hyderabadupdates.com Gallery విజ‌య్ ఎన్డీఏ పొత్తుపై అన్నామ‌లై నో కామెంట్స్

విజ‌య్ ఎన్డీఏ పొత్తుపై అన్నామ‌లై నో కామెంట్స్

విజ‌య్ ఎన్డీఏ పొత్తుపై అన్నామ‌లై నో కామెంట్స్ post thumbnail image

చెన్నై : త‌మిళ‌నాడు మాజీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కె. అన్నామ‌లై టీవీకే పార్టీ చీఫ్ , ప్ర‌ముఖ న‌టుడు త‌ళ‌ప‌తి విజ‌య్ పై కామెంట్స్ చేసేందుకు త‌న‌కు ఎలాంటి అధికారం లేద‌ని స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. విజ‌య్ తో ఎన్డీఏ పొత్తు ఉంటుందా అన్న దానిపై తాను వ్యాఖ్యానించ‌డం స‌రి కాద‌ని అన్నారు. ఇది త‌న ప‌రిధిలో లేద‌న్నారు. తాను ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌బోనంటూ ప్ర‌క‌టించారు. అయితే ఇదే స‌మ‌యంలో అధికార పార్టీ ఓటమిని నిర్ధారించడానికి డీఎంకే వ్యతిరేక ఓట్లన్నింటినీ ఏకీకృతం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. త‌ళ‌ప‌తి విజ‌య్ గొప్ప న‌టుడ‌ని అంగీక‌రించారు.
ఢిల్లీలోని కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల సందర్భంగా అన్నా మలై విలేకరులతో మాట్లాడారు. విజయ్-బీజేపీ పొత్తు ఎన్‌డిఎను బలోపేతం చేస్తుందా అని మీడియా పదేపదే అడిగినప్పుడు నో కామెంట్స్ అంటూ దాట వేశారు కె.అన్నామ‌లై. ఇది వ్యక్తిగత భావనల గురించి కాదు. డీఎంకేకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లన్నీ ఏకీకృతం అయితేనే డీఎంకేను ఓడించడానికి అది ఉత్తమ మార్గం అని అభిప్రాయ‌ప‌డ్డారు. బీజేపీ నాయకుడు తమిళనాడు ఎన్నికల దృశ్యాన్ని డీఎంకే నేతృత్వంలోని కూటమి, ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్‌డిఎ, తమిళగ వెట్రి కజగం (టీవీకే), 8-9 శాతం ఓట్ల వాటా ఉన్న నామ్ తమిళర్ కట్చి (ఎన్‌టికె) అధినేత సీమాన్ పార్టీతో కూడిన నాలుగు కోణాల పోరుగా పేర్కొన్నారు కె అన్నామ‌లై.
The post విజ‌య్ ఎన్డీఏ పొత్తుపై అన్నామ‌లై నో కామెంట్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

J.P Nadda: వికాసానికి, వినాశనానికి మధ్య పోరు బిహార్ ఎన్నికలు – నడ్డాJ.P Nadda: వికాసానికి, వినాశనానికి మధ్య పోరు బిహార్ ఎన్నికలు – నడ్డా

J.P Nadda : బిహార్‌ ఎన్నికలు ఎన్డీయే వికాసానికి, ఇండియా కూటమి వినాశనానికి మధ్య జరుగుతున్న పోరని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా (J.P Nadda) అన్నారు. భాగస్వామ్య పక్షాలను అంతం చేసే పరాన్నజీవి పార్టీ అంటూ కాంగ్రెస్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌డ‌గాల్పుల దెబ్బ‌కు విల‌విల‌ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌డ‌గాల్పుల దెబ్బ‌కు విల‌విల‌

అమ‌రావ‌తి : ఏపీ వాతావ‌ర‌ణ శాఖ తీవ్ర హెచ్చ‌రిక‌లు చేసింది ఏపీ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు. ఎండ వేడిమి మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. అవ‌స‌ర‌మైతే త‌ప్పా బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని కోరింది. సోమవారం నాడు ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాల్లోని 51

పాపులర్ డ్రగ్ పెడ్లర్ అభిషేక్ సింగ్ అరెస్ట్పాపులర్ డ్రగ్ పెడ్లర్ అభిషేక్ సింగ్ అరెస్ట్

హైద‌రాబాద్ : రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌజ్ డ్రగ్స్ కేసులో కీలకంగా భావిస్తున్న పాపులర్ డ్రగ్ పెడ్లర్ అభిషేక్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీ కోసం అభిషేక్ నుండి కొకెయిన్ తెప్పించినట్లుగా.. తానేవెళ్లి తీసుకువచ్చినట్లుగా