : కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ (BRS) శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రి

గ్లోబల్ గ్రీన్ రివల్యూషన్ హబ్‌గా ఏపీగ్లోబల్ గ్రీన్ రివల్యూషన్ హబ్‌గా ఏపీ

దావోస్ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ్లోబల్ గ్రీన్ రివల్యూషన్ హబ్‌గా ఏపీని మార్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. సహజ వ్యవసాయం ఇకపై కేవలం ఎంపిక కాదని అన్నారు. భూమిని బాగు చేయడానికి ఇది అత్యంత