hyderabadupdates.com Gallery వరుణ్‌ తేజ్‌ కొత్త ప్రాజెక్టు!

వరుణ్‌ తేజ్‌ కొత్త ప్రాజెక్టు!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ కెరీర్‌లో ఇటీవల వచ్చిన వరుస వైఫల్యాలు ఆయనకు కొంత వెనుకడుగు అయ్యాయి. దీంతో ప్రస్తుతం ఆయన పూర్తిగా కొత్త జోష్‌తో తిరిగి పుంజుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం వరుణ్ “కొరియన్ కనకరాజు” అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో కొనసాగుతోంది. సమాచారం ప్రకారం నవంబర్ చివరినాటికి అన్ని షెడ్యూల్స్ పూర్తి చేసి, తదుపరి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు.

ఇదిలా ఉండగా, వరుణ్ తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ టాక్. విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించే ఈ లవ్ స్టోరీ గతేడాదే ఫైనల్ అయినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ప్రారంభం ఆలస్యమైంది. కానీ ఇప్పుడు పరిస్థితులు క్లియర్ కావడంతో, వరుణ్ తేజ్ డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు తన డేట్స్‌ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని ముఖ్యమైన షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేసినట్టు తెలిసింది.
The post వరుణ్‌ తేజ్‌ కొత్త ప్రాజెక్టు! appeared first on Telugumopo – Movies and Politics.

Related Post

హిందూ కుటుంబాలు ముగ్గురు పిల్ల‌ల్ని క‌నాలిహిందూ కుటుంబాలు ముగ్గురు పిల్ల‌ల్ని క‌నాలి

ముంబై : రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ అధ్య‌క్షుడు మోహ‌న్ భ‌గ‌వ‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ముస్లింల‌ను దృష్టిలో ఉంచుకుని మాట్లాడిన మాట‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. హిందూ కుటుంబాలు కనీసం ముగ్గురు పిల్లలను కనాల‌ని పిలుపునిచ్చారు. రోజు రోజుకు భార‌త

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయాలిమున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయాలి

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో జ‌రిగే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్ల‌ను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయాల‌ని పిలుపునిచ్చారు. ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తు చేయాల‌ని, ఏ ఒక్క సీటు కోల్పోకూడ‌ద‌ని స్ప‌ష్టం

Bihar Assembly Elections: బిహార్‌లో రికార్డుస్థాయి పోలింగ్‌ ! తొలిదశలో 65% ఓటింగ్ !Bihar Assembly Elections: బిహార్‌లో రికార్డుస్థాయి పోలింగ్‌ ! తొలిదశలో 65% ఓటింగ్ !

    బిహార్‌ శాసనసభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 121 నియోజకవర్గాల్లో గురువారం పండగ వాతావరణంలో జరిగిన ఓటింగులో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 65% మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినోద్‌