hyderabadupdates.com Gallery విద్యార్థి సూసైడ్ కేసులో ఆధారాలు చెరిపేశారు

విద్యార్థి సూసైడ్ కేసులో ఆధారాలు చెరిపేశారు

విద్యార్థి సూసైడ్ కేసులో ఆధారాలు చెరిపేశారు post thumbnail image

కృష్ణా జిల్లా : రోజు రోజుకు సూసైడ్ ల సంఖ్య పెరుగుతోంది శ్రీ చైత‌న్య కాలేజీల‌లో చ‌దువుకుంటున్న విద్యార్థుల సంఖ్య‌. తాజాగా కృష్ణా జిల్లా లోని పెన‌మ‌లూరు పోరంకిలో చ‌దువుకుంటున్న మొల్లి ప‌వ‌న్ కుమార్ సూసైడ్ చేసుకోవ‌డం రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. తోటి విద్యార్థులు దారుణంగా దాడి చేశారు. ఆపై ఇందుకు సంబంధించిన వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఇవి నెట్టింట్లో ట్రెండింగ్ అయ్యాయి. త‌న వ‌య‌సు 17 ఏళ్లు. శ్రీ చైత‌న్య కాలేజీలో ఇంట‌ర్ రెండో సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు. తోటి విద్యార్థి హేమంత్ తో ప‌వ‌న్ కుమార్ గొడ‌వ‌ప‌డ్డారు. దీనిని మ‌న‌సులో పెట్టుకుని ప‌వ‌న్ కుమార్ ను గ‌దిలోకి పిలిపించారు. గ‌త జ‌న‌వ‌రి నెల 5వ తేదీ రాత్రి 11 గంట‌ల‌కు పిలిపించి దారుణంగా కొట్టారు. దీంతో త‌న‌ను హింసించి, దాడికి పాల్ప‌డిన ప్ర‌తి ఒక్క పేరును త‌న చేతిపై రాసుకున్నాడు ప‌వ‌న్ కుమార్.
త‌న‌పై దాడి చేస్తున్న వీడియోలు వైర‌ల్ కావ‌డంతో త‌ట్టుకోలేక పోయాడు. తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యాడు . ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. దీంతో తీవ్ర ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. విష‌యం గ‌మ‌నించిన ప్రిన్సిపాల్ ఆధారాలు బ‌య‌ట‌కు రాకుండా చేశాడు. ఆపై తమ కాలేజీలో ప‌ని చేస్తున్న సిబ్బందిని ప‌వ‌న్ కుమార్ చేతిపై రాసిన వారి పేర్ల‌ను తుడిపి వేయించాడు. ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన విష‌యం బ‌య‌ట‌కు రాకుండా ఆధారాలు చెరిపి వేశారు. ఆనోటా ఈనోటా తెలియ‌డంతో , మృతుడి కుటుంబీకులు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో అస‌లు విష‌యం బ‌య‌ట పడింది. ప్రిన్సిపాల్ తో పాటు ప్రిన్సిపాల్ తో పాటు ఫ్లోర్ ఇన్ ఛార్జి ర‌వీంద్ర‌, మెస్ నిర్వాహ‌కులు హేమంత్, రాజేష్ , జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్లు ఆనంద్, కృష్ణ తో పాటు దాడికి పాల్ప‌డిన వారిని మొత్తం 12 మందిని అరెస్ట్ చేసిన‌ట్లు చెప్పారు డీఎస్పీ చ‌ల‌సాని శ్రీ‌నివాస్ , సీఐ వెంక‌ట ర‌మ‌ణ‌లు చెప్పారు.
The post విద్యార్థి సూసైడ్ కేసులో ఆధారాలు చెరిపేశారు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

జ‌ర్నీలో విజ‌యాల కంటే ఎదురు దెబ్బ‌లే ఎక్కువ‌జ‌ర్నీలో విజ‌యాల కంటే ఎదురు దెబ్బ‌లే ఎక్కువ‌

కేర‌ళ : తన జ‌ర్నీ పూల పాన్పులా సాగ‌లేద‌ని అన్నాడు కేర‌ళ క్రికెట‌ర్ , ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో సంజు శాంస‌న్. త‌ను మీడియాతో మాట్లాడాడు. త‌న ప్ర‌యాణం సాఫీగా ఏమాత్రం సాగ‌లేద‌న్నాడు. ప్ర‌తి రోజూ నేను ఇవాళే

Sabarimala: శబరిమల బంగారం కేసు వెనుక భారీ కుట్ర – కేరళ హైకోర్టుSabarimala: శబరిమల బంగారం కేసు వెనుక భారీ కుట్ర – కేరళ హైకోర్టు

    శబరిమల అయ్యప్ప దేవాలయంలోని విగ్రహాల బంగారం తాపడం బరువు వ్యత్యాసం కేసులో ఏదైనా కుట్ర జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)కు కేరళ హైకోర్టు సూచించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్‌

ప్ర‌భాస్ రాజా సాబ్ త‌ప్ప‌కుండా హిట్ అవుతుందిప్ర‌భాస్ రాజా సాబ్ త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది

హైద‌రాబాద్ : ద‌ర్శ‌కుడు మారుతి సీరియ‌స్ కామెంట్స్ చేశాడు. ప్ర‌భాస్ , మాళ‌విక మోహ‌న్, రిద్దీ కుమార్, నిధి అగ‌ర్వాల్ , సంజ‌య్ ద‌త్ తో క‌లిసి ది రాజా సాబ్ తీశాడు. దీనిని పీపుల్స్ మీడియా నిర్మించింది. భారీ బడ్జెట్