hyderabadupdates.com movies వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఇద్దరు దివ్యాంగులతో సమయాన్ని గడిపారు.

గోగన ఆదిశేషు, శెట్టివారి రఘులతో ముచ్చటించారు. మార్కాపురానికి చెందిన రఘు, బాపట్లకు చెందిన ఆదిశేషుల జీవనం, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తున్న దివ్యాంగుల జీవితాలు ఎందరికో స్ఫూర్తిగా ఉన్నాయన్నారు.

వారిద్దరికీ జ్ఞాపికలు అందించారు. వారిద్దరూ మాట్లాడుతూ ‘కూటమి ప్రభుత్వం పింఛను మొత్తాన్ని పెంచడం మూలంగా తమ జీవనానికి ఒక వెసులుబాటు దొరికింది’ అని చెబుతూ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియచేశారు. అనంతరం దివ్యాంగుల దినోత్సవ కేక్ ను కట్ చేశారు.

Related Post

కవితకు ప్రూఫ్ తో కౌంటర్ ఇస్తున్న బీఆర్ఎస్కవితకు ప్రూఫ్ తో కౌంటర్ ఇస్తున్న బీఆర్ఎస్

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో పులుక‌డిగిన ముత్యంలా తిరిగి వ‌స్తానంటూ.. క‌విత చేసిన వ్యాఖ్య‌లు.. ద‌రిమిలా ఢిల్లీ కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇవ్వ‌డం వంటివి తెలిసిందే. అయితే.. మ‌ద్యం కేసుకు-బీఆర్ ఎస్ 2023 ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం కావ‌డానికి ముడిపెట్టిన బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క