hyderabadupdates.com movies వాహ్… రైతులకోసం బురదను సైతం లెక్క చెయ్యని పవన్

వాహ్… రైతులకోసం బురదను సైతం లెక్క చెయ్యని పవన్

వాహ్… రైతులకోసం బురదను సైతం లెక్క చెయ్యని పవన్ post thumbnail image

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పొలంబాట ప‌ట్టారు. తుఫాను ప్ర‌భావంతో భారీగా కురిసిన వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న పొలాల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో గురువారం ప‌ర్య‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని రైతుల‌ను ప‌రామ‌ర్శించారు. కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో నేలకొరిగిన వరి పైరు పరిశీలించారు. బుర‌ద‌లోనే న‌డుస్తూ.. పొలం మ‌ధ్య‌కు వెళ్లి ప‌రిశీలించారు.

రైతుల స‌మ‌స్య‌ల‌ను ఓపిక‌గా విన్నారు. వారికి భ‌రోసా క‌ల్పించారు. ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని తెలిపారు. తుఫాను ప్ర‌భావంతో ప్రాణ న‌ష్టం క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నామ‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పంట‌లు, ఇళ్ల‌కు న‌ష్టం క‌లిగింద‌ని.. దీని నుంచి రైతుల‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. అనంత‌రం అవనిగడ్డ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద తుఫాన్ ప్రభావ దృశ్యాలతో కూడిన ఫోటో ఎక్సిబిషన్ పరిశీలించారు. జ‌రిగిన న‌ష్టాన్ని క‌లెక్ట‌ర్ బాలాజీ ని అడిగి తెలుసుకున్నారు.

సీఎం చంద్ర‌బాబు స‌హా మంత్రులు అంద‌రూ నిరంత‌రం తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల్లోని ప‌రిస్థితిని అంచనా వేశార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. అందుకే.. ప్రాణ న‌ష్టం ముప్పు నుంచి తేరుకున్నామ‌న్నారు. అయితే.. పంట‌లు, ఇళ్లు కూడా దెబ్బ‌తిన్నాయ‌ని ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని హామీ ఇచ్చారు. అయితే.. ప్ర‌స్తుతం ఎన్యూమ‌రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతుంద‌ని.. న‌ష్టాల‌ను అంచ‌నా వేసుకుని.. ప్ర‌భుత్వం ప్ర‌తి ఒక్క‌రికీ న్యాయం చేస్తుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు.

Related Post

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. అంతేకాదు.. ఎవ‌రు ఏమ‌నుకున్నా.. తాము ప్ర‌జ‌ల అభిప్రాయాలు, వారి అభిరుచుల మేర‌కు.. మార్పులు చేర్పులు చేయాల‌ని

దేశంలోనే ఫ‌స్ట్ టైమ్‌: చంద్ర‌బాబు భారీ అగ్రిమెంట్‌!దేశంలోనే ఫ‌స్ట్ టైమ్‌: చంద్ర‌బాబు భారీ అగ్రిమెంట్‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు అనేక పెట్టుబ‌డులు తెచ్చారు. కానీ, మంగ‌ళ‌వారం ఆయ‌న ఢిల్లీలో చేసుకునే ఓ కీల‌క ఒప్పందం మాత్రం ఆయ‌న రాజ‌కీయ జీవితంలోనే అతి పెద్ద ఒప్పందంగా మార‌నుంది. ఈ విష‌యాన్ని ఆయ‌న మ‌రోసారి గుర్తు చేశారు.